INDvsSL: నా కెప్టెన్ గబ్బర్!
శ్రీలంకలో పర్యటించే భారత జట్టు సారథ్యం రేసులో శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ ఉంటారని టీమ్ఇండియా మాజీ..
భువీ సైతం రేసులో ఉన్నాడన్న దీప్దాస్
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకలో పర్యటించే భారత జట్టు సారథ్యం రేసులో శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ ఉంటారని టీమ్ఇండియా మాజీ ఆటగాడు దీప్దాస్ గుప్తా అన్నాడు. ఇంగ్లాండ్ సిరీస్కు భువీ ఎంపికవ్వకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదని పేర్కొన్నాడు. అతడు రెండున్నరేళ్లుగా టెస్టు క్రికెట్ ఆడలేదని వెల్లడించాడు.
తొలిసారి భారత్ రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ, రోహిత్, బుమ్రా, షమి సహా 20 మందితో కూడిన జట్టు ఇంగ్లాండ్లో పర్యటిస్తోంది. తెల్లబంతి స్పెషలిస్టులతో కూడిన జట్టు శ్రీలంకలో పర్యటిస్తుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించాడు.
‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఎలాగూ అందుబాటులో ఉండరు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్. కాబట్టి అతడు సారథ్యం రేసులో ఉంటాడు. కెప్టెన్గా ఎవరుంటారన్న సందేహం ప్రస్తుతం అందరిలోనూ ఉంది. నేనైతే ధావన్ అనుకుంటున్నా. భువనేశ్వర్ ఫిట్గా ఉండి ఆడేందుకు సిద్ధమైతే అతడూ మంచి అభ్యర్థే’ అని దీప్దాస్ అన్నాడు.
భువనేశ్వర్ ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికవ్వకపోవడంలో తనకేమీ ఆశ్చర్యం లేదని దీప్దాస్ గుప్తా చెప్పాడు. ‘ఆ సిరీస్కు ఆరుగురు పేసర్లు అందుబాటులో ఉన్నారు. ఆ పరిస్థితులు, పిచ్లు భువీ బౌలింగ్కు అనుకూలంగా ఉంటాయని తెలుసు. కానీ అతడు రెండు, రెండున్నరేళ్లుగా సుదీర్ఘ ఫార్మాట్ ఆడలేదు. 2018 నుంచి ఫిట్నెస్ సమస్యలతో సతమతం అవుతున్నాడు. రంజీ క్రికెట్ సైతం ఆడలేదు. అతడి దేహం ఐదు రోజుల క్రికెట్ను భరిస్తుందో లేదో తెలియదు. శ్రీలంకను దృష్టిలో పెట్టుకొనే అతడిని ఎంపిక చేయలేదేమో’ అని పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం