మహమ్మారి దశ ముగియనుందా!
ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొవిడ్-19 ఉపశమించనుందా? ‘మహమ్మారి’గా ఉన్న ఈ వ్యాధి తీవ్రత తగ్గనుందా? ఎప్పటికీ ఉండిపోయే సాధారణ ఇన్ఫెక్షన్ (ఎండెమిక్)లా ఇది మారిపోతుందా? ఈ ప్రశ్నలకు కొందరు శాస్త్రవేత్తలు ఔననే సమాధానమిస్తున్నారు. కరోనాలో కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్
‘ఎండెమిక్’ స్థాయికి కొవిడ్?
ఒమిక్రాన్ పుట్టుక మొదటి అడుగు కావొచ్చు
సౌత్ ఈస్ట్ క్వీన్స్ల్యాండ్: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొవిడ్-19 ఉపశమించనుందా? ‘మహమ్మారి’గా ఉన్న ఈ వ్యాధి తీవ్రత తగ్గనుందా? ఎప్పటికీ ఉండిపోయే సాధారణ ఇన్ఫెక్షన్ (ఎండెమిక్)లా ఇది మారిపోతుందా? ఈ ప్రశ్నలకు కొందరు శాస్త్రవేత్తలు ఔననే సమాధానమిస్తున్నారు. కరోనాలో కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఇందుకు దోహదపడొచ్చని వారు చెబుతున్నారు. ఒమిక్రాన్ వల్ల తీవ్రస్థాయి వ్యాధికి పెద్దగా ఆస్కారం లేదని ఆఫ్రికా నుంచి వస్తున్న వార్తలను బట్టి ప్రాథమికంగా స్పష్టమవుతోంది. అయితే దీనికి సంబంధించిన డేటా చాలా పరిమితంగానే ఉన్నందువల్ల అప్రమత్తత కొనసాగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరించింది. సాధారణంగా జనాభాలో ఎక్కువ శాతం మందిలో పాగా వేశాక వైరస్లు తీవ్రస్థాయి వ్యాధిని కలిగించలేవు. ఇందుకు ప్రధాన ఉదాహరణ మిక్సోమెటోసిస్ వ్యాధి. ఆస్ట్రేలియాలో ఇది తొలిసారి ప్రబలినప్పుడు అక్కడ 99 శాతం కుందేళ్లు మృత్యువాత పడ్డాయి. ఇప్పుడు అది బలహీనపడింది. ఫలితంగా ఆ వ్యాధితో చనిపోతున్న కుందేళ్ల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. కొవిడ్ మహమ్మారి కూడా ఇదే తరహాలో తీవ్రత తగ్గి, ‘ఎండెమిక్’లా మారుతుందని కొందరు నిపుణులు ఇప్పటికే అంచనాలు వేశారు. ఫలితంగా నిర్దిష్ట ప్రాంతంలో ఆ వ్యాధి తీరుతెన్నులను చాలా మెరుగ్గా ఊహించే స్థితిలో నిపుణులు ఉంటారు. ఒమిక్రాన్ వేరియంట్ పుట్టుక.. ఈ ప్రక్రియ దిశగా మొదటి అడుగు కావొచ్చని ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తాజాగా చెబుతున్నారు.
కొన్ని వేరియంట్ల ఆధిపత్యం ఎందుకు?
మునుపటి రకాలతో పోలిస్తే వేగంగా వ్యాపించే సామర్థ్యాన్ని చాటే కొత్త వేరియంట్లు బాగా విస్తరిస్తాయని పరిణామక్రమ జీవశాస్త్రం చెబుతోంది. ‘ఆర్ సంఖ్య’ (ప్రాథమిక పునరుత్పత్తి సంఖ్య లేదా వ్యాధి సోకిన వ్యక్తి నుంచి సరాసరిన ఎంతమందికి ఆ వైరస్ వ్యాపిస్తుందో చెప్పే సంఖ్య) అధికంగా ఉన్న రకాలు.. తక్కువగా ఉన్న వేరియంట్ల స్థానాన్ని ఆక్రమిస్తాయని స్పష్టమవుతోంది. దీనికితోడు ఒక వ్యక్తిలో వ్యాధి సోకాక అతడి నుంచి ఇతరులకు ఇన్ఫెక్షన్ వ్యాపించడానికి మధ్య కొంత సమయం ఉంటుంది. ఈ వ్యవధి ఎక్కువగా ఉండే రకాలు.. ఈ విరామం తక్కువగా కలిగిన వేరియంట్ల స్థానాన్ని ఆక్రమించేస్తాయి. డెల్టా వేరియంట్ విషయంలో ఇదే జరిగింది.
కొత్త వేరియంట్ ఏ జనాభాలో ఉత్పన్నమైందన్నది కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అధికస్థాయిలో వ్యాక్సినేషన్ పొందిన సమాజంతో పోలిస్తే టీకా విస్తృతి తక్కువగా ఉన్నచోట్ల ఈ వ్యాధి పరిణామక్రమం భిన్నంగా ఉంటుంది. ఒమిక్రాన్ తొలుత వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలో వ్యాక్సినేషన్ రేటు 25 శాతంగానే ఉంది. ఇలాంటి చోట్ల ‘ఆర్ సంఖ్య’ ఎక్కువగా ఉన్న రకాలు ఉత్పన్నం కావడానికి ఆస్కారం ఉంటుంది. విస్తృత స్థాయిలో టీకా పొందిన జనాభాలో.. వ్యాక్సిన్ను ఏమార్చే రకాలు పైచేయి సాధించొచ్చు.
ప్రతి గడపకూ వాక్సినేషన్.. గువాహటి శివారులో సైకిళ్లపై వెళ్తున్న ఆరోగ్య కార్యకర్తలు
తక్కువ లక్షణాలు ఉంటే విస్తృతి అధికం
వ్యాధి లక్షణాలు, వ్యాప్తి తీవ్రతకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. వ్యాధి లక్షణాలు తక్కువగా ఉంటే ప్రజలు నిర్ధారణ పరీక్షలకు పెద్దగా ముందుకు రాకపోవచ్చు. తమకు కొవిడ్ సోకిందనే విషయాన్నే కొందరు గుర్తించలేరు. అందువల్ల తీవ్ర లక్షణాలను పెద్దగా కలిగించని రకాలు.. అధిక లక్షణాలను కలిగించే వేరియంట్లతో పోలిస్తే ఉద్ధృతంగా వ్యాపించొచ్చు. మరోపక్క డెల్టా రకంలో కనిపించినట్లు.. కొన్ని వేరియంట్ల వల్ల రోగి శరీరంలో వైరస్ అధికస్థాయిలో ఉండొచ్చు. అది ఎంత ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి నుంచి అంత అధికంగా ఇతరులకు వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి రకాల వల్ల ఇన్ఫెక్షన్ తీవ్రత కూడా అధికంగా ఉండొచ్చు.
ఒమిక్రాన్లో ఇవి తేలాలి
ఆఫ్రికాలో ఒమిక్రాన్ ఎందుకు అంత తీవ్రంగా వ్యాపిస్తుందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇతర రకాలతో పోలిస్తే ఈ వేరియంట్ వల్ల అధిక వైరల్ లోడు ఉంటుందా అన్నది ఇంకా తేలలేదు. వైరస్ వ్యాప్తి అనేది సంక్లిష్టమైన, బహుళ అంచెల ప్రక్రియ. ఒమిక్రాన్కు అధిక వ్యాప్తిరేటు ఉండటానికి అనేక కారణాలు దోహదపడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ వేరియంట్ వల్ల కలిగే వైరల్ లోడు; ప్రస్తుత టీకాలు లేదా గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగా వెలువడిన రోగ నిరోధక స్పందనను అది ఎంత వరకూ ఏమారుస్తుందన్నది నిర్ధరించాల్సి ఉంది. అయితే కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ను ముమ్మరం చేయాల్సిన ఆవశ్యకతను కొత్త వేరియంట్ పుట్టుక సూచిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!