వైకాపా అభ్యర్థులు.. ‘సొంతింట్లో విలన్లు’!
‘అమ్మకు అన్నం పెట్టనోడు...పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా ?’ పలువురు వైకాపా అభ్యర్థులను చూశాక ప్రజల ప్రశ్న ఇది.
అయినవారికి అన్యాయం చేసినవారు.. జనానికి ఏం మేలు చేస్తారంటూ కుటుంబసభ్యుల నిలదీత
జగన్కు ఓటు వేయొద్దంటున్న చెల్లెళ్లు, చిన్నమ్మ
ఎన్నికల వేళ వ్యతిరేకంగా ప్రచారం
ముద్రగడ తీరుపై కుమార్తె తిరుగుబాటు
ఈనాడు, అమరావతి: ‘అమ్మకు అన్నం పెట్టనోడు...పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా ?’ పలువురు వైకాపా అభ్యర్థులను చూశాక ప్రజల ప్రశ్న ఇది. వైకాపా అధ్యక్షుడు, సీఎం జగన్ నుంచి మొదలు ఆ పార్టీలోని పలువురు అభ్యర్థులను ఇంటి పోరు వేధిస్తోంది. ఈ పంచాయితీ ‘నీచుడు’, ‘దుర్మార్గుడు’ అని తిట్ల దండకం మొదలు.. ‘మా అన్నను ఓడించండి’, ‘మా నాన్నకు ఓటేయొద్దు’ అని బహిరంగంగానే పిలుపునిచ్చే స్థాయిలో ఉంది. అయినవారి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారిలో జగనే ముందువరుసలో ఉన్నారు. పార్టీ పెద్దకే తప్పలేదు.. ఇక మా గొడవలేం లెక్కలోకి వస్తాయని అభ్యర్థులు భావిస్తున్నారు. ప్రజలు మాత్రం ‘ఇంట గెలవలేని వాళ్లు....’ రేపు పాలననేం ఉద్ధరిస్తారని పెదవి విరుస్తున్నారు. సొంత మనుషులకు న్యాయం చేయలేని వారు, జనానికేం చేస్తారంటూ జగన్ చెల్లెళ్లు షర్మిల, సునీత బహిరంగంగా ప్రశ్నిస్తుండటంతో ప్రజలు ఆలోచనలో పడుతున్నారు. అసలు సొంతింటి ఓట్లే సంపాదించుకోలేక సతమతం అవుతున్న ఈ నేతలు రేపు జనాలకు ఏపాటి నచ్చజెప్పుతారో చూడాలి మరి..!
చీడపురుగు మా మామ..!
నారాయణస్వామి × మేనల్లుడు
గంగాధర నెల్లూరులో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అరాచకాలపై ఆయన మేనల్లుడు రమేశ్బాబు బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఆయన మోసం చేశారని..రమేశ్ వైకాపాను వీడి కాంగ్రెస్లో చేరి అదే నియోజకవర్గంలో బరిలోకి దిగారు. వైకాపాలో కొనసాగుతున్నప్పుడే నారాయణస్వామిని బహిరంగంగా విమర్శించారు. ‘నారాయణస్వామి కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాళ్లు పట్టుకునే పదవులు పొందారు. తర్వాత జగన్ కాళ్లు పట్టుకొనే ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. సీటు రాకుండా జ్ఞానేంద్రరెడ్డి అడ్డుకుంటున్నారని, ఆయనతో మాట్లాడే వారిపై కేసులు పెట్టించారు. మాపై దాడి చేయించే యత్నం చేశారు. ఇప్పుడు ఆయనే స్వయంగా జ్ఞానేంద్రరెడ్డిని కలిశారు. నియోజకవర్గాన్ని ముక్కలుగా చేసిన చీడపురుగు మా మామ’ అని నారాయణస్వామి వ్యవహారాలను ప్రస్తావిస్తున్నారు.
అలాంటి వ్యక్తిని జీవితంలోనే కలవకూడదు
అంబటి × అల్లుడు
సత్తెనపల్లిలో వైకాపా అభ్యర్థిగా బరిలో ఉన్న మంత్రి అంబటి రాంబాబు అరాచకాలపై ఆయన రెండో అల్లుడు డాక్టర్ గౌతమ్ వీడియో సందేశాల ద్వారా వివరిస్తున్నారు. అంబటిలాంటి వారికి ఓట్లు వేయవద్దని విజ్ఞప్తి చేశారు. ‘అంబటి రాంబాబు అంత నీచుడు, దరిద్రుడిని నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అలాంటి వ్యక్తిని జీవితంలో ఇంకెప్పుడూ కలవకూడదని కోరుకుంటా. అంత భయంకరమైన వ్యక్తి అతను’ అని అంబటికి ఓటేస్తే సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించినట్లేనని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
తండ్రి మోసం చేశారని రోడ్డెక్కిన కుమారుడు
బూడి × కుమారుడు
ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మోసం చేశారని ఆయన కుమారుడు రవికుమార్ రోడ్డెక్కారు. తన తల్లి, అక్కనూ పట్టించుకోలేదంటూ బూడి గతంలో ప్రాతినిధ్యం వహించిన మాడుగులలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. సొంతంగా ప్రచారం చేసుకుంటూ తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. ప్రస్తుతం ముత్యాలనాయుడు అనకాపల్లి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తూ, తన రెండో భార్య కుమార్తెకు మాడుగుల అసెంబ్లీ టికెట్ ఇప్పించుకున్నారు.
భార్య సహాయ నిరాకరణ
దువ్వాడ శ్రీనివాస్ × భార్య
టెక్కలి వైకాపా అభ్యర్థి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్యాయం చేశారని ఆయన భార్య వాణి ఏకంగా సీఎం జగన్ వద్దే పంచాయితీ పెట్టారు. దీంతో అప్పటి వరకూ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న శ్రీనివాస్ను తప్పించి ఆ బాధ్యతను వాణికి అప్పగించారు. చివరికి టికెట్ శ్రీనివాస్కే ఇచ్చారు. ఆగ్రహించిన వాణి స్వతంత్రంగా బరిలోకి దిగేందుకు చూడగా.. వైకాపా నేతలు నచ్చజెప్పే యత్నం చేశారు. ఆ క్రమంలోనే శ్రీనివాస్ కొన్ని ఆస్తులను వాణి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని తెలిసింది. కానీ, తమను మోసం చేశారని వాణి, ఆమె తండ్రి రాఘవరావు.. శ్రీనివాస్తో కలవడం లేదు. రాఘవరావుకు 1983 నుంచి టెక్కలిలో రాజకీయంగా పట్టు ఉండటంతో వీరిని తనవైపు తిప్పుకొనేందుకు శ్రీనివాస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
మా నాన్నను వ్యతిరేకిస్తున్నా..
ముద్రగడ × కుమార్తె
వైకాపా నేత ముద్రగడ పద్మనాభం ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పిఠాపురంలో వైకాపా ఎన్నికల బాధ్యత నిర్వర్తిస్తున్నారు. అక్కడ పోటీలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్పై విమర్శలు చేస్తున్నారు. వాటిని ముద్రగడ కుమార్తె క్రాంతి ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. ‘పిఠాపురంలో పవన్ను ఓడించేందుకు వైకాపా నేతలు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ను ఓడించి పిఠాపురం నుంచి తరిమేయకపోతే మా నాన్న పేరు ‘ముద్రగడ పద్మనాభరెడ్డి’గా మార్చుకుంటారట. మా నాన్నను కేవలం పవన్ను తిట్టడానికే జగన్ వాడుతున్నారు. ఈ విషయంలో నేను మా నాన్నను వ్యతిరేకిస్తున్నా’ అని క్రాంతి వెల్లడించారు.
మా కుటుంబాన్ని చీల్చింది జగనన్నే
జగన్ × చెల్లెళ్లు, చిన్నమ్మ
‘అమ్మతోడు.. మా కుటుంబాన్ని చీల్చింది జగనన్నే. అందుకు సాక్ష్యం దేవుడు, నా తల్లి విజయమ్మే’ అని జగన్ సోదరి, ఏపీపీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుండబద్దలు కొట్టారు. ‘జగన్ స్వార్థం కోసం కన్నతండ్రి పేరునూ సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్పించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపైనా మొదట్లో సీబీఐ విచారణ జరిపించాలన్న జగన్.. సీఎం అయ్యాక దాన్నీ ఉపసంహరించుకున్నారు. హత్య వెనుక అవినాష్రెడ్డి హస్తం, మీ హస్తం లేకుంటే భయం ఎందుకు ? వివేకా హత్యలో నిందితుడిని కాపాడేందుకు కుటుంబాన్నంతా పక్కన పెట్టారు’ అంటూ షర్మిల దుమ్మెత్తిపోస్తున్నారు. జగన్ అండగా నిలిచిన అవినాష్కు పోటీగా కడప లోక్సభ బరిలోనూ దిగారు.
హంతకులు పాలకులుగా ఉండొద్దు..: జగన్ మరో సోదరి డాక్టర్ సునీత వివేకా హత్య కేసుపై పోరాడుతున్నారు. కేసులో అసలు నిందితులను జగన్ కాపాడుతున్నారంటూ, జగన్ వల్ల తన కుటుంబానికి అన్యాయం జరిగిందంటూ ప్రజల్లోకెళ్లి వివరిస్తున్నారు. ‘హంతకులు పాలకులుగా ఉండరాదు. మా అన్న పార్టీకి ఓటు వేయొద్దు’ అని కడప జిల్లాలో ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు. ‘జగన్ సీఎం అయ్యాక.. వివేకా హత్య కేసు విషయాన్ని ప్రస్తావించగా.. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే అవినాష్రెడ్డి భాజపాలోకి వెళ్తారు. కేసు సీబీఐకి వెళ్లి అది దర్యాప్తు చేస్తే.. అది తనకు 12వ కేసు అవుతుంది’ అని జగన్ చెప్పారని సునీత ప్రజలకు వివరిస్తుండటంతో జగన్తోపాటూ ఆ పార్టీ వర్గాలకూ ఇబ్బందికరంగా మారింది. కొన్ని రోజులుగా పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ప్రశ్నలు సంధిస్తుండటంతో జగన్కు ఊపిరాడటం లేదు.
జగన్ పాలన బాగోలేదు..: వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ కూడా జగన్ తమ కుటుంబాన్ని మోసం చేశారంటున్నారు. ‘‘రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది, జగన్కు ఓటు వేయొద్దు. వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్, ఆయన భార్య భారతిరెడ్డికి తెలుసన్న అనుమానం ఉంది. నా కుమార్తె సునీత పోరాటం చేస్తుంటే అన్నగా జగన్ అండగా ఉండకపోగా ముప్పతిప్పలు పెడుతున్నారు. మాకే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితేంటి? వచ్చే ఎన్నికల్లో రాష్ట్రానికి మంచి పాలకుడు రావాలని ఆకాంక్షిస్తున్నా’ అని చెప్పుకొస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్