Dravid - Taylor : అడవిలో 4000 పులులు .. కానీ ఇక్కడ ద్రవిడ్ మాత్రం ఒక్కడే!
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా తన జీవిత చరిత్ర ‘బ్లాక్ అండ్ వైట్’ పుస్తకం మార్కెట్లోకి..
ఆటోబయోగ్రఫీలో రాస్ టేలర్ వెల్లడి
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా తన జీవిత చరిత్ర ‘బ్లాక్ అండ్ వైట్’ పుస్తకం మార్కెట్లోకి విడుదలైంది. భారత టీ20 లీగ్లో రాజస్థాన్ ఓనర్లలో ఒకరు తనను మొహంపై కొట్టాడని సంచలన విషయం బయటపెట్టిన టేలర్.. టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్తో ఉన్న అనుబంధం గురించి వివరించాడు. 2011లో రాజస్థాన్ జట్టుకు రాస్ టేలర్ ప్రాతినిధ్యం వహించాడు. అప్పుడు రాహుల్ కూడా రాజస్థాన్ తరఫునే ఆడాడు. రాహుల్, ఇటీవల కన్నుమూసిన దిగ్గజ క్రికెటర్ షేన్వార్న్తో డ్రెస్సింగ్ రూమ్ను పంచుకున్నాడు. ఈ క్రమంలో ద్రవిడ్తో కలిసి పులులను చూసేందుకు రంతోమ్బర్ జాతీయ పార్క్కు వెళ్లినప్పుడు జరిగిన సంఘటనను తన ఆటోబయోగ్రఫీలో వెల్లడించాడు. భారతీయ క్రికెటర్లకు ఉన్న క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూశానని పేర్కొన్నాడు. అలానే వారు సాధారణంగా బయటకు వెళ్లడం ఎంత కష్టమో తెలిసిందన్నాడు.
‘‘ఒకసారి ఏదో మాటల సందర్భంగా మీరు ఎన్నిసార్లు పులిని చూశారని రాహుల్ను అడిగా. దానికి సమాధానంగా ‘నేను ఇంతవరకు పులిని ఎప్పుడూ చూడలేదు. దాదాపు 21 యాత్రలకు వెళ్లినా ఒక్కసారి కూడా కనిపించలేదు’ అని రాహుల్ అన్నాడు. ‘21 సఫారీలకు వెళ్లినా పులిని చూడలేదా..? అని నాకైతే ఆశ్చర్యమేసింది. సరేలే నేను డిస్కవరీ ఛానల్ చూస్తానని చెప్పా. ఆ తర్వాత.. మధ్యాహ్నం వేళ ద్రవిడ్తో కలిసి నేషనల్ పార్క్కు వెళ్లా. మేం ఉండే ప్రాంతం నుంచి ఎక్కువ దూరమేమీ లేదు. మా డ్రైవర్కు తన సహచరుడి నుంచి వచ్చిన సందేశం మమ్మల్ని ఎంతో ఆనందానికి గురి చేసింది. T- 17 ట్యాగ్ చేసిన పులి కనిపించిందని చెప్పడంతో దానిని చూసి రాహుల్ ద్రవిడ్ థ్రిల్గా ఫీలయ్యాడు. 21 సార్లు యాత్ర చేసినా కనిపించని పులి.. 22వ సారి మాత్రం కేవలం అర గంటలోనే సందర్శన భాగ్యం కలగడం అద్భుతమనిపించింది’’ అని వివరించాడు.
అయితే పులిని చూడటం కంటే మరొక విషయం తననెంతో ఆశ్చర్యానికి గురి చేసిందని టేలర్ బయోగ్రఫీలో తెలిపాడు. ‘‘పులిని చూసేందుకు ఓపెన్ టాప్ ఎస్యూవీ ఎక్కాం. ఆ బండి ల్యాండ్రోవర్ కంటే కాస్త పెద్దది. అడవిలో కేవలం వంద మీటర్ల దూరంలో పులిని చూడటంతో మాకు ఎంతో ఉత్సాహంగా అనిపించింది. అయితే ఇక్కడే ఒక విషయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. మేము పులిని చూస్తేంటే.. ప్రజలు మాత్రం తమ కెమెరాలను రాహుల్ ద్రవిడ్ వైపు తిప్పేశారు. మేం పులిని వీక్షించిన ఆనందం కంటే వారు రాహుల్ను చూసిన ఆనందమే ఎక్కువగా ఉంది. నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా 4000 పులులు ఉంటాయేమో. కానీ రాహుల్ ద్రవిడ్ మాత్రం ఒక్కడే. అందుకే అతడి పట్ల ఇంత క్రేజ్’’ అని తన పుస్తకంలో రాస్ టేలర్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్