Cricket News: మా జట్టులోనూ విజేతలున్నారన్న శనక.. హార్దిక్ భుజానెత్తుకోవడం బాగుందన్న బంగర్!
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ ఫైనల్కు ముందు శ్రీలంక కెప్టెన్ డాసున్ శనక ప్రెస్ కాన్ఫెరెన్స్లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య కీలక బాధ్యతలను తీసుకోవడం అభినందనీయమని మాజీ కోచ్ సంజయ్ బంగర్ వ్యాఖ్యానించాడు. ఆసియా కప్ ఫైనల్లో భారత్కు తేలిగ్గా విజయం దక్కదని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..
భారత్కే అక్కడ ఎక్కువ అవకాశాలు: శ్రీలంక కెప్టెన్
ఆసియాకప్ ముగిసిన ఇరవై రోజుల్లోనే వన్డే ప్రపంచ కప్ జరగనుంది. భారత్ వేదికగా మెగా సమరం జరగనున్న విషయం తెలిసిందే. తమ జట్టు అవకాశాలు ఎలా ఉంటాయనేదానిపై శ్రీలంక కెప్టెన్ డాసున్ శనక మాట్లాడాడు. ఇప్పుడు ఆసియా కప్ ఫైనల్లో భారత్తో తలపడనున్నట్లే.. వన్డే వరల్డ్ కప్లోనూ 2011 సీన్ రిపీట్ అవుతుందా...? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ‘‘మెగా టోర్నీలో ప్రతి జట్టుకు అవకాశాలు ఉంటాయి. అయితే, భారత్కు ఇంకాస్త మెరుగ్గా ఉంటాయి. ఎందుకంటే స్వదేశంలో ఆడటం వారికి అడ్వాంటేజ్. బ్యాటింగ్కు అనుకూలంగా పిచ్లు ఉంటాయి. అలాగే స్పిన్నర్లు రాణించేందుకు అవకాశం ఉంది. మా జట్టులోనూ అలాంటి టాప్ బౌలర్లు ఉన్నారు. ఒంటిచేత్తో విజేతగా నిలపగల సత్తా వారికి ఉంది. బ్యాటింగ్ లైనప్ కూడా బలంగా ఉంది. మా ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే తప్పకుండా విజేతగా నిలుస్తాం’’ అని శనక తెలిపాడు.
పాండ్య ఎంతో పరిణతి సాధించాడు: సంజయ్ బంగర్
హార్దిక్ పాండ్య ఈ ఆసియా కప్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాడని, బాధ్యతలను భుజానెత్తుకోవడం అభినందనీయమని సంజయ్ బంగర్ వ్యాఖ్యానించాడు. ‘‘హార్దిక్ ఎంతో పరిణతి చెందాడు. కొంతకాలం ఫామ్, ఫిట్నెస్ విషయంలో ఇబ్బంది పడ్డాడు. అయితే, ఇప్పుడు మాత్రం ఫిట్నెస్ను అందుకున్నాడు. ఈ క్రమంలో తీవ్రంగా శ్రమించాడు. తన ఆల్రౌండ్ బాధ్యతలను భుజానికెత్తుకుని నిర్వర్తించడం బాగుంది. టీ20ల్లో కెప్టెన్గానూ వ్యవహరిస్తున్నాడు. జట్టులో సమతూకం తేవడంలో హార్దిక్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుత భారత్ జట్టులో బౌలింగ్ ఎటాక్ అద్భుతంగా ఉంది. బుమ్రా, సిరాజ్, షమీతోపాటు కుల్దీప్ యాదవ్ వైవిధ్యంగా బంతులను సంధిస్తున్నారు. మరోవైపు రవీంద్ర జడేజా కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టేస్తున్నాడు’’ అని బంగర్ చెప్పాడు.
మ్యాచ్ రసవత్తరంగా ఉండటం ఖాయం: షోయబ్ అక్తర్
భారత్ - శ్రీలంక జట్ల మధ్య ఆసియా కప్ ఫైనల్ ఆసక్తికరంగా ఉండబోతుందని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు. ‘‘ఆసియా కప్ సూపర్-4 దశలో బంగ్లాదేశ్పై భారత్ ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. అయితే, బంగ్లా అద్భుతంగా పోరాడి విజయం సాధించింది. తప్పకుండా ఇది భారత్ను నిరుత్సాహానికి గురి చేస్తుంది. అలాగే శ్రీలంక చేతిలో పాక్ ఓడిపోవడం దారుణం. ఆసియా కప్ నుంచి నిష్క్రమించడం బాధించింది. ఇక ఫైనల్ గురించి మాట్లాడుకుంటే.. భారత్కు అంత సులువుగా విజయం లభిస్తుందని నేను భావించడం లేదు. శ్రీలంక పోరాట పటిమ కలిగిన జట్టు. ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయలేం. ఫైనల్ మ్యాచ్ మాత్రం రసవత్తరంగా ఉంటుంది’’ అని అక్తర్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంటున్న సమయంలో అన్ని ఫ్రాంచైజీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరీ ముఖ్యంగా చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!