Tokyo Olympics: నాన్నా.. నువ్వే నా హీరో.. ఈ పతకం నీకే అంకితం
టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన పురుషుల హాకీ జట్టు కోట్లాది భారతీయుల మోముల్లో ఆనందాన్ని నింపింది. విశ్వక్రీడల్లో హాకీ జట్టుకు 41 ఏళ్ల తర్వాత పతకం దక్కడంతో దేశవ్యాప్తంగా సంబురాలు జరిగాయి....
దిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం సాధించిన పురుషుల హాకీ జట్టు కోట్లాది భారతీయుల మోముల్లో ఆనందాన్ని నింపింది. విశ్వక్రీడల్లో హాకీ జట్టుకు 41 ఏళ్ల తర్వాత పతకం దక్కడంతో దేశవ్యాప్తంగా సంబురాలు జరిగాయి. పతకం సాధించిన నేపథ్యంలో భారత ఆటగాళ్లు సైతం భావోద్వేగానికి గురయ్యారు. ఈ విజయంలో జట్టు గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్ కీలక పాత్ర పోషించి హీరోలా నిలిచాడు. గోల్ పోస్టుకు అడ్డుగోడలా నిలిచాడు. జర్మనీపై గెలిచిన అనంతరం అతడు భావోద్యేగంగా స్పందించాడు. హాకీ జట్టు గెలిచిన అనంతరం తన తండ్రి సంబురాలు చేసుకుంటున్న ఓ వీడియోను పంచుకొని.. తాను గెలిచిన ఈ కాంస్యం తన తండ్రికి అంకితమిస్తున్నట్లు పేర్కొన్నాడు. ‘ఈ పతకం నీకే అచ్చా (నాన్న). నువ్వే నా హీరో. నీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా’ అంటూ ట్వీట్ చేశాడు.
దీంతోపాటు మరో ట్వీట్ కూడా చేశాడు. పతకాన్ని అందుకున్న సమయంలో ఫొటోకు ఫోజ్ ఇస్తూ తన 21 ఏళ్ల కల నెరవేరినట్లు తెలిపే పోస్టు చేశాడు. ఈ రెండు ట్వీట్లు ప్రస్తుతం వైరల్గా మారాయి. ఈ ట్వీట్కు ఇప్పటివరకు 96 వేల లైకులు రాగా.. నాన్నకు అంకితమిస్తున్నట్లు తెలిపే పోస్టుకు 80 వేల లైకులకు పైగా వచ్చాయి.
జర్మనీతో జరిగిన కాంస్య పోరులో భారత హాకీ జట్టు చిరస్మరణీయ విజయం అందుకుంది. బలమైన ప్రత్యర్థిని 5-4 తేడాతో ఓడించింది. టీమ్ఇండియా నుంచి సిమ్రన్ జీత్ సింగ్ (17, 34 ని), హార్దిక్ సింగ్ (27ని), హర్మన్ప్రీత్ సింగ్ (29ని), రూపిందర్ పాల్ సింగ్ (31ని) గోల్స్ చేశారు. జర్మనీలో టిముర్ ఒరుజ్ (2ని), నిక్లాస్ వెలెన్ (24ని), బెనెడిక్ట్ ఫర్క్ (25ని), లుకాస్ విండ్ఫెదెర్ (48ని) రాణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు