Medaram 2022: ప్రజల జీవన విధానాన్ని తెలుసుకునేందుకే రోడ్డు మార్గంలో వచ్చా: తమిళిసై
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. జాతర చివరి రోజు కావడంలో గత రెండు రోజులతో పోల్చితే ఇవాళ భక్తులు
ములుగు: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. జాతర చివరి రోజు కావడంలో గత రెండు రోజులతో పోల్చితే ఇవాళ భక్తులు భారీ సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. దీంతో మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అమ్మవార్లకు బంగారం సమర్పించిన భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం వెళ్లిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. వన దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన ప్రజలందరికీ సమ్మక్క-సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు అందరూ ఐశ్వర్యం, సంతోషం, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని అమ్మవార్లను ప్రార్థించినట్లు గవర్నర్ తెలిపారు.
గవర్నర్ మాట్లాడుతూ.. ‘‘భక్తులతో కలిసి అమ్మవార్లను దర్శించుకోవాలనుకున్నాను. రాష్ట్ర గవర్నర్గా నాకు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అడగలేదు. అయితే ప్రొటోకాల్ ప్రకారం అధికారులు ఏర్పాట్లు చేసి ప్రత్యేకంగా దర్శనం కల్పించారు. నేను ప్రజల్లో ఒకదానిగా ఉండాలని అనుకుంటున్నాను. సాధారణ భక్తుల మాదిరిగానే సమ్మక్క-సారలమ్మను దర్శించుకోవాలన్నది నా ఆకాంక్ష. అందరినీ కలిసి ఇక్కడి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకునేందుకే హెలికాప్టర్లో కాకుండా రోడ్డు మార్గంలో వచ్చాను. నా పర్యటన వల్ల సాధారణ భక్తులు అసౌకర్యానికి గురైతే నన్ను మన్నించాలి. రానున్న రోజులత్లో ఆదివాసీల కోసం అనేక కార్యక్రమాలను తీసుకొస్తున్నాం. ఆదివాసీలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వారిలో ఈ సమస్య నివారణకు ప్రయత్నిస్తున్నాను. ఇప్పటికే చికిత్సలు, మహబూబా లడ్డూలు పంపిణీ చేశాం. ప్రభుత్వ సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఉంది’’ అని గవర్నర్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు
ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ చేరుకుని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
‘మేం ఓట్లు అమ్ముకోం.. మా ఇంటికి రావొద్దు’
మరో వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల వేటలో నిగమ్నమయ్యాయి. -
విజయవాడలో ప్రధాని రోడ్షో నేడు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ.. బుధవారం విజయవాడ నగరంలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్షోలో పాల్గొననున్నారు. ప్రధానితోపాటు తెదేపా, జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కూడా హాజరవుతారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 70కి పైగా విమానాలు రద్దు
-
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
-
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు
-
ఇజ్రాయెల్కు భారీ షాకిచ్చిన అమెరికా.. కీలక ఆయుధ సరఫరా నిలిపివేత
-
గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా