
IND vs ENG: శుభారంభం దక్కింది.. భారీ స్కోరే మిగిలింది
మూడో రోజు నిలకడగా ఆడుతున్న టీమ్ఇండియా
లండన్: ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా శుభారంభం చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(47*), కేఎల్ రాహుల్(46) తొలి వికెట్కు 83 పరుగులు జోడించారు. జట్టు భారీ స్కోర్ సాధించడానికి గట్టి పునాదులు వేశారు. ఈ క్రమంలోనే అర్ధశతకానికి చేరువైన రాహుల్.. అండర్సన్ బౌలింగ్లో కీపర్ బెయిర్స్టో చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం రోహిత్, పుజారా(14*) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసినా ఆచితూచి బ్యాటింగ్ చేశారు. అలా తొలి సెషన్ పూర్తయ్యేసరికి జట్టు స్కోర్ను 108/1కి తీసుకెళ్లారు. దీంతో టీమ్ఇండియా ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రస్తుతం 9 పరుగుల లీడ్ సాధించింది. ఇక రెండో రోజు చివర్లో రోహిత్, రాహుల్ 43 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.