IPL: వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్కు టాటాగ్రూప్ స్పాన్సర్షిప్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్కు వచ్చే ఏడాది నుంచి స్పాన్సర్లు మారనున్నారు. దేశీయ దిగ్గజ కార్పొరేట్ సంస్థ టాటా గ్రూప్ 2023 ఐపీఎల్ నుంచి స్పాన్సర్గా వ్యవహరించనుంది.
ఇంటర్నెట్డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్కు వచ్చే ఏడాది నుంచి స్పాన్సర్లు మారనున్నారు. దేశీయ దిగ్గజ కార్పొరేట్ సంస్థ టాటా గ్రూప్ 2023 నుంచి ఐపీఎల్ స్పాన్సర్గా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని క్రికెట్ లీగ్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ పీటీఐ వార్త సంస్థకు వెల్లడించారు. ఈ విషయాన్ని ఐపీఎల్ ఈవెంట్స్ గవర్నెంగ్ కౌన్సిల్ మంగళవారం నిర్ణయించింది. ‘‘అవును.. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా టాటా గ్రూప్ వస్తోంది’’ అని బ్రిజేష్ పేర్కొన్నారు.
2018-22 వరకు ఐపీఎల్ స్పాన్సరింగ్ హక్కులను వివో సంస్థ రూ.2,200కోట్లకు దక్కించుకొంది. కానీ, 2020లో గల్వాన్ వద్ద భారత్-చైనా సేనలు ఘర్షణ పడటంతో ఆ ఏడాది వివో స్పాన్సర్ షిప్ నుంచి వైదొలగింది. ఈ నేపథ్యంలో డీమ్11 సంస్థ స్పాన్సరింగ్ బాధ్యతలు స్వీకరించింది. 2021 ఐపీఎల్ టైటిల్ బాధ్యతలను వివోనే తిరిగి స్వీకరించింది. ఆ తర్వాత నుంచి స్పాన్సర్లు మారనున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా టాటా గ్రూప్ బిడ్డింగ్కు ఓకే చెప్పినట్లైంది. దీంతో 2023లో ట్రోఫీ ‘టాటా ఐపీఎల్’గా అభిమానుల ముందుకు రానుంది.
భారత్లోనే నిర్వహించడమే తొలి ప్రాధాన్యం
ఐపీఎల్లోకి వస్తున్న కొత్త జట్లు అహ్మదాబాద్, లక్నవూకు బీసీసీఐ క్లియరెన్స్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఐపీఎల్ 2022 నిర్వహణపై అడిగిన ప్రశ్నకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘‘ భారత్లోనే నిర్వహించేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం. మా తొలి ప్రాధాన్యం కూడానూ అదే. అయితే మార్చిలో కొవిడ్ పరిస్థితులు ఎలా ఉంటాయనేది నిరంతరం గమనించాల్సి ఉంటుంది. అందుకే కరోనా వ్యాప్తిని అనుసరించి ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’’ అని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.