ODI WC 2023: సూర్యకు వన్డేల్లో గొప్ప గణాంకాలు లేవు.. తుది జట్టులో తీవ్ర పోటీ: సన్నీ
వన్డే ప్రపంచకప్లో (ODI WC 2023) వార్మప్ మ్యాచ్ల సందడి ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. భారత్ తన తొలి వార్మప్ మ్యాచ్ను ఇంగ్లాండ్తో శనివారం ఆడనుంది.
ఇంటర్నెట్ డెస్క్: వరల్డ్ కప్ కోసం (ODI World Cup 2023) భారత్ తన తుది స్క్వాడ్ను ప్రకటించేసింది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే, ఇప్పుడు తుది జట్టులో ఎవరు ఉంటారు? అనే చర్చకు తెరలేసింది. మరీ ముఖ్యంగా సూర్యకుమార్కు ఫైనల్ XIలో అవకాశం వస్తుందా అనేది అందరిలోనూ తలెత్తే ప్రశ్న. ఆసీస్తో వన్డే సిరీస్లో రెండు హాఫ్ సెంచరీలు సాధించి ఫామ్లోనే ఉన్నాడు. అయితే టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మాత్రం సూర్య విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘సూర్యకుమార్ అద్భుతమైన ఆటగాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ, వన్డేల్లో అతడు ఇప్పటి వరకు గొప్ప ప్రదర్శనేమీ చేయలేదు. చివరి 15 - 20 ఓవర్లప్పుడు బ్యాటింగ్ చేస్తాడు. తన టీ20 బ్యాటింగ్ స్టైల్ను చక్కగా వినియోగించుకుని పరుగులు చేసేవాడు. అయితే, హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ కూడా మిడిలార్డర్లో రాణిస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో ఆడతాడు. కాబట్టి, సూర్యకుమార్ సెకండ్డౌన్లో ఆడాలంటే వేచి ఉండాల్సిందే. ఒకవేళ అవకాశం వచ్చి భారీ సెంచరీ కొడితే మాత్రం సూర్య ప్లేస్ ఖరారు అవుతుంది’’ అని సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు.
శనివారం తన తొలి వార్మప్లో ఇంగ్లాండ్తో తలపడబోతున్న టీమ్ఇండియా గువాహటికి చేరుకుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ అనంతరం కెప్టెన్ రోహిత్, కోహ్లీ, కొత్తగా జట్టులోకి వచ్చిన అశ్విన్ సహా ఆటగాళ్లంతా గురువారం గువాహటిలో అడుగు పెట్టారు. అక్టోబర్ 3న నెదర్లాండ్స్తో టీమ్ఇండియా మరో వార్మప్ మ్యాచ్లో ఆడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు