IND vs WI: ఆ అవార్డు మా అమ్మకిస్తున్నా.. ఎందుకంటే..?: మెకాయ్
ఐదు టీ20ల సిరీస్లో భారత్, వెస్టిండీస్ చెరో మ్యాచ్లో విజయం సాధించి 1-1తో సమంగా నిలిచాయి. విండీస్ బౌలర్ ...
ఇంటర్నెట్ డెస్క్: ఐదు టీ20ల సిరీస్లో భారత్, వెస్టిండీస్ చెరో మ్యాచ్లో విజయం సాధించి 1-1తో సమంగా నిలిచాయి. విండీస్ బౌలర్ మెకాయ్ (6/17) ధాటికి టీమ్ఇండియా 138 పరుగులకే ఆలౌటైంది. అయితే చివరి ఓవర్ దాకా సాగిన మ్యాచ్లో విండీస్ అతికష్టం మీద గెలవగలిగింది. ఆఖరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సిన క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ యువబౌలర్ అవేశ్ ఖాన్కు బంతినిచ్చాడు. తీవ్ర ఒత్తిడి ఉండే పరిస్థితుల్లో తొలి బంతిని అవేశ్ నోబాల్గా వేశాడు. తర్వాతి రెండు బంతుల్లో విండీస్ బ్యాటర్ థామస్ సిక్స్, ఫోర్ కొట్టేసి భారత్ను ఓడించాడు. ఆఖరి ఓవర్లో అవేశ్ ఖాన్కు బదులు సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ (2-0-12-0)కు బౌలింగ్ ఇస్తే ఫలితం వేరేలా ఉండేదేమోనని క్రీడా విశ్లేషకులు అంచనా వేశారు. దాదాపు మూడు గంటలపాటు ఆలస్యంగా మ్యాచ్ జరగడం కూడానూ ఓరకంగా టీమ్ఇండియా ఓటమికి కారణంగా పేర్కొన్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం భారత్, విండీస్ సారథులు రోహిత్ శర్మ, నికోలస్ పూరన్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మెకాయ్ మాట్లాడారు.
మా పంథా మార్చుకోం: రోహిత్
తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు స్కోరు బోర్డుపై కావాల్సినన్ని పరుగులను ఉంచలేకపోయాం. పిచ్ బాగానే స్పందించినా మేం సరిగా బ్యాటింగ్ చేయలేకపోయాం. అయితే ఒక్కోసారి అనుకున్నవిధంగా ఆడలేం. లోపాలను అధిగమించి పాఠాలను నేర్చుకుంటాం. ప్రతి ఒక్కరికి నేర్చుకునేందుకు అవకాశాలు వస్తుంటాయి. ఇక చివరి ఓవర్ గురించి ప్రతి ఒక్కరూ చర్చిస్తారని తెలుసు. అప్పటికి భువి అందుబాటులో ఉన్నప్పటికీ అవేశ్ ఖాన్కు బంతిని ఇవ్వడంపై వ్యాఖ్యలు వస్తుంటాయి. అయితే డెత్ ఓవర్లలో యువ బౌలర్లకు అవకాశం ఇస్తే బాగుంటుందని భావించాం. కాస్త తడబాటుకు గురైనప్పటికీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. 138 పరుగుల లక్ష్యాలను ఇలాంటి పిచ్పై 14 ఓవర్లలోపే ఛేదించే అవకాశం ఉన్నా మ్యాచ్ను చివరి ఓవర్ వరకూ తీసుకెళ్లడంలో బౌలర్లు సఫలీకృతమయ్యారు. తదుపరి మ్యాచుల్లో మా బ్యాటింగ్పై దృష్టిసారిస్తాం. అయితే ఇలాంటి విధానంతోనే బ్యాటింగ్ను కొనసాగిస్తాం. ఏదో ఒక మ్యాచ్లో ఇలా జరిగిందని కంగారుపడిపోయేది లేదు. ఒక్క ఓటమితో మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు.
మాకెంతో కఠినమైన సవాళ్లు: పూరన్
గత కొంతకాలంగా మాకు కఠినమైన సమయం నడుస్తోంది. చాలా మ్యాచ్ల్లో చివరి వరకూ వచ్చి ఓడిపోతున్నాం. ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు అయింది. మెకాయ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. టీ20ల్లో బ్యాటర్లు చాలా దూకుడుగా ఆడతారు. అలాంటి సమయంలో బౌలింగ్ వేయడం సవాళ్లతో కూడుకున్నదే. మ్యాచ్ చివరి ఓవర్ వరకూ వెళ్లినా విజయం సొంతం కావడం సంతోషం. మ్యాచ్ విజయంలో బ్రాండన్ కింగ్ కూడా కీలక పాత్ర పోషించాడు. ఇక నేను, హెట్మయేర్ ఎక్కువ బాధ్యతతో ఆడాల్సిన అవసరం ఉంది. గాయపడి మళ్లీ జట్టులోకి వచ్చిన థామస్ తన సొంత మైదానంలో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మాకు విజయం సాధించి పెట్టడంలో మెకాయ్ బౌలింగ్ ప్రదర్శనే కీలకం. మరీ ముఖ్యంగా ధాటిగా ఆడే దినేశ్ కార్తిక్కు బౌలింగ్ చేసిన విధానం అద్భుతం. ఫుల్ అండ్ లెంగ్త్ బౌలింగ్తో కార్తిక్ను అడ్డుకోవడంలో మెకాయ్ సక్సెస్ అయ్యాడు.
ఫస్ట్ బంతికే వికెట్ తీయడం .. : మెకాయ్ (6/17), ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
(ఫొటో సోర్స్: విండీస్ క్రికెట్ ట్విటర్)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ను మా అమ్మకు అంకితమిస్తున్నా. అనారోగ్యంతో బాధపడుతూ ఉండే ఆమె నన్ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండేది. అందుకే ఈ అవార్డును అమ్మకిస్తున్నా. మొదటి బంతికే వికెట్ తీయడం ఎప్పుడూ బ్యాటర్పై ఒత్తిడిని పెంచినట్లు అవుతుంది. పవర్ప్లేలో వికెట్లు తీసేందుకు చూస్తుంటా. గత మ్యాచ్ (మొదటి టీ20)లో అతిగా ఆలోచించడం వల్లే సరైన ప్రదర్శన చేయలేకపోయా. ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా బౌలింగ్పైనే దృష్టిపెట్టా. ప్రతి మ్యాచ్ నాకు సవాల్తో కూడుకున్నదే. అయితే ఇలాంటి మ్యాచుల్లో ఆడినప్పుడు వచ్చే అనుభవం భవిష్యత్తులో అక్కరకొస్తుంది.
భారత్, విండీస్ రెండో టీ20 మ్యాచ్ విశేషాలు..
* టీ20ల్లో ఆరు వికెట్ల ప్రదర్శన చేసిన ఆరో బౌలర్ మెకాయ్. అతడి కంటేమందు దీపక్ చాహర్ (6/7), అజంతా మెండిస్ (6/8, 6/16), యుజ్వేంద్ర చాహల్ (6/25), అగర్ (6/30) ఉన్నారు.
* భారత్పై అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన బౌలర్ కూడా మెకాయ్ కావడం విశేషం. గతంలో వహిందు హసరంగ (4/9), మిచెల్ సాంట్నర్ (4/11), డారెన్ సామీ (4/16) ఉన్నారు.
* టీ20ల్లో విండీస్ ప్లేయర్ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన బౌలర్ మెకాయ్. అంతకుముందు కీమో పాల్ (5/15), డారెన్ సామీ (5/26), జాసన్ హోల్డర్ (5/27), థామస్ (5/38) ఉన్నారు.
* టీ20 కెరీర్లో తొమ్మిదో సారి రోహిత్ శర్మ డకౌట్గా పెవిలియన్ చేరాడు. అత్యధిక డకౌట్లు అయిన టీమ్ఇండియా క్రికెటర్లలో రోహిత్ శర్మే ముందున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్