కండక్టర్కు పాజిటివ్.. ప్రయాణికుల్లో ఆందోళన
ఓ బస్సు కండక్టర్ విధుల్లో ఉండగానే కరోనా పాజిటివ్ అని సమాచారమందడంతో ప్రయాణికులు ఆందోళనచెందారు. ఆర్టీసీ వరంగల్-2 డిపో ఎక్స్ప్రెస్ సర్వీసు ఉదయం 5.30 గంటలకు హనుమకొండ నుంచి మంచిర్యాల
హనుమకొండ కలెక్టరేట్, న్యూస్టుడే: ఓ బస్సు కండక్టర్ విధుల్లో ఉండగానే కరోనా పాజిటివ్ అని సమాచారమందడంతో ప్రయాణికులు ఆందోళనచెందారు. ఆర్టీసీ వరంగల్-2 డిపో ఎక్స్ప్రెస్ సర్వీసు ఉదయం 5.30 గంటలకు హనుమకొండ నుంచి మంచిర్యాల జిల్లాలోని చెన్నూరుకు బయలుదేరింది. అక్కడికి చేరుకున్న వెంటనే ఆ బస్సు కండక్టర్ బస్టాండులో కరోనా పరీక్షలు చేయించుకుని తిరిగి ప్రయాణికులతో హనుమకొండకు బయలుదేరారు. బస్సు గోదావరిఖనికి చేరుకున్నాక కండక్టర్కు పాజిటివ్ వచ్చినట్లు సంక్షిప్త సందేశం అందింది. దీంతో ప్రయాణికులను దించేసి ఖాళీగా హనుమకొండకు వచ్చారు. ఈ విషయం తెలియగానే ప్రయాణికులు ఆందోళన చెందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
-
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం
-
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
-
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
-
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు