ODI WC 2023: వరల్డ్ కప్ వారిదే.. ఫేవరెట్ టీమ్ చెప్పేసిన సునీల్ గావస్కర్
స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ (ODI WC 2023) జరగనుండటంతో భారత్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఐసీసీ ట్రోఫీని గెలిచి పదేళ్ల నిరీక్షణకు తెరదించాలని టీమ్ఇండియా భావిస్తోంది. అయితే, క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) మాత్రం టైటిల్ విజేతగా భారత్ కష్టమేనన్న వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: అక్టోబర్ 5న గతేడాది ఫైనలిస్టులు ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ జట్ల మధ్య (ENG vs NZ) మ్యాచ్తో వన్డే ప్రపంచకప్ (ODI WC 2023) సమరం ప్రారంభం కానుంది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్లు మొదలైన సంగతి తెలిసిందే. నేడు గువహటి వేదికగా భారత్ - ఇంగ్లాండ్ (IND vs ENG) తలపడనున్నాయి. స్వదేశంలో మెగా టోర్నీ జరగనుండటంతో భారతే టైటిల్ విజేత అవుతుందనే అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) మాత్రం విభిన్నంగా స్పందించాడు. తన ఫేవరెట్ మాత్రం ఇంగ్లాండ్ అని పేర్కొన్నాడు. అందుకు గల కారణాలనూ విశ్లేషించాడు.
‘‘డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఈసారి కూడా విజేతగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ జట్టులో ముగ్గురు ఆల్రౌండర్లు ఉన్నారు. వారంతా ప్రపంచస్థాయి ఆల్రౌండర్లు. టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు బ్యాటింగ్ చేయగల సత్తా ఉంది. ఎలాంటి సమయంలోనైనా మ్యాచ్ గతిని మార్చేయగలరు. అందుకే, నా ఫేవరెట్ మాత్రం ఇంగ్లాండ్ అని చెబుతా’’ అని గావస్కర్ తెలిపాడు. అయితే, సునీల్ వ్యాఖ్యలకు భిన్నంగా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) స్పందించాడు. స్వదేశంలో జరిగే వరల్డ్ కప్ కాబట్టి భారత్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నాడు.
‘‘భారత్ ఎలా ఆడబోతుందో చూడాలని ఆసక్తిగా ఉంది. వరల్డ్ కప్ ఫేవరెట్లలో టీమ్ఇండియా కూడా ఉంది. ఆసియా కప్తోపాటు ద్వైపాక్షిక సిరీసుల్లో అద్భుతమైన ప్రదర్శన చేశారు. స్వదేశంలో ఆసీస్పై సిరీస్ను గెలిచిన విషయం తెలిసిందే. అన్ని విభాగాల్లోనూ టీమ్ఇండియా బలంగా ఉంది. షమీ వంటి అత్యుత్తమ పేస్ బౌలర్ భారత పిచ్లపై రాణిస్తాడు. ఆసీస్తో బెంచ్కే పరిమితమైనప్పటికీ మిగతా బౌలర్లు రాణించి విజయం సాధించారు. దీనిని బట్టి భారత రిజర్వ్ బెంచ్ కూడా ఎంత పటిష్ఠంగా ఉందో ప్రత్యర్థులకు అర్థమైంది’’ అని పఠాన్ తెలిపాడు. భారత్ అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు