Neeraj Chopra: పతకాన్ని దిండు పక్కనే పెట్టుకొని నిద్రపోయా
నేను సాధించిన పతకాన్ని దిండు పక్కనే పెట్టుకొని నిద్రపోయా. ఇవి సంతోషకర క్షణాలు. నాపై ఏదో భారం ఉన్నట్లు అనిపించి కొద్దిరోజులుగా సరిగా నిద్రపట్టలేదు. కానీ రాత్రి మాత్రం ప్రశాంతంగా నిద్రపోయా....
ఇంటర్నెట్ డెస్క్: భారతదేశ వందేళ్ల కలను సాకారం చేస్తూ జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్ చరిత్రలోనే అథ్లెటిక్స్లో ఇప్పటివరకు ఒక్క పతకం లేని భారత్కు ఏకంగా బంగారు పతకాన్ని తెచ్చిపెట్టాడు. ఈ విజయం అనంతరం నీరజ్ చోప్రా ఆదివారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఈ గెలుపుతో తనపై ఉన్న ఓ పెద్ద బరువు దిగిపోయినట్లు పేర్కొన్నాడు. కొద్ది రోజులుగా సరిగా నిద్ర లేదని.. కానీ రాత్రి మాత్రం ప్రశాంతంగా నిద్రపోయినట్లు పేర్కొన్నాడు.
‘నేను సాధించిన పతకాన్ని దిండు పక్కనే పెట్టుకొని నిద్రపోయా. ఇవి సంతోషకర క్షణాలు. నాపై ఏదో భారం ఉన్నట్లు అనిపించి కొద్దిరోజులుగా సరిగా నిద్రపట్టలేదు. కానీ రాత్రి మాత్రం ప్రశాంతంగా నిద్రపోయా’ అని పేర్కొన్నాడు. ఒలింపిక్స్ చరిత్రలోనే ట్రాక్ అండ్ ఫీల్డ్లో భారత జాతీయ గీతం మొదటిసారి వినిపించింది. దీనిపై నీరజ్ స్పందిస్తూ.. ఒలింపిక్స్ స్టేడియంలో భారత జాతీయ గీతం వినడం గొప్ప అనుభూతి అని, ఆ క్షణాలను మాటల్లో చెప్పలేనని పేర్కొన్నాడు. ఫీల్డ్లో తన ప్రదర్శన పట్ల మాట్లాడుతూ ‘మొదటి రెండు త్రోల్లోనే పతకం సాధిస్తాననే నమ్మకం వచ్చింది. కానీ నా లక్ష్యం మాత్రం స్వర్ణం. దాని కోసం 100 శాతం కృషి చేశా. నా చివరి త్రోకు ముందే నేను స్వర్ణం సాధించానని తెలిసిపోయింది. ఎందుకంటే నాదే చివరి త్రో. స్వర్ణం గెలవడం మరిచిపోలేని అనుభూతి’ అని ఆనందం వ్యక్తం చేశాడు.
దేశ ప్రజల అంచనాలను నిజం చేస్తూ టోక్యో ఒలింపిక్స్లో పురుషుల జావెలిన్ త్రో విభాగంలో అగ్రస్థానంలో నిలిచి నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఆఖరి ప్రదర్శనలో ఈటెను 87.58 మీటర్లు విసిరి అథ్లెటిక్స్లో భారత్కు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. ఫైనల్లో తొలి అవకాశంలోనే ఈటెను 87.03 మీటర్లు విసిరి నీరజ్ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత మరింత మెరుగుపరుచుకొని 87.58 మీటర్లు విసిరి పతకం పోటీలో ముందుకెళ్లాడు. ఆరు రౌండ్లు ముగిసే సమయానికి పోటీలో పాల్గొన్న అథ్లెట్లలో అత్యధిక దూరం(87.58 మీటర్లు) విసిరిన ఆటగాడిగా నిలిచి పసిడి పతకాన్ని ముద్దాడాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు