IND vs SA : దూకుడులో తగ్గేదేలే.. బవుమాతో విరాట్కోహ్లీ స్వల్ప వాగ్వాదం
విరాట్ కోహ్లీ సారథిగా చాలా అగ్రెసివ్గా ఉంటాడు. మైదానంలో సహచరులను..
ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ సారథిగా చాలా అగ్రెసివ్గా ఉంటాడు. మైదానంలో సహచరులను ప్రోత్సహిస్తూ చురుగ్గా వ్యవహరిస్తుంటాడు. దాదాపు ఐదున్నరేళ్ల తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. అందులోనూ అర్ధశతకం సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. కెప్టెన్సీ లేకపోయినా మైదానంలో తన దూకుడులో ‘తగ్గేదేలే’ అని నిరూపించాడు ఈ పరుగుల రారాజు. ఇంతకీ అసలేం అయిందంటే...!
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ బుధవారం జరిగింది. త్వరగానే ప్రొటీస్ మూడు వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ టెంబా బవుమా (110), డస్సెన్ (129*) శతకాలతో ఆదుకున్నారు. అయితే 36వ ఓవర్ను యుజువేంద్ర చాహల్ వేస్తున్న సందర్భంలో కోహ్లీ, టెంబా బవుమా మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. చాహల్ వేసిన బంతిని బవుమా కొట్టగా మిడాన్లో ఉన్న కోహ్లీ ఒడిసి పట్టుకున్నాడు. వెంటనే కీపర్కు బాల్ను త్రో చేశాడు. అయితే బంతి బవుమా పైనుంచి వెళ్లింది. ఈ సందర్భంగా ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకున్నారు. కొద్దిసేపటికే వివాదం సద్దుమణిగింది. దక్షిణాఫ్రికా 296 పరుగులు చేయగా.. భారత్ 265 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్ను అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. -
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. -
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త