Virat Kohli: బట్లర్తో ఏం మాట్లాడాడో బయటపెట్టిన విరాట్
ఇటీవల రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ తనవద్దకు వచ్చి ఏదో మాట్లాడిన విషయాన్ని బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ బయటపెట్టాడు...
(Photo: Jos Buttler Instagram)
ఇంటర్నెట్డెస్క్: ఇటీవల రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ తనవద్దకు వచ్చి ఏదో మాట్లాడిన విషయాన్ని బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ బయటపెట్టాడు. ఈ సీజన్లో ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న కోహ్లీ గురువారం తమ చివరి లీగ్ మ్యాచ్లో గుజరాత్పై 73 పరుగులు సాధించి అందరి దృష్టినీ ఆకర్షించిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ ఫామ్ అందుకొని మునుపటి ఆటగాడిలా కనిపించాడు. అయితే.. ఈ మ్యాచ్కు ముందు కోహ్లీ మాజీ క్రికెటర్ హర్భజన్సింగ్తో ముచ్చటించాడు.
‘ఇటీవల ఓ మ్యాచ్ సందర్భంగా బట్లర్ నావద్దకు వచ్చి నన్ను ఏదో అడగాలని అన్నాడు. దాంతో నేను స్పందిస్తూ.. నువ్వు ఇప్పటికే ఈ టోర్నీలో మేటి బ్యాట్స్మన్గా అగ్రస్థానంలో దూసుకుపోతున్నావ్. నేనసలే పరుగులు చేయలేక ఇబ్బందులు పడుతున్నా. అలాంటిది నువ్వు నన్నేం అడగాలనుకుంటున్నావ్? అని బదులిచ్చాను. దానికి ఇద్దరం కాసేపు సరదాగా నవ్వుకొని మాట్లాడుకున్నాం’ అని విరాట్ వివరించాడు. కాగా, ఈ సీజన్లో కోహ్లీ గుజరాత్తో మ్యాచ్ ముందువరకు 13 మ్యాచ్లు ఆడి ఒకే అర్ధశతకంతో 236 పరుగులు చేశాడు. సగటు 20 కన్నా తక్కువే నమోదైంది. ఇక గుజరాత్తో జరిగిన మ్యాచ్లో పూర్తి ఆత్మవిశ్వాసంతో బ్యాట్తో చెలరేగి రెండో అర్ధ శతకం సాధించాడు. దీంతో లీగ్ స్టేజ్ పూర్తయ్యేసరికి మొత్తం 309 పరుగులు చేశాడు. సగటు 23.77గా మారి కాస్త మెరుగైంది. ఇక బట్లర్ మొత్తం 14 మ్యాచ్లు ఆడి 629 పరుగులు చేయగా సగటు 48.38గా నమోదైంది. దీంతో అత్యధిక పరుగుల వీరుడిగా టాప్లో కొనసాగుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్ను అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. -
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. -
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త