Yash Thakur: ఐపీఎల్ 2024.. యశ్ ఠాకూర్ సెన్సేషనల్ రికార్డు
లఖ్నవూ తరఫున యువ బౌలర్ల హవా కొనసాగుతోంది. మయాంక్ యాదవ్ అత్యధిక ఫాస్ట్ వేసిన బౌలర్గా రికార్డు సృష్టించగా.. తాజాగా యశ్ ఠాకూర్ మరో ఘనత సాధించాడు.
ఇంటర్నెట్ డెస్క్: స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో గుజరాత్ను లఖ్నవూ 33 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్ పతనంలో కీలక పాత్ర యువ బౌలర్ యశ్ ఠాకూర్దే (Yash Thakur). ఐదు వికెట్ల (5/30) ప్రదర్శన చేసిన అతడు.. ప్రత్యర్థి జట్టును చావుదెబ్బ కొట్టాడు. ఈ క్రమంలో ఈ ఐపీఎల్లో అరుదైన ఘనతను తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి (ఇన్నింగ్స్ 15వ ఓవర్) మెయిడిన్ చేసిన బౌలర్గా అవతరించాడు. దీంతోపాటు ఈ సీజన్లో తొలి ఫైఫర్ (ఐదు వికెట్లు) తీసిన బౌలర్గానూ నిలిచాడు. అతడికే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
గిల్ వికెట్ స్పెషల్: యశ్
‘‘ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఆనందంగా ఉంది. శుభ్మన్ గిల్ను ఔట్ చేసేందుకు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగా. దానిని అమలు చేయమని కేఎల్ రాహుల్ సూచించాడు. అది విజయవంతమైంది. దురదృష్టవశాత్తూ మయాంక్ గాయపడ్డాడు. ఈ మ్యాచ్ను చిరస్మరణీయం చేసుకోమని కేఎల్ మద్దతుగా నిలిచాడు. ఐపీఎల్లో తొలిసారి గుజరాత్పై మేం విజయం సాధించాం. గిల్ను ఔట్ చేయడమే గుర్తుండిపోతుంది’’ అని యశ్ ఠాకూర్ వెల్లడించాడు.
డిఫెండ్ చేయొచ్చని భావించాం: కృనాల్ పాండ్య
గుజరాత్పై కృనాల్ పాండ్య అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘బ్యాటింగ్ సమయంలో నేను రెండు బంతులను మాత్రమే ఎదుర్కొన్నా. ఆ సమయంలో పూరన్తో పిచ్ గురించి మాట్లాడా. మేం 15 పరుగుల వరకు తక్కువ చేసినట్లు అనిపించింది. కానీ, చివరికి ఆ స్కోరును డిఫెండ్ చేయగలిగాం. పిచ్ అలా మారిపోయింది. బ్యాటర్ల బలాలు, బలహీనతలను తెలుసుకోవడం నాకిష్టం. దానికి అనుగుణంగానే బంతులను సంధించేందుకు ప్రయత్నిస్తా. మళ్లీ బౌలింగ్లో లయను అందుకోవడం సంతోషంగా ఉంది. మయాంక్ గాయం పరిస్థితి ఏంటో తెలియదు. అతడి పరిస్థితి బాగానే ఉందనిపించింది. నెట్స్లోనూ తూటాల్లాంటి బంతులను సంధిస్తాడు.. మంచి భవిష్యత్తు ఉంది’’ అని కృనాల్ పాండ్య అన్నాడు.
మ్యాచ్లో మరికొన్ని విశేషాలు..
- ఐపీఎల్లో గుజరాత్ చేసిన రెండో అత్యల్ప స్కోరు ఇదే. లఖ్నవూపై 130 పరుగులకు ఆలౌటైంది. గతేడాది దిల్లీపై 125/6 స్కోరు మాత్రమే చేయగలిగింది.
- ఐపీఎల్లో గుజరాత్ రెండోసారి మాత్రమే ఆలౌట్ అయింది. గతేడాది తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో చెన్నైపై 157 పరుగులకు పది వికెట్లను కోల్పోయింది.
- లఖ్నవూ తరఫున అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన రెండో బౌలర్ యశ్ ఠాకూర్. గుజరాత్పై 30 పరుగులకు ఐదు వికెట్లు తీశాడు. గతేడాది దిల్లీపై మార్క్వుడ్ 14 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టాడు.
- గుజరాత్పై ఐదు వికెట్లు తీసిన మూడో బౌలర్గా యశ్ ఠాకూర్ నిలిచాడు. అంతకుముందు ఉమ్రాన్ మాలిక్ (5/25), భువనేశ్వర్ కుమార్ (5/30) ఈ ఘనత సాధించారు. వీరిద్దరూ హైదరాబాద్ బౌలర్లే కావడం విశేషం.
- లఖ్నవూ తరఫున అత్యుత్తమ ఎకానమీతో బౌలింగ్ చేసిన టాప్ బౌలర్ కృనాల్ పాండ్య. ఈ మ్యాచ్లో 4 ఓవర్ల కోటాలో 11 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు.
- ఐపీఎల్లో లఖ్నవూ తొలుత బ్యాటింగ్ చేసిన 18 మ్యాచుల్లో 15 విజయాలను నమోదు చేసింది. రెండింట్లో మాత్రమే ఓటమిపాలైంది. ఒక మ్యాచ్లో ఎలాంటి ఫలితం రాలేదు. కనీసం 160+ స్కోరు చేసిన 13 మ్యాచుల్లోనూ లఖ్నవూ విజయం సాధించడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంటున్న సమయంలో అన్ని ఫ్రాంచైజీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరీ ముఖ్యంగా చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
-
దుబాయ్లో మళ్లీ వర్షాలు.. ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చిన భారత ఎయిర్లైన్స్
-
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
-
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!