IND vs ENG: భారత్ x ఇంగ్లాండ్ ఆటగాళ్లను భయపెడుతున్న జార్వో 69
టీమ్ఇండియా, ఇంగ్లాండ్ ఆటగాళ్ల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గత రెండు టెస్టుల్లో మైదానంలోకి ప్రవేశించి ఆటకు అంతరాయం కలిగించిన జార్వో 69...
మరోసారి సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి..
లండన్: టీమ్ఇండియా, ఇంగ్లాండ్ ఆటగాళ్ల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గత రెండు టెస్టుల్లో మైదానంలోకి ప్రవేశించి ఆటకు అంతరాయం కలిగించిన జార్వో 69 అనే యూట్యూబర్ తాజాగా జరుగుతున్న నాలుగో టెస్టులోనూ అదే పనిచేశాడు. దీంతో ఆటగాళ్ల భద్రతా లోపాలపై ఆందోళనలు నెలకొన్నాయి. రెండో రోజు తొలి సెషన్లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తుండగా ఉమేశ్ యాదవ్ 34వ ఓవర్లో బౌలింగ్ చేయడానికి వచ్చాడు. మూడు బంతులు వేయగానే జార్వో ఒక్కసారిగా మైదానంలోకి దూసుకొచ్చాడు. అతడు నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉన్న బెయిర్స్టో దగ్గరికి వెళ్లి గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది అతడిని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు.
జార్వో ఇలా వరుస మ్యాచ్ల్లో మైదానాల్లోకి ప్రవేశిస్తున్నా భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారంటూ నెటిజెన్లు, పలువురు క్రికెటర్లు సామాజిక మాధ్యమాల ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇతరులు ఇలా మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లకు ముట్టుకోవడం మంచిది కాదని అంటున్నారు. మరోవైపు జార్వో లీడ్స్ టెస్టులోనూ ఇలాగే చేయడంతో అతడిపై జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయినా, ఇప్పుడు మరోసారి అలా చేయడంతో ఆటగాళ్ల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు రెండో టెస్టులోనూ టీమ్ఇండియా దుస్తులు ధరించిన అతడు మైదానంలోకి ప్రవేశించి ఫీల్డర్లను మోహరించాడు. జడ్డూ, సిరాజ్ అతడిని నిజంగానే టీమ్ఇండియా సభ్యుడని భావించారు. ఇక మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ ఔటైన తర్వాత కూడా బ్యాట్ పట్టుకొని క్రీజు వద్దకు వెళ్లాడు. అప్పుడు గుర్తించిన భద్రతా సిబ్బంది అతడిని బయటకు పంపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు