US Open: ఎమ్మా రదుకాను ఆట చూడతరమా
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో క్వాలిఫయర్గా అడుగు పెట్టి విజేతగా నిలిచి సంచలనం సృష్టించింది ఎమ్మా రదుకాను. ఫైనల్లో కెనాడా క్రీడాకారిణి లెలా ఫెర్నాండెజ్ను 6-4, 6-3 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది...
ఇంటర్నెట్డెస్క్: యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో క్వాలిఫయర్గా అడుగు పెట్టి విజేతగా నిలిచి సంచలనం సృష్టించింది ఎమ్మా రదుకాను. ఫైనల్లో కెనాడా క్రీడాకారిణి లెలా ఫెర్నాండెజ్ను 6-4, 6-3 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. 1999 తర్వాత ఇద్దరు టీనేజర్ల మధ్య సాగిన ఈ తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ పోరు ఆద్యాంతం హోరాహోరీగా జరిగింది. ఫైనల్ చేరే క్రమంలో రదుకాను.. ఒలింపిక్ ఛాంపియన్ బెన్సిచ్, సకారి లాంటి క్రీడాకారిణులను చిత్తుచేసింది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ ఒసాకా, కెర్బర్, స్వితోలినా, సబలెంకా వంటి అగ్రశ్రేణి క్రీడాకారిణులను మట్టికరిపించింది. ఈ క్రమంలోనే ఫైనల్లో 73వ ర్యాంకులో ఉన్న ఫెర్నాండెజ్ను ఓడించింది. దీంతో 17 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్స్లామ్లో విజేతగా నిలిచిన అతి పిన్న వయస్కురాలిగా ఘనత సాధించింది. ఎమ్మా గురించి మరికొన్ని ఆసక్తికర విశేషాలు..
ఎమ్మా తన రెండో గ్రాండ్స్లామ్ టోర్నిలోనే టైటిల్ నెగ్గింది. అతి తక్కువ గ్రాండ్స్లామ్ల అనుభవంతో విజేతగా నిలిచిన క్రీడాకారిణిగా రికార్డు సొంతం చేసుకుంది. ఈ ఏడాది వింబుల్డన్లో ఆమె నాలుగో రౌండ్ వరకూ వెళ్లగలిగింది. తనకు ఇదే తొలి యుఎస్ ఓపెన్.
150వ ర్యాంకర్గా ఈ టోర్నీలో అడుగు పెట్టిన ఎమ్మా హేమాహేమీలను ఓడించింది. ఈ క్రమంలోనే 2014లో సెరెనా విలియమ్స్ తర్వాత ఒక్క సెట్ కూడా కోల్పోకుండా యుఎస్ ఓపెన్ గెలిచిన తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది.
2004లో 17 ఏళ్ల వయసులో మారియా షరపోవా వింబుల్డన్ టైటిల్ సాధించిన తర్వాత ఓ గ్రాండ్స్లామ్లో విజేతగా నిలిచిన అతి పిన్న వయస్కురాలిగా ఈ బ్రిటిష్ చిన్నది చరిత్ర సృష్టించింది.
ఈ విజయంతో ఎమ్మా.. ట్రోఫీతో పాటు దాదాపు రూ.18.38 కోట్లు (2.5 మిలియన్ల అమెరికా డాలర్లు) నగదు బహుమతి కూడా సొంతం చేసుకుంది. రన్నరప్ ఫెర్నాండెజ్ సుమారు రూ.9.19 కోట్లను అందుకుంది.
1977 తర్వాత ఓ గ్రాండ్స్లామ్ ట్రోఫీ గెలిచిన తొలి బ్రిటీష్ అమ్మాయిగా ఎమ్మా రికార్డు సృష్టించింది. 44 ఏళ్ల క్రితం ఆ దేశానికి చెందిన వర్జీనియా వేడ్ వింబుల్డన్లో విజేతగా నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు