‘సొంత’వారికే వంత!
ప్రభుత్వాలు ఏవైనా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలి. కానీ, మన రాష్ట్రంలో మొత్తం రివర్స్ కదా.. పేదల పక్షపాతినని డబ్బా కొట్టుకునే సీఎం జగన్.. తన అరాచకాల్ని ప్రశ్నించే విపక్ష నాయకులు, ఇతరులపై పెత్తందారులని ముద్ర వేస్తారు.
కొందరి కబంధ హస్తాల్లోనే రాష్ట్ర ప్రభుత్వ పాలన
తన వర్గానికి చెందిన వారికే జగన్ పెద్దపీట
చెప్పేవి సుద్దులు.. పదవుల్లోనేమో ‘సామాజిక’ హద్దులు
‘నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీ’ల్లో సమర్థులే లేరా?
సామాజిక న్యాయానికి జగన్ సరికొత్త భాష్యం
ఈనాడు, అమరావతి
కులం, మతం చూడనన్నారు..
సామాజిక న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్నన్నారు..
ఓట్లతో గద్దెనెక్కాక.. తూచ్ అనేశారు..
అధికారాలూ, పదవులన్నీ తమ వర్గానికే ఇచ్చుకున్నారు..
ఇతరులకు అరకొరగా ఇచ్చినా..
పెత్తనం తన వద్దే ఉంచుకున్నారు..
కావాల్సిన అధికారులను తెచ్చుకున్నారు..
అవసరమైన పనులను చక్కబెట్టుకున్నారు..
జగన్ మాటలు కోటలు దాటినా..
చేతలు మాత్రం ఆయన సామాజిక వర్గాన్ని దాటలేదు.
ప్రభుత్వాలు ఏవైనా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలి. కానీ, మన రాష్ట్రంలో మొత్తం రివర్స్ కదా.. పేదల పక్షపాతినని డబ్బా కొట్టుకునే సీఎం జగన్.. తన అరాచకాల్ని ప్రశ్నించే విపక్ష నాయకులు, ఇతరులపై పెత్తందారులని ముద్ర వేస్తారు. ‘నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు’ అంటూ ప్రేమ ఒలకబోస్తారు. సామాజిక న్యాయం అంటూ కథలు చెప్తారు. కానీ జగన్ దృష్టిలో సామాజిక న్యాయం అంటే.. ఆయన సొంత సామాజికవర్గానికి చెందినవారికి న్యాయం చేయడం! ఆయన గుండె ఎప్పుడూ.. ‘నా సజ్జలా, నా సాయిరెడ్డీ, నా పెద్దిరెడ్డీ, నా ధనుంజయరెడ్డీ, నా ధర్మారెడ్డీ, నా జవహర్రెడ్డీ’ అంటూ కొట్టుకుంటుంది. పార్టీలో, ప్రభుత్వంలో కీలక శాఖలన్నీ తన వర్గానికి చెందిన వారికి కట్టబెట్టడమే అందుకు నిదర్శనం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మొక్కుబడిగా ఒకటో రెండో అప్రాధాన్య పదవులు విదిలించినా, పెత్తనమంతా తనవాళ్లదే. ఆయన ప్రసంగాలన్నీ ఓట్లు దండుకునేందుకు చెప్పే మాటలేనని తెలిసేందుకు ఎంతో సమయం పట్టలేదు.
అంతా ఆ కొద్ది మంది చేతుల్లోనే..
జగన్ ప్రభుత్వంలో అధికారం మొత్తం తన సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు, అధికారులకే కట్టబెట్టారు. వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖల మంత్రిగా అధికారం చెలాయిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా సజ్జల కనుసన్నల్లో నడుచుకోవాల్సిందే..! బొత్స సత్యనారాయణ వంటి సీనియర్లు సహా గత, ప్రస్తుత కేబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన మంత్రులెవరికీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేందుకు, మాట్లాడేందుకు స్వేచ్ఛ లేదు. చివరకు ప్రెస్మీట్ పెట్టాలన్నా.. సీఎంవోనే చెప్పాలి. అక్కడి నుంచి వచ్చిన స్క్రిప్టే చదవాలి. హోంమంత్రి పదవి ఎస్సీ వర్గానికి చెందిన సుచరిత, తానేటి వనితలకు ఇచ్చామని వైకాపా నాయకులు గొప్పలు చెప్పడమే తప్ప.. కానిస్టేబుల్ని బదిలీ చేసే అధికారం కూడా వారికి లేదు. మంత్రిగా ఎవరున్నా.. హోంశాఖపై పెత్తనం మొత్తం సజ్జలదే..! ఎస్సీలపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నా, వారిపైనే తిరిగి ఎట్రాసిటీ కేసులు పెడుతున్నా.. విశాఖలో డాక్టర్ సుధాకర్ నుంచి, చీరాలలో కిరణ్ వరకు ఎస్సీ వర్గానికి చెందినవారే పోలీసుల దమనకాండకు బలైనా.. హోంమంత్రులెవరూ కిమ్మనలేదు. ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి పేరుకే పదవి తప్ప, ఆ శాఖలోని వ్యవహారాలన్నీ మరో సీనియర్ మంత్రి తనయుడే నడిపిస్తారన్నది బహిరంగ రహస్యం. సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్రెడ్డి కూడా సజ్జలకే రిపోర్టు చేస్తారు తప్ప, ఆ శాఖకు మంత్రిగా ఉన్న బీసీ వర్గానికి చెందిన వేణుగోపాలకృష్ణకు కాదు. ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రిగా ఆయన మంత్రివర్గ సమావేశాల నిర్ణయాల్ని మీడియాకు వివరించేటప్పుడూ... గతంలో ఎన్నడూ లేని విధంగా కమిషనర్ విజయకుమార్రెడ్డి ఆయన పక్కనే కూర్చుంటారు. ఆ శాఖలో పెత్తనమంతా కమిషనర్ది, ఆపైన సజ్జలదేనన్నమాట.
ఎస్సీ ఎమ్మెల్యేలు.. పెద్దిరెడ్డికి జీ హుజూర్..!
రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత నంబరు.2గా చెలామణీ అవుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికార దర్పం అంతా ఇంతా కాదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలైన సత్యవేడు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు పేరుకే ఎమ్మెల్యేలు.. కానీ, అక్కడ పెత్తనమంతా పెద్దిరెడ్డిదే. అక్కడ అభ్యర్థుల్ని నిర్ణయించేదీ ఆయనే. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఐదేళ్లూ పెద్దిరెడ్డి కనునసన్నల్లోనే పనిచేసినా.. ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. నారాయణస్వామి ఉపముఖ్యమంత్రి అయినా పెద్దిరెడ్డి దగ్గర చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. ఆయన నియోజకవర్గం గంగాధర నెల్లూరులో పూర్తి పెత్తనం పెద్దిరెడ్డిదే కావడంతో ఈ ఎన్నికల్లో నారాయణస్వామి కుమార్తెకు టికెట్ ఇప్పించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్.. ఐదేళ్లలో అక్కడ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేతిలో అనేక అవమానాలు ఎదుర్కొన్నారు.
తిరుమలలో ‘ధర్మారెడ్డి’ తర్వాతే ఎవరైనా..
జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తిరుమలను తన సామాజికవర్గానికి అడ్డాగా మార్చేశారు. తితిదే ఛైర్మన్గా రెండు దఫాలపాటు బాబాయి వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. ఆ తర్వాత తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డికి ఆ పదవి కట్టబెట్టారు. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ (ఐడీఈఎస్)కి చెందిన ధర్మారెడ్డిని డిప్యుటేషన్పై తీసుకొచ్చి తితిదే ఈవో (ఎఫ్ఏసీ)గా నియమించారు. వారంతా తిరుమలను పాలకుల ఆర్థిక, రాజకీయ అవసరాలు తీర్చే వ్యాపార కేంద్రంగా మార్చేశారు. జగన్ తరఫున దిల్లీలో లాబీయింగ్ చేయడంలో ధర్మారెడ్డి దిట్ట. జగన్ కోసం ‘సున్నితమైన’ వ్యవహారాల్ని సునాయాసంగా చక్కబెట్టగలరని ఆయనకు పేరుంది. అందుకే కేంద్రాన్ని బతిమాలి మరీ.. ఆయన డిప్యుటేషన్ను సీఎం పొడిగింపజేశారు. మైకు పట్టుకుంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనారిటీ అనటం.... పదవుల వద్దకు వచ్చేసరికి మాత్రం నా సామాజిక వర్గం అనటం జగన్కే చెల్లింది. ఇదే ఆయన చెబుతున్న సా‘మా’జిక న్యాయం!
పార్టీ పదవులూ వారికే..!
పార్టీలోనూ కీలక పదవులన్నీ సొంత సామాజికవర్గానికే జగన్ కట్టబెట్టారు. దిల్లీలోనూ వారిదే పెత్తనం. వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా తనతోపాటు అనేక కేసుల్లో సహ నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని నియమించారు. పార్టీ లోక్సభాపక్ష నాయకుడిగా మంత్రి పెద్దిరెడ్డి తనయుడు మిథున్రెడ్డిని నియమించారు. పార్టీలోనూ సజ్జలదే హవా. పార్టీ ప్రాంతీయ కన్వీనర్లలో అత్యధికులు జగన్ సామాజికవర్గానికి చెందినవారే. పార్టీ రాష్ట్ర కార్యాలయ ఇన్ఛార్జిగా కూడా తన సామాజిక వర్గానికి చెందిన లేళ్ల అప్పిరెడ్డినే నియమించారు.
సీఎంవో.. ధనుంజయరెడ్డిదే హవా..
అటు సీఎంవోలో ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి రెండో సీఎంలా వ్యవహరిస్తుంటారు. మొత్తం యంత్రాంగంతోపాటు మంత్రుల్నీ ఆయన కంట్రోల్ చేస్తుంటారు. ఆర్థికశాఖ పూర్తిగా ఆయన గుప్పిట్లోనే ఉంటుంది. పోస్టింగుల దగ్గర్నుంచి గుత్తేదారులకు బిల్లుల వరకూ ఆయన ‘చెప్పినదానికి’ అంగీకరించిన వారికే పెద్దపీట వేస్తుంటారు. సీఎంను కలవడం సాధ్యం కాదు కాబట్టి.. వారంతా ధనుంజయరెడ్డినే ముఖ్యమంత్రిగా భావిస్తూ ఆయనను ఆశ్రయిస్తుంటారు.
- జగన్కు అత్యంత సన్నిహితుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి ఒకరు. వైకాపా హయాంలో తితిదే ఈవో సహా అనేక కీలక పదవులు చేపట్టారాయన. సీనియారిటీలో ఆయనకంటే ముందున్న అధికారుల్ని పక్కనబెట్టి మరీ సీఎస్ను చేశారు. దానికి కృతజ్ఞత చాటుకునేందుకు వచ్చిన ఏ అవకాశాన్నీ జవహర్రెడ్డి వదులుకోవడం లేదు. తాజాగా ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక కూడా.. పింఛనుదారుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసి, ఆ నెపాన్ని ప్రతిపక్షాలపైకి నెట్టేసే కుట్రను విజయవంతంగా అమలు చేయడంలో శక్తివంచన లేకుండా వైకాపాకు తోడ్పడుతున్నారు.
- మాజీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి, విజిలెన్స్ డీజీ రఘురామిరెడ్డిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్లను పక్కనపెట్టి రాజేంద్రనాథ్రెడ్డిని ఇన్ఛార్జి డీజీపీగా నియమించారు. ఆయన ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి, అరెస్ట్లు చేసి, పోలీసు యంత్రాంగాన్ని వైకాపా అనుబంధ విభాగంగా మార్చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు సహా విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టేందుకు రఘురామిరెడ్డిని సిట్ ఇన్ఛార్జిగా నియమించారు.
- గనులశాఖ ఎండీగా వెంకట్రెడ్డిని నియమించారు. ఆయన అండతో రాష్ట్రంలో అక్రమ ఇసుక దందాను, గనుల దోపిడీని యథేచ్ఛగా సాగించారు.
- ప్రభుత్వ సలహాదారుల్లోనూ మెజార్టీ జగన్ సామాజికవర్గానికి చెందినవారే. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లంరెడ్డిని జగన్ అధికారంలోకి రాగానే సలహాదారుగా నియమించారు. కొన్ని నెలలపాటు ఆయన కనుసన్నల్లోనే సీఎంఓ నడిచింది.
- (ఎన్నికల కమిషన్ తొలగించేంత వరకు రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి, రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం (డీఆర్ఐ) చీఫ్గా ఉన్న రాజేశ్వర్రెడ్డి.. ఇలా తమ సామాజికవర్గానికి చెందిన అధికారులందరినీ కీలక పదవుల్లో జగన్ నియమించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్