IPL 2021: అంతదూరం వెళ్తుందని అస్సలు ఊహించలేదు: రాహుల్ త్రిపాఠి
దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ చివరి బంతి వరకు వెళ్తుందని అస్సలు ఊహించలేదని కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మన్ రాహుల్ త్రిపాఠి అన్నాడు. ఆఖరి రెండు బంతుల్లో ఆరు పరుగులు...
(Photo: Rahul Tripathi Twitter)
ఇంటర్నెట్డెస్క్: దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ చివరి బంతి వరకు వెళ్తుందని అస్సలు ఊహించలేదని కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మన్ రాహుల్ త్రిపాఠి అన్నాడు. ఆఖరి రెండు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన స్థితిలో అతడు (12; 11 బంతుల్లో 1x6) సిక్సర్తో కోల్కతాను గెలిపించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఉత్కంఠభరిత పరిస్థితుల్లో జట్టును గెలిపించడం గొప్పగా ఉందన్నాడు. అయితే, సునాయాసంగా గెలుస్తామనుకున్న మ్యాచ్ అంత దూరం వెళ్తుందని ఊహించలేకపోయానన్నాడు.
‘చివర్లో రెండు మూడు ఓవర్లు మాకు కష్టంగా అనిపించింది. మ్యాచ్ అంత దూరం వెళ్తుందని అనుకోలేదు. చివరికి విజయం సాధించడం సంతోషంగా ఉంది. రబాడ 18వ ఓవర్ అత్యద్భుతంగా వేశాడు. ఆ సమయంలో పలు వికెట్లు కోల్పోవడంతో వీలైతే రెండు పరుగులు తీస్తూ బ్యాటింగ్ చేయాలనుకున్నా. సింగిల్ తీస్తే కొత్తగా వచ్చిన బ్యాట్స్మన్కు ఆడటం కష్టమవుతుందని భావించా. బంతి బ్యాట్ మీదకు రాకపోవడంతో షాట్లు ఆడటం కష్టమైంది. అలాంటప్పుడు కొత్త బ్యాట్స్మన్ పరుగులు తీయడం, బౌండరీలు బాదడం అంత తేలిక కాదు. అయితే, ఒక్క షాట్ దూరంలోనే విజయం మా ముంగిట ఉందని తెలుసు. దాంతో నాకు నేను ఆత్మవిశ్వాసం తెచ్చుకొని ఆడాను. తొలి దశ తర్వాత మా జట్టు బలంగా మారింది. సారథి మోర్గాన్, కోచ్ మెక్కలమ్ మమ్మల్ని సానుకూల ధోరణిలో ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించారు’ అని త్రిపాఠి వివరించాడు.
ఈ మ్యాచ్లో దిల్లీ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా మొదట తేలిగ్గా ఛేదిస్తుందని అంతా అనుకున్నారు. ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (55; 41 బంతుల్లో 4x4, 3x6), శుభ్మన్ గిల్ (46; 46 బంతుల్లో 1x4, 1x6) శుభారంభం చేసి జట్టు విజయానికి బలమైన పునాది వేశారు. తొలి వికెట్కు 96 పరుగులు జోడించారు. రబాడ వేసిన 13వ ఓవర్లో అయ్యార్ ఔటయ్యాక నితీశ్ రాణా (13; 12 బంతుల్లో 1x6) క్రీజులోకి వచ్చి కొద్దిసేపటికే వెనుదిరిగాడు. అప్పటికి ఆ జట్టు స్కోర్ 16 ఓవర్లకు 123/2. మిగిలిన నాలుగు ఓవర్లలో కోల్కతా విజయానికి 13 పరుగులే అవసరమయ్యాయి. కానీ, అప్పుడే దిల్లీ బౌలర్లు చెలరేగిపోయారు. వరుస ఓవర్లలో శుభ్మన్ గిల్, దినేశ్ కార్తీక్ (0), ఇయాన్ మోర్గాన్ (0)లను ఔట్ చేశారు. దీంతో చివరి ఓవర్లో ఆ జట్టు విజయానికి 7 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో అశ్విన్ బంతి అందుకొని తొలి రెండు బంతుల్లో సింగిల్ ఇచ్చాడు. మూడు, నాలుగు బంతులను షకిబ్ అసల్ హసన్ (0), సునీల్ నరైన్(0)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో మ్యాచ్ దిల్లీవైపు మొగ్గింది. చివరి రెండు బంతుల్లో కోల్కతా ఆరు పరుగులు చేయాల్సిన స్థితిలో త్రిపాఠి తర్వాతి బంతిని స్టాండ్స్లోకి తరలించాడు. దీంతో ఆ జట్టు ఉత్కంఠభరిత పరిస్థితుల్లో అద్భుత విజయం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.