Virat Kohli : కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలనడం అర్థరహితం.. ప్రతి మ్యాచ్ ఆడితేనే ప్రయోజనం
దాదాపు రెండున్నరేళ్లుగా ఒక్క శతకం చేయలేదు.. అలాగని మరీ దారుణంగా ఆడుతున్నాడా అంటే అదేం లేదు. కాకపోతే అతడి స్థాయికి తగ్గ ఆట కాదని..
భువనేశ్వర్ కుమార్ ప్రయాణం అద్భుతమన్న సంజయ్ మంజ్రేకర్
ఇంటర్నెట్డెస్క్: దాదాపు రెండున్నరేళ్లుగా ఒక్క శతకం చేయలేదు.. అలాగని మరీ దారుణంగా ఆడుతున్నాడా..? అంటే అదేం లేదు. కాకపోతే అతడి స్థాయికి తగ్గ ఆట కాదని మాత్రం ఘంటాపథంగా చెప్పొచ్చు. ఇదెవరి గురించి అని కంగారు పడిపోకండి.. గత కొన్ని రోజులుగా అతడి ఫామ్పైనే చర్చ. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా.. అతడే విరాట్ కోహ్లీ. 2019లో బంగ్లాదేశ్పై చివరిసారిగా శతకం చేశాడు. అయితే, అడపాదడపా అర్ధశతకాలు చేస్తున్నా కీలక సమయాల్లో వికెట్ కోల్పోతూ నిరాశపరిచాడు. తగినంత విశ్రాంతి లేకపోవడమే దానికి కారణమని పలువురు వాదిస్తుండగా.. అలాంటిదేమీ లేదని.. ప్రతి క్రికెటరూ ఇటువంటి దశను అనుభవిస్తారని మరికొందరు కొట్టిపడేశారు. ఈ క్రమంలో ఆసియా కప్, ప్రపంచకప్ జట్లలో విరాట్ కోహ్లీ తప్పకుండా ఉండాలని మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ స్పష్టం చేశాడు. అతడిని విశ్రాంతి పేరుతో ఆసియా కప్నకు ఎంపిక చేయకపోవడం తగదని పేర్కొన్నాడు. ఇప్పటికే కావాల్సినంత విశ్రాంతి తీసుకున్నాడని చెప్పాడు.
‘‘ఇప్పటి నుంచి సాధ్యమైనంత వరకు విరాట్ కోహ్లీని ప్రతి అంతర్జాతీయ మ్యాచ్లో ఆడించాలి. కొంతమంది క్రికెట్కు విరామం తీసుకోవాలని చెబుతున్నారు. ఏ ఫార్మాట్ అయినా సరే విశ్రాంతి ఇవ్వడం తగదు. ఇప్పటికే అతడు తగినంత విశ్రాంతి తీసుకున్నాడు. ఎందుకంటే గత రెండేళ్లు పరిశీలిస్తే కోహ్లీ అంతర్జాతీయస్థాయి మ్యాచ్లను పెద్దగా ఆడిందేమీ లేదు. అయినా, విండీస్తో సిరీస్కు కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడం సరైంది కాదు. దీనిపై కోహ్లీతో సెలెక్షన్ కమిటీ మాట్లాడి ఉండొచ్చు. అందుకే మనకు తెలియని లాజిక్ ఏదైనా ఉందేమో చూడాలి. ఇక నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడితే కోహ్లీకి ప్రయోజనం’’ అని సంజయ్ మంజ్రేకర్ వివరించాడు.
గాయాల నుంచి కోలుకొని జాతీయ జట్టులోకి రావడం.. విజయవంతం కావడం చాలా కష్టమని సంజయ్ పేర్కొన్నాడు. అయితే, టీమ్ఇండియా మీడియం పేసర్ భువనేశ్వర్ కుమార్ మాత్రం అద్భుతంగా పుంజుకొని కీలక బౌలర్గా మారడం ప్రశంసనీయమని చెప్పాడు. ‘‘ఇటీవల భువీ ఇంటర్వ్యూ చూశా. ‘ఎక్కువగా బౌలింగ్ వేశా. అందుకే నా రిథమ్ను అందిపుచ్చుకున్నా’ అని అందులో చెప్పాడు. అలానే ఇప్పుడు అతడి కెరీర్ ఉన్నత స్థాయిలో ఉంది. అయితే, 18 నెలల కిందట భువనేశ్వర్ మళ్లీ జాతీయ జట్టులోకి వస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. గోడకు కొట్టిన బంతి ఎంత వేగంగా వస్తుందో... అలానే భువీ పునరాగమనం అద్భుతంగా ఉంది. టీ20 ప్రపంచకప్లో ముఖ్య భూమిక పోషిస్తాడు’’ అని మంజ్రేకర్ తెలిపాడు. ఇతర ఆటగాళ్ల నుంచి పోటీ ఎక్కువైనప్పుడు ఏం చేయాలనేదానిని భువనేశ్వర్ను చూసి నేర్చుకుంటే సరిపోతుందని సంజయ్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్