ఎన్నికల వేళ.. వైకాపా మెడకు రైల్వేజోన్ ఉచ్చు!
ఎన్నికల వేళ వైకాపాకు రైల్వే జోన్ ఉచ్చు బిగుసుకుంది. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ రైల్వే జోన్కు స్థలం కేటాయించలేదన్న మాట అనగానే, వైకాపా మంత్రులు మీడియా సమావేశాలు పెట్టి మరీ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేశారు.
రైల్వే ముఖ్య కార్యాలయానికి విశాఖలో భూమి ఇవ్వలేదన్న మోదీ
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం తేల్చి చెప్పిన ప్రధాని
ఈనాడు-విశాఖపట్నం: ఎన్నికల వేళ వైకాపాకు రైల్వే జోన్ ఉచ్చు బిగుసుకుంది. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ రైల్వే జోన్కు స్థలం కేటాయించలేదన్న మాట అనగానే, వైకాపా మంత్రులు మీడియా సమావేశాలు పెట్టి మరీ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేశారు. తాజాగా అనకాపల్లి జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ రైల్వే జోన్ విషయంలో వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంపై మాట్లాడారు. విశాఖలో రైల్వే ముఖ్య కార్యాలయానికి భూమి అడిగితే ఇవ్వలేదని తేల్చి చెప్పారు. ‘రైల్వే జోన్ స్థలంపై కేంద్ర మంత్రి అబద్ధం చెప్పారు’ అంటూ మంత్రి బొత్స దిద్దుబాటు చేసుకున్న రోజుల వ్యవధిలోనే ఆ పార్టీ అబద్ధపు ప్రచారాలపై మోదీ కుండబద్ధలు కొట్టారు. సీఎంవో కార్యాలయం పేరుతో ప్యాలెస్ కట్టడానికి ఏకంగా రుషికొండను తొలిచిన జగన్కు.. రైల్వే కార్యాలయానికి ఇవ్వడానికి స్థలం చూపించలేక పోయారా? అనే చర్చ తీవ్రస్థాయిలో జరుగుతోంది.
నిర్మాణాలకు అనువుగాని చోట:
ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ సమయంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన ఓ ప్రకటన వైకాపా ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. విశాఖ రైల్వే జోన్కు జగన్ ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడం వల్లే ఆలస్యమైందని ఆయన ప్రకటించారు. దీంతో జగన్ సర్కార్ రైల్వే జోన్ స్థలం పై దిద్దుబాటు చర్యల్లో భాగంగా సీడీఎంఏ (కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) నుంచి జీవీఎంసీకి ఓ లేఖ పంపారు. అందులో ప్రత్యామ్నాయంగా గతంలో ఇచ్చిన స్థలంతో పాటు మరో 40 ఎకరాలు కలిపి ఇవ్వాలని పేర్కొన్నారు. బీఆర్టీఎస్ రహదారి విస్తరణలో భాగంగా రైల్వే స్థలాలు తీసుకున్న జీవీఎంసీకి ప్రత్యామ్నాయంగా ముడసర్లోవ వద్ద 52 ఎకరాలు గతంలోనే కేటాయించగా.. రైల్వే జోన్కు స్థలం ఇవ్వలేదన్న వివాదం తెరపైకి రాగానే పాత కేటాయింపు పక్కనే మరో 40 ఎకరాలు చదును చేశారు. ముడసర్లోవ రిజర్వాయర్ సమీపంలో క్యాచ్మెంట్ ఏరియా (పరివాహక ప్రాంతం)లో ఈ స్థలం కేటాయించారు. క్యాచ్మెంట్ ఏరియాలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని న్యాయస్థానం ఆదేశాలు ఉన్నా అనువుగాని చోట రైల్వే ముఖ్య కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం చూపించి చేతులు దులిపేసుకోవడం గమనార్హం.
భూ సంతర్పణ ఎందుకోసం?:
ఉత్తరాంధ్ర ప్రజల కలగా ఉన్న విశాఖ రైల్వే జోన్కు స్థలం కేటాయించేందుకు నిర్లక్ష్యం చూపిన జగన్... అనుకున్న కంపెనీల భూ సంతర్పణకు మాత్రం ముందున్నారు. అనకాపల్లి జిల్లా మాకవరపుపాలెం మండలం రాచపల్లి వద్ద అన్రాక్ పరిశ్రమకు 2008 వై.ఎస్ హయాంలో 2వేల ఎకరాలు కేటాయించారు. ఎకరా రూ.2.83 లక్షల చొప్పున ఇచ్చారు. స్థానిక 5వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించాలన్న నిబంధన పెట్టారు. ఆ కంపెనీకి చింతపల్లిలో బాక్సైట్ గనుల కేటాయింపుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా, తీవ్ర వ్యతిరేకత రావడంతో కేటాయింపులు నిలిపివేశారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ బాక్సైట్ జీవో రద్దు చేసింది. దీనిపై అన్రాక్ కంపెనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక కంపెనీతో మధ్యవర్తిత్వం నడిపి బాక్సైట్ బయట నుంచి తెచ్చుకునేలా అనుమతులిచ్చారు. కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించినా పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించలేక పోయారు. ఇది ఇలా ఉండగానే కంపెనీ పేరు మార్చి పైనీర్ పేరిట మరో 479 ఎకరాలు జగన్ భూ సంతర్పణ చేశారు. ప్రభుత్వ ధర ప్రకారమే ఎకరా రూ.35లక్షలపైగా ఉండగా, కేవలం ఎకరా రూ.3.56లక్షలకే ఈ ఏడాది ఫిబ్రవరిలో జగన్ సర్కార్ కట్టబెట్టడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM