Gavaskar: రోహిత్ శర్మ నుంచి ఎక్కువ ఆశించా.. ఆటగాళ్ల మధ్య గ్యాప్ పెరగడానికి అదీ ఒక కారణం: గావస్కర్
రోహిత్ శర్మ కెప్టెన్సీపై భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో టీమ్ఇండియా ద్వైపాక్షిక సిరీస్ల్లో అదరగొడుతున్నా ఐసీసీ టోర్నీలో మాత్రం విఫలమవుతోంది. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్లో సెమీ ఫైనల్లో ఇంటిముఖం పట్టిన భారత జట్టు.. ఇటీవల ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ కెప్టెన్సీ పట్ల తాను సంతృప్తి చెందలేదని, సారథిగా అతని నుంచి మరింత మంచి ప్రదర్శన ఆశించానని సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు.
‘‘నేను రోహిత్ నుంచి చాలా ఎక్కువగా ఆశించాను. భారత్లో గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. విదేశాల్లో గెలుపొందినప్పుడే మన సత్తా ఏంటో తెలుస్తుంది. విదేశీ గడ్డలపై రోహిత్ కెప్టెన్సీ నన్ను నిరాశపర్చింది. టీ20 ఫార్మాట్లోనూ అలానే ఉంది. స్టార్ ఆటగాళ్లున్నా జట్టు ఫైనల్స్కు చేరుకోకపోవడం బాధ కలిగించింది’’ అని సునీల్ గావస్కర్ అన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మరింత జవాబుదారీతనంతో పనిచేయాల్సిన అవసరముందని గావస్కర్ పేర్కొన్నాడు.
జట్టులో ఇది వరకు స్నేహితులుండేవారు.. ప్రస్తుతం సహచరులు (కొలీగ్స్) మాత్రమే ఉన్నారని అశ్విన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో సన్నీ ఏకీభవించాడు. ఆటగాళ్ల మధ్య ప్రేమ, అభిమానం లోపించదని, జట్టు రాణించకపోవడానికి ఇది కూడా ఒక కారణమని గావస్కర్ పేర్కొన్నాడు. ‘‘ఇది నిజంగా బాధకరమైన విషయం. మ్యాచ్ ముగియగానే ఆటగాళ్లందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి. ఆట గురించే కాకుండా మ్యూజిక్, సినిమాలతో మీకిష్టమైన వాటి గురించి చర్చించుకోవాలి. ఈ మధ్య ప్రతి ఆటగాడికి ఒక్కో రూమ్ కేటాయిస్తున్నారు. గతంలో ఆటగాళ్లందరూ ఒకే గదిలో ఉండేవారు. ఆటగాళ్ల మధ్య గ్యాప్ పెరగడానికి ఇది ఒక కారణం’ అని సునీల్ గావస్కర్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన