Virender Sehwag: కోహ్లీతో పోటీపడ్డ సచిన్.. మాస్టర్బ్లాస్టర్ విజయ రహస్యం అదే..: సెహ్వాగ్
సచిన్ విజయ రహస్యాన్ని మాజీ డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ వివరించాడు. మాస్టర్ బ్లాస్టర్లో అద్భుతమైన పోటీతత్వం ఉందన్నాడు. ఓ దశలో కోహ్లీతో కూడా పోటీపడ్డాడని తెలిపాడు.
ఇంటర్నెట్డెస్క్: భారత క్రికెట్ మారథాన్ కెరీర్లో అద్భుతమైన రికార్డులు సొంతం చేసుకొన్న ఏకైక ఆటగాడు సచిన్ తెందూల్కర్(Sachin Tendulkar).. మెక్గ్రాత్, ఆంబ్రోస్, షేన్వార్న్, ముత్తయ్య మురళీధరన్ వంటి ఆల్టైమ్ గ్రేట్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొని రికార్డుల వరద పారించాడు. సచిన్ 25ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కొనసాగడం వెనకున్న విజయ రహస్యాన్ని మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) అభిమానులతో పంచుకున్నాడు. ఆటలో మెరుగుదల గురించి నిరంతరం ఆలోచించి.. ఆ దిశగా కృషి చేయడమే సచిన్ను 1989-2013 వరకు మైదానంలో క్రికెట్ గాడ్గా నిలిపిందని అభిప్రాయపడ్డాడు. గంటల కొద్దీ సచిన్ ట్రెయినింగ్లో గడిపేవాడని.. అప్పట్లో కొత్తగా వచ్చిన విరాట్ కోహ్లీ(Virat Kohli)తో కూడా పోటీపడే వాడని వెల్లడించాడు.
‘‘సచిన్ మరికొన్నాళ్లు క్రికెట్ ఆడేవాడని ఎందుకనుకునేవారో తెలుసా..? తన బ్యాటింగ్ను లేదా ఆటతీరును మెరుగుపర్చుకోవడం గురించి ఆలోచించేవాడు. ఒక వేళ బ్యాటింగ్ విభాగంలో కొత్తగా మెరుగుపర్చుకొనేది ఏమీ లేకపోతే.. శతకాలను ద్విశతకాలుగా మార్చేందుకు అవసరమైన ఫిట్నెస్పై దృష్టిపెట్టేవాడు. 2000లో నా కెరీర్ ప్రారభించాను. అప్పట్లో సచిన్ మా కంటే ఎక్కువగా ఫిట్నెస్పై దృష్టిపెట్టాడు. 2008 తర్వాత విరాట్ జట్టులోకి వచ్చాడు. సచిన్ అతడితో పోటీపడ్డాడు. అతడికంటే ఎక్కువగా ఫిట్నెస్పై దృష్టిసారించాడు’’ అని సెహ్వాగ్ ఓ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు.
2013లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికిన సచిన్.. గొప్ప రికార్డులు తన ఖాతాలో వేసుకొన్నాడు. వీటిల్లో అంతర్జాతీయ కెరీర్లో 100 శతకాల రికార్డు అపూర్వమైంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో మరే క్రీడాకారుడు ఇప్పటి వరకు దాని వద్దకు చేరలేదు. ఒక్క టెస్టు క్రికెట్లోనే 51 శతకాలు ఉన్నాయి. ఇక వన్డే చరిత్రలో తొలి ద్విశతకం సచిన్ పేరిటే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్