IPL 2021: ఈరోజు మనం నిరాశపడొచ్చు కానీ.. ఎవరూ బాధపడలేదు: కోహ్లీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథిగా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొమ్మిదేళ్లు పనిచేశాడు. సోమవారం రాత్రి కోల్కతాతో ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోయాక ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు...
(Photo: RCB Twitter)
ఇంటర్నెట్డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథిగా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొమ్మిదేళ్లు పనిచేశాడు. సోమవారం రాత్రి కోల్కతాతో ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోయాక ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో మ్యాచ్ అనంతరం తన జట్టు ఆటగాళ్లతో మాట్లాడాడు. ఆర్సీబీ ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. 2016 తర్వాత ఈ సీజనే తాను అత్యంతంగా ఆస్వాదించినట్లు చెప్పాడు. ఈ ఓటమితో ఆటగాళ్లు నిరాశ చెందినా తమ పోరాటపటిమతో ఆకట్టుకున్నారన్నాడు.
‘నిజం చెప్పాలంటే మాకు 2016 టోర్నీ ఎంతో ప్రత్యేకమైంది. ఆ సీజన్ తర్వాత మళ్లీ ఇప్పుడే అంత బాగా ఆస్వాదించాను. ఈ బృందంతో కలిసి ఆడటం. గెలుపోటములు సమానంగా స్వీకరించడం లాంటివన్నీ నా కెంతో ప్రత్యేకం. కప్పు సాధించేందుకు ప్రతి ఒక్కరం చాలా కష్టపడ్డాం. ఈ ఓటమితో మనం నిరాశ చెందామనేది నిజమే అయినా ఎవరూ మనసు విరిగేంతగా బాధపడినట్లు కనిపించలేదు. దీన్ని జీర్ణించుకోవడం కష్టమే అయినా మనం ఆడిన తీరుకు గర్వంగా ఉంది. ఈ ఫ్రాంఛైజీలో మనం ప్రతిసారీ ఇదే ప్రయత్నిస్తామని అనుకుంటా’ అని కోహ్లీ స్పందించాడు. ఇక ఇన్నాళ్లూ కెప్టెన్గా తాను పూర్తి అంకిత భావంతో పనిచేశానని, ఇకపైనా కెప్టెన్గా అన్ని నిర్ణయాలు తీసుకోకపోయినా నాయకుడిలా అవసరమైన సలహాలు, సూచనలు చేస్తానని చెప్పాడు. ఇక చివరగా ఈ సీజన్ను గుర్తుండిపోయేలా చేసిన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా’ అని కోహ్లీ ముగించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల