సింగరేణి గనిలో కూలిన పైకప్పు..ఒకరి మృతి

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. వకిల్‌పల్లి గనిలో పైకప్పు కూలడంతో ఓవర్‌మెన్‌ నవీన్‌ మృతిచెందాడు.

Published : 29 Oct 2020 19:36 IST

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. వకిల్‌పల్లి గనిలో పైకప్పు కూలడంతో ఓవర్‌మెన్‌ నవీన్‌ మృతిచెందాడు. గనిలో మూడో సీమ్‌ 66 లెవల్‌ 44 డీప్‌ వద్ద పైకప్పు ఒక్కసారిగా కూలింది. ఈ ఘటనలో ప్రమాద స్థలానికి దగ్గరలో పనిచేస్తున్న ఓవర్‌మెన్‌ గల్లంతయ్యాడు. అనంతరం రెస్క్యూ బృందాలు నవీన్‌ మృతదేహాన్ని గుర్తించారు. ఘటన సమయంలో అక్కడే ఎల్‌హెచ్‌డీ యంత్రంపై పని చేస్తున్న ఆపరేటర్‌ వెంటనే అప్రమత్తమై ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని