Chahal- Dhanashree: అప్పటికి చాహల్ ఎవరో తెలియదు..! ధనశ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు
యుజ్వేంద్ర చాహల్ పరిచయమైనప్పుడు అతను ఎవరనేది కూడా తనకు తెలియదని అతని భార్య ధనశ్రీ పేర్కొంది. ఓ ఇంటర్వ్యూలో ఈ జంట ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal), కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ(Dhanashree Verma)ల జంట నెట్టింట సందడి చేస్తుంటుంది. ధనశ్రీ వద్ద చాహల్ డ్యాన్స్ క్లాసులకు వెళ్లగా.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి, 2020 డిసెంబరులో వీరిద్దరూ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడాకుల వార్తలు వచ్చినప్పటికీ.. అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట.. తమ మధ్య పరిచయం, అనుబంధం, ఒకరిలో ఒకరికి నచ్చిన అంశాలు తదితర ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చాహల్ పరిచయమైనప్పుడు అతను క్రికెటర్ అని కూడా తనకు తెలియదని ధనశ్రీ పేర్కొనగా.. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఆమెను నేరుగానే అడిగినట్లు చాహల్ అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.
‘లాక్డౌన్ సమయంలో డ్యాన్స్ నేర్చుకోవాలనే ఆసక్తితో నేనే మొదటగా ధనశ్రీకి మెసేజ్ చేశాను. అప్పటికే టిక్టాక్, ఇతర వీడియోల్లో ఆమె డ్యాన్స్ చూశా. ఆ తర్వాత ఆన్లైన్ క్లాసులు మొదలయ్యాయి. మొదటి రెండు నెలలు డ్యాన్స్ గురించి తప్ప ఇతర విషయాలేమీ మాట్లాడుకోలేదు. అప్పటికి ఇద్దరం స్నేహితులం కూడా కాదు’ అని చాహల్ వెల్లడించాడు. మహమ్మారి విలయం సృష్టిస్తోన్న సమయంలోనూ ధనశ్రీ ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఉండటం తనను ఆకట్టుకుందని పేర్కొన్నాడు. ఇదేలా సాధ్యమని అడిగానని.. అక్కడే ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయని చెప్పాడు. ‘ఆమె తీరు నచ్చింది. నా మాదిరే ఆమె కూడా స్వశక్తితో ఎదిగింది. ఆమెను ఇష్టపడుతున్నానని మా అమ్మకు చెప్పా. డేట్ చేయాలని లేదు.. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ధనశ్రీని కూడా నేరుగానే అడిగేశా’ అని తెలిపాడు.
వేలంలో తీసుకుంటామని హామీ ఇచ్చారు.. ఒక్క బిడ్ కూడా వేయలేదు: చాహల్
చాహల్ మర్యాదపూర్వక వ్యవహార శైలి, ముక్కుసూటితనం తననెంతో ఆకట్టుకున్నాయని ధనశ్రీ వెల్లడించింది. ‘తమ అభిరుచుల విషయంలో అమితాసక్తి చూపే వ్యక్తులంటే నాకు ఇష్టం. డ్యాన్స్ నేర్చుకునే విషయంలో చాహల్ ఎంతో ఉత్సాహం, శ్రద్ధ కనబర్చేవాడు. నాకది నచ్చింది. అనేక విషయాల్లో అతనిలా ఎవరూ ఉండలేరు’ అని పేర్కొంది. జీవిత భాగస్వామి విషయంలో ఆప్షన్లను వెతుక్కోవడం.. ఎంతోమందిని కలవడం వంటివి చేస్తున్న ప్రస్తుత తరంలో.. నేరుగా పెళ్లి ప్రస్తావన తీసుకురావడం సానుకూల ముద్ర వేసింది. పెళ్లి విషయంలో నాపై ఎప్పుడూ ఒత్తిడి లేదు. జీవితంలో చాలా సంతోషంగా ఉన్నా. అంతా బాగుంది’ అని చెప్పింది. అయితే, చాహల్ పరిచయమైనప్పుడు అతను ఎవరనేది తెలియదని.. అతను టీమ్ ఇండియా జట్టులో అరంగేట్రం చేసేనాటికి తాను క్రికెట్ చూడటం మానేసినట్లు ధనశ్రీ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..