IND vs SL: ఇప్పుడంతా బాగుంది.. సడెన్గా నేను కూడా బ్యాడ్ కెప్టెన్గా కనిపిస్తా..: రోహిత్
శ్రీలంకతో మ్యాచ్కు సన్నాహాల సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రెస్ కాన్ఫరెన్స్లో కీలక విషయాలపై మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) లీగ్ దశలో భాగంగా శ్రీలంకతో ముంబయి వేదికగా తలపడేందుకు భారత్ (IND vs SL) సిద్ధమైంది. వరుసగా ఆరు విజయాలను నమోదు చేసిన టీమ్ఇండియా (Team India) సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వ్యక్తిగత ప్రదర్శనతోపాటు నాయకత్వ పటిమతో భారత్ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో రోహిత్ తన కెప్టెన్సీ స్టైల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘పరిస్థితులును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకుంటా. ప్రతి చిన్న విషయంపైనా విశ్లేషణ చేసి అందుకు తగ్గట్టుగా ప్రణాళికల్లో మార్పులు చేసుకోవాలి. కొన్నిసార్లు అవి ఫలితం చూపవచ్చు. లేదా మరికొన్నిసార్లు ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ, ప్రయత్న లోపం మాత్రం ఉండకూడదు. ప్రతి మ్యాచ్కు తగినంత సన్నద్ధత అవసరం. మైదానంలో తీసుకునే నిర్ణయాలు విజయం కోసం మాత్రమేనని నేను నమ్ముతా. ప్రత్యర్థి జట్ల బలాలు ఏంటి? ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో వారేం చేస్తారు? అనే దిశగానూ ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. ఇదే విషయన్ని బౌలర్లకూ చెబుతా. ఇప్పటి వరకు సమష్టిగా మేము చేసిందిదే. వికెట్ల కోసం వెళ్లడం లేదా బ్యాటర్లను పరుగులు చేయకుండా అడ్డుకొనేందుకు ఫీల్డింగ్లో చురుగ్గా మార్పులు చేయడం కీలకం. చిన్నపాటి మార్పులు, వ్యూహాత్మక నిర్ణయాల వల్ల గేమ్లో మనం ఆధిక్యత ప్రదర్శించేందుకు అవకాశాలు లభిస్తాయి. దానికి తగ్గట్టు వ్యూహ రచనలో సహచర ఆటగాళ్లూ భాగస్వాములు కావడం చాలా ముఖ్యం. ఇది తేలికైన విషయం కాదు. వారు పాటించకపోతే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సఫలీకృతం కావు.
జట్టు విజయాల్లో నాతోపాటు మిగతా పది మందికీ క్రెడిట్ ఇవ్వాలి. జట్టు నిర్ణయాలకు కట్టుబడి మ్యాచ్ను ముందుకు తీసుకెళ్లేది వారే. ఇది కేవలం కెప్టెన్గా నా ఒక్కడి ఆలోచనే కాదు. ఇప్పుడు పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నాయి కాబట్టి అంతా ఓకే. ప్రతి మ్యాచ్ ఫలితంపై నాకు అవగాహన ఉంది. వరుసగా విజయాలు సాధిస్తున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది కనిపించదు. అయితే, ఎప్పుడో ఒకప్పుడు నేను కూడా బ్యాడ్ కెప్టెన్గా కనిపిస్తా. ఇప్పటికైతే జట్టు విజయం కోసం ఏం అవసరమనే దానిపైనే దృష్టిసారించా’’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.
బ్యాటర్గా నా బాధ్యత అదే: రోహిత్
జట్టు కోసం నిస్వార్థంగా బ్యాటింగ్ చేసే రోహిత్ శర్మకు మాజీ క్రికెటర్లు కీలక సూచనలు చేశారని.. కాస్త స్వార్థపూరితంగా బ్యాటింగ్ చేయాలని చెప్పినట్లు విలేకర్లు భారత సారథి దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సమాధానం చెప్పేందుకు కాసేపు వేచి చూసిన రోహిత్.. తర్వాత టీమ్ మేనేజర్ వైపు చూడటంతో హాలంతా నవ్వులు విరిశాయి. ఆ తర్వాత రోహిత్ మాట్లాడుతూ.. ‘‘ఎల్లవేళలా నా బ్యాటింగ్ను ఆస్వాదిస్తా. అయితే, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాల్సిన అవసరమూ ఉంది. అంతేకానీ, ఇష్టమొచ్చినట్లు బ్యాటింగ్ చేయలేను. టీమ్ మెరుగైన స్థితికి చేరే వరకూ మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. అలానే ఆడేందుకు ప్రయత్నిస్తా. ఓపెనర్గా నేను ఇన్నింగ్స్ను సున్నా నుంచి ప్రారంభిస్తా. మ్యాచ్లో మంచి స్థితిలో జట్టు నిలవాలంటే ఆరంభం బాగుండాలి. పవర్ప్లేను అందుకు వినియోగించుకుంటాం. కానీ, ఒక్కోసారి పవర్ ప్లేలోనూ ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. గత మ్యాచ్లో త్వరగా మూడు వికెట్లను కోల్పోయాం. అప్పుడు గేమ్ను మార్చాల్సిన అవసరం ఉంది. బ్యాటర్గా జట్టు కోసం ఏం చేయాలనేది ఆలోచిస్తా. తొలి ఓవర్లో ఎలా ఆడాలి..? ఐదో ఓవర్, పదో ఓవర్ నాటికి గేమ్ను ఏ వ్యూహంతో ముందుకు తీసుకెళ్లాలి? ఎంత స్కోరు చేస్తే పోరాడగలం? అనే అంశాలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగా ఆడేందుకు మాత్రమే ప్రయత్నిస్తా’’ అని వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంటున్న సమయంలో అన్ని ఫ్రాంచైజీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరీ ముఖ్యంగా చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!