T20 World Cup Winner: బూటులో శీతల పానీయం పోసుకొని తాగి..

తొలిసారి టీ20 ప్రపంచకప్‌ ముద్దాడిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు రచ్చ రచ్చ చేశారు. దుబాయ్‌ మైదానంలో గెలుపు సంబరాలు చేసుకున్నారు. తుదిపోరులో న్యూజిలాండ్‌ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ 18.5 ఓవర్లలోనే ఛేధించింది...

Updated : 15 Nov 2021 10:23 IST

(Photo: ICC Instagram video screenshot)

ఇంటర్నెట్‌డెస్క్‌: తొలిసారి టీ20 ప్రపంచకప్‌ ముద్దాడిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు దుబాయ్‌ మైదానంలో గెలుపు సంబరాలు చేసుకున్నారు. తుదిపోరులో న్యూజిలాండ్‌ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ 18.5 ఓవర్లలోనే ఛేధించింది. దీంతో కంగారూ ఆటగాళ్లు సంతోషంలో మునిగితేలారు. సౌథీ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌ (28 నాటౌట్‌) బౌండరీ బాదగానే మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చిన ఆటగాళ్లు ఒకరినొకరు ఆలింగనాలు చేసుకొని సంబరపడ్డారు. తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో గోల గోల చేశారు. ఈ క్రమంలోనే ఆసీస్‌ కీపర్‌ మాథ్యూవేడ్‌, ఆల్‌రౌండర్‌ స్టోయినిస్‌ ఒక బూటులో శీతల పానీయం పోసుకొని తాగారు. గెలుపు సంబరాల్లో భాగంగా వారిద్దరూ ఇలా చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని