మహమ్మారి దశ ముగియనుందా!
ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొవిడ్-19 ఉపశమించనుందా? ‘మహమ్మారి’గా ఉన్న ఈ వ్యాధి తీవ్రత తగ్గనుందా? ఎప్పటికీ ఉండిపోయే సాధారణ ఇన్ఫెక్షన్ (ఎండెమిక్)లా ఇది మారిపోతుందా? ఈ ప్రశ్నలకు కొందరు శాస్త్రవేత్తలు ఔననే సమాధానమిస్తున్నారు. కరోనాలో కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్
‘ఎండెమిక్’ స్థాయికి కొవిడ్?
ఒమిక్రాన్ పుట్టుక మొదటి అడుగు కావొచ్చు
సౌత్ ఈస్ట్ క్వీన్స్ల్యాండ్: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొవిడ్-19 ఉపశమించనుందా? ‘మహమ్మారి’గా ఉన్న ఈ వ్యాధి తీవ్రత తగ్గనుందా? ఎప్పటికీ ఉండిపోయే సాధారణ ఇన్ఫెక్షన్ (ఎండెమిక్)లా ఇది మారిపోతుందా? ఈ ప్రశ్నలకు కొందరు శాస్త్రవేత్తలు ఔననే సమాధానమిస్తున్నారు. కరోనాలో కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఇందుకు దోహదపడొచ్చని వారు చెబుతున్నారు. ఒమిక్రాన్ వల్ల తీవ్రస్థాయి వ్యాధికి పెద్దగా ఆస్కారం లేదని ఆఫ్రికా నుంచి వస్తున్న వార్తలను బట్టి ప్రాథమికంగా స్పష్టమవుతోంది. అయితే దీనికి సంబంధించిన డేటా చాలా పరిమితంగానే ఉన్నందువల్ల అప్రమత్తత కొనసాగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరించింది. సాధారణంగా జనాభాలో ఎక్కువ శాతం మందిలో పాగా వేశాక వైరస్లు తీవ్రస్థాయి వ్యాధిని కలిగించలేవు. ఇందుకు ప్రధాన ఉదాహరణ మిక్సోమెటోసిస్ వ్యాధి. ఆస్ట్రేలియాలో ఇది తొలిసారి ప్రబలినప్పుడు అక్కడ 99 శాతం కుందేళ్లు మృత్యువాత పడ్డాయి. ఇప్పుడు అది బలహీనపడింది. ఫలితంగా ఆ వ్యాధితో చనిపోతున్న కుందేళ్ల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. కొవిడ్ మహమ్మారి కూడా ఇదే తరహాలో తీవ్రత తగ్గి, ‘ఎండెమిక్’లా మారుతుందని కొందరు నిపుణులు ఇప్పటికే అంచనాలు వేశారు. ఫలితంగా నిర్దిష్ట ప్రాంతంలో ఆ వ్యాధి తీరుతెన్నులను చాలా మెరుగ్గా ఊహించే స్థితిలో నిపుణులు ఉంటారు. ఒమిక్రాన్ వేరియంట్ పుట్టుక.. ఈ ప్రక్రియ దిశగా మొదటి అడుగు కావొచ్చని ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తాజాగా చెబుతున్నారు.
కొన్ని వేరియంట్ల ఆధిపత్యం ఎందుకు?
మునుపటి రకాలతో పోలిస్తే వేగంగా వ్యాపించే సామర్థ్యాన్ని చాటే కొత్త వేరియంట్లు బాగా విస్తరిస్తాయని పరిణామక్రమ జీవశాస్త్రం చెబుతోంది. ‘ఆర్ సంఖ్య’ (ప్రాథమిక పునరుత్పత్తి సంఖ్య లేదా వ్యాధి సోకిన వ్యక్తి నుంచి సరాసరిన ఎంతమందికి ఆ వైరస్ వ్యాపిస్తుందో చెప్పే సంఖ్య) అధికంగా ఉన్న రకాలు.. తక్కువగా ఉన్న వేరియంట్ల స్థానాన్ని ఆక్రమిస్తాయని స్పష్టమవుతోంది. దీనికితోడు ఒక వ్యక్తిలో వ్యాధి సోకాక అతడి నుంచి ఇతరులకు ఇన్ఫెక్షన్ వ్యాపించడానికి మధ్య కొంత సమయం ఉంటుంది. ఈ వ్యవధి ఎక్కువగా ఉండే రకాలు.. ఈ విరామం తక్కువగా కలిగిన వేరియంట్ల స్థానాన్ని ఆక్రమించేస్తాయి. డెల్టా వేరియంట్ విషయంలో ఇదే జరిగింది.
కొత్త వేరియంట్ ఏ జనాభాలో ఉత్పన్నమైందన్నది కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అధికస్థాయిలో వ్యాక్సినేషన్ పొందిన సమాజంతో పోలిస్తే టీకా విస్తృతి తక్కువగా ఉన్నచోట్ల ఈ వ్యాధి పరిణామక్రమం భిన్నంగా ఉంటుంది. ఒమిక్రాన్ తొలుత వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలో వ్యాక్సినేషన్ రేటు 25 శాతంగానే ఉంది. ఇలాంటి చోట్ల ‘ఆర్ సంఖ్య’ ఎక్కువగా ఉన్న రకాలు ఉత్పన్నం కావడానికి ఆస్కారం ఉంటుంది. విస్తృత స్థాయిలో టీకా పొందిన జనాభాలో.. వ్యాక్సిన్ను ఏమార్చే రకాలు పైచేయి సాధించొచ్చు.
ప్రతి గడపకూ వాక్సినేషన్.. గువాహటి శివారులో సైకిళ్లపై వెళ్తున్న ఆరోగ్య కార్యకర్తలు
తక్కువ లక్షణాలు ఉంటే విస్తృతి అధికం
వ్యాధి లక్షణాలు, వ్యాప్తి తీవ్రతకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. వ్యాధి లక్షణాలు తక్కువగా ఉంటే ప్రజలు నిర్ధారణ పరీక్షలకు పెద్దగా ముందుకు రాకపోవచ్చు. తమకు కొవిడ్ సోకిందనే విషయాన్నే కొందరు గుర్తించలేరు. అందువల్ల తీవ్ర లక్షణాలను పెద్దగా కలిగించని రకాలు.. అధిక లక్షణాలను కలిగించే వేరియంట్లతో పోలిస్తే ఉద్ధృతంగా వ్యాపించొచ్చు. మరోపక్క డెల్టా రకంలో కనిపించినట్లు.. కొన్ని వేరియంట్ల వల్ల రోగి శరీరంలో వైరస్ అధికస్థాయిలో ఉండొచ్చు. అది ఎంత ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి నుంచి అంత అధికంగా ఇతరులకు వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి రకాల వల్ల ఇన్ఫెక్షన్ తీవ్రత కూడా అధికంగా ఉండొచ్చు.
ఒమిక్రాన్లో ఇవి తేలాలి
ఆఫ్రికాలో ఒమిక్రాన్ ఎందుకు అంత తీవ్రంగా వ్యాపిస్తుందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇతర రకాలతో పోలిస్తే ఈ వేరియంట్ వల్ల అధిక వైరల్ లోడు ఉంటుందా అన్నది ఇంకా తేలలేదు. వైరస్ వ్యాప్తి అనేది సంక్లిష్టమైన, బహుళ అంచెల ప్రక్రియ. ఒమిక్రాన్కు అధిక వ్యాప్తిరేటు ఉండటానికి అనేక కారణాలు దోహదపడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ వేరియంట్ వల్ల కలిగే వైరల్ లోడు; ప్రస్తుత టీకాలు లేదా గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగా వెలువడిన రోగ నిరోధక స్పందనను అది ఎంత వరకూ ఏమారుస్తుందన్నది నిర్ధరించాల్సి ఉంది. అయితే కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ను ముమ్మరం చేయాల్సిన ఆవశ్యకతను కొత్త వేరియంట్ పుట్టుక సూచిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. -
మద్యం మహమ్మారికి ‘జగన్ ముద్దులు’
‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. -
వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
నీరు ఇవ్వలేం... కొనుక్కుని తాగండి!
ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు. -
వైకాపా అరాచకాలపై మేము సైతం పోరాడతాం
‘ఏపీలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మా వంతు పోరాడతాం’ అని అమెరికాలోని ప్రవాస భారతీయ మహిళలు తెలిపారు. -
వైద్య బోధకుల బదిలీల దుమారం
ముందస్తు సమాచారం లేకుండా బదిలీల ఉత్తర్వులు జారీచేసి, వెంటనే రిలీవ్ కావాలని పేర్కొనడంపై వైద్య బోధకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి పాడేరు, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందులలోని కొత్త వైద్యకళాశాలల్లో తరగతులు ప్రారంభం కావాలి. -
ఇఫ్కోకు భూకేటాయింపుపై పిల్ కొట్టివేత
యూరియా, అమోనియా ప్లాంట్ నిర్మాణం కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)కు భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ.. 2017లో దాఖలైన పిల్ను కొట్టేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. -
భరోసానూ బరికేశారు!
రైతుబంధు కింద తెలంగాణలో ఎకరానికి ఏడాదికి ఇస్తోంది రూ.10,000. ఐదెకరాలుంటే రూ.50 వేలు. అంటే ఐదేళ్లలో ఒక్కో రైతుకు అందింది కనీసం రూ.2.50 లక్షలు. -
ముందుచూపుతో ప్రజల్ని నడిపించే దార్శనికులు రావాలి
పౌరులు ధైర్యంగా ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై భౌతికదాడులు సర్వసాధారణంగా మారాయని, వారికి పథకాలు నిలిపివేయడం.. -
ఉద్యోగాలు సృష్టించే వారికే ఓటేయాలి
‘హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి మౌలిక వసతులే. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. అన్ని వసతులు కల్పిస్తేనే పెట్టుబడులు వస్తాయి. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. నిధుల విడుదల వాయిదా
రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
‘బిల్లుల చెల్లింపులపై విచారణ జరిపించండి’
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. మొదట బిల్లులు అప్లోడ్ అయిన గుత్తేదారులకు తొలుత చెల్లింపు విధానం(ఫిఫో) పాటించలేదని, దీనిపై విచారణ జరిపించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) కోరింది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ
ట్రిపుల్ ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
-
పెద్దల మాట
-
గోడు విన్నా.. ‘గోల్డ్’ ఇవ్వలే!
ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్ నిండాముంచారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. -
ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!