తక్షణమే ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియ
తెలంగాణలో కొత్త జోనల్ విధానం అమలులో భాగంగా ఉద్యోగులను స్థానికత ఆధారంగా సొంత జిల్లాలు, జోన్లు, బహుళ జోన్లకు బదలాయించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు(జీవో నం.317) జారీ
ఎన్నికల కోడ్లేని జిల్లాల్లో సత్వరమే అమలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో కొత్త జోనల్ విధానం అమలులో భాగంగా ఉద్యోగులను స్థానికత ఆధారంగా సొంత జిల్లాలు, జోన్లు, బహుళ జోన్లకు బదలాయించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు(జీవో నం.317) జారీ చేసింది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారిని తమ తమ స్థానిక కేడర్ల(పోస్టుల)లో సర్దుబాటు చేయాలని సూచించింది. మొదటగా జిల్లా స్థాయిలో ఉద్యోగుల బదలాయింపులుంటాయని, ఆ తర్వాత జోనల్, బహుళ జోన్ల బదలాయింపులు జరుగుతాయని తెలిపింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో (వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి) తక్షణమే ప్రక్రియ ప్రారంభమవుతుందని.. హైదరాబాద్ మినహా మిగతా ఐదు ఉమ్మడి జిల్లాల్లో కోడ్ అనంతరం చేపట్టనున్నట్లు పేర్కొంది. ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలతో వచ్చే దరఖాస్తుల ఆధారంగా సీనియారిటీ ప్రాతిపదికన వారిని కొత్త స్థానాలకు కేటాయించనున్నారు. 70 శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం గల వారికి, మనోవైకల్యం గల పిల్లలున్నవారికి, కారుణ్య నియామకాల్లో పనిచేస్తున్న వితంతువులు, క్యాన్సర్, న్యూరోసర్జరీ, మూత్రపిండాలు, కాలేయ మార్పిడి, గుండె శస్త్రచికిత్స జరిగిన వారికి కేటాయింపుల్లో ప్రాధాన్యమిస్తారు. భార్యాభర్తల కేటగిరీని సైతం పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ప్రక్రియ కోసం అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు ఈ నెల ఎనిమిదో తేదీలోగా ఉద్యోగుల సీనియారిటీ జాబితాలను సమర్పించాలని ప్రభుత్వం మరో ఉత్తర్వును జారీ చేసింది. 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా అమల్లోకి వచ్చిన కొత్త జోనల్ విధానం కార్యాచరణపై ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధ్యక్షతన టీఎన్జీవో, టీజీవో సంఘాలతో జరిగిన సమావేశంలో ఖరారైన విధివిధానాలకు అనుగుణంగా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
* ఉద్యోగుల బదలాయింపు కోసం కమిటీలు ఏర్పాటయ్యాయి. జిల్లా స్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కేంద్రం కలెక్టర్ నేతృత్వంలో జిల్లా ఉన్నతాధికారులు సభ్యులుగా కమిటీ ఉంటుంది.
* జోనల్, బహుళ జోనల్ పోస్టులకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో సంబంధిత ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్యకార్యదర్శి/కార్యదర్శి, శాఖాధిపతులు, సీనియర్ సలహాదారు, ఇతర ఉన్నతాధికారులు సభ్యులుగాకమిటీ ఉంటుంది.
* కేటాయింపుల సమయంలో గుర్తింపు గల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఒక్కొక్కరిని కమిటీలు ఆహ్వానించవచ్చు.
* ఈ కమిటీలు బదలాయింపుల కోసం ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ను ఉపయోగించుకుంటాయి. తుది కేటాయింపుల అనంతరం ఈ జాబితాను సంబంధిత కార్యదర్శి, శాఖాధిపతికి పంపితే వారు దీనికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేస్తారు.
* ఉత్తర్వులకు అనుగుణంగా అన్ని శాఖలు తమ తమ పరిధిలోని ఉద్యోగుల సీనియారిటీ జాబితాను రూపొందించాలి. సెలవు, దీర్ఘకాలిక సెలవు, సస్పెన్షన్, శిక్షణ, డిప్యుటేషన్లో ఉన్న వారి వివరాలు సైతం చేరాలి.
* హైదరాబాద్ మినహా... తొమ్మిది ఉమ్మడి జిల్లాల విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన జిల్లాల ఉద్యోగులను ఉమ్మడి జిల్లా పరిధిలోని పోస్టులలోనే సర్దుబాటు చేస్తారు.
పరిపాలనావసరాలుంటే...
పరిపాలనావసరాలు, ఇతర సందర్భాలుంటే ఆయా ఉద్యోగులకు నిబంధనలు సడలించి అవసరమైన కేడర్లో ప్రభుత్వం నియమిస్తుంది.
దరఖాస్తు నమూనా పత్రం..
బదలాయింపుల కోసం ఉద్యోగులు తమ పేరు, గుర్తింపు సంఖ్య, లింగం, కేటగిరి(ఎస్సీ,ఎస్టీ), శాఖ, హోదా, బదలాయింపు ఎక్కడికి, ప్రత్యేక కేటగిరిలో ఉన్నారా? దీనికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జతచేస్తూ సంతకం చేసి దరఖాస్తు చేసుకోవాలి.
సీనియారిటీ జాబితా కోసం..
సీనియారిటీ జాబితా నమూనాను ప్రభుత్వం నిర్దేశించింది. ఉద్యోగి, పాత జిల్లా/జోనల్/బహుళ జోన్, ప్రస్తుత జిల్లా/జోన్, శాఖ, హోదా, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఐడీ, కేటగిరీ(ఎస్సీ/ఎస్టీ), ఫోన్ నంబరు, సీనియారిటీ సంఖ్యను పేర్కొనాలని కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది.
జోన్లలో: ఉమ్మడి రాష్ట్రంలో అమల్లో ఉన్న అయిదో జోన్ పరిధిలోని ఉద్యోగులు ప్రస్తుతం ఉన్న ఒకటి నుంచి నాలుగు కొత్త జోన్ల (నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట మినహాయించి) పరిధిలోకి బదలాయించేందుకు అర్హులు.
* పూర్వపు ఆరో జోన్ (జనగామ మినహాయించి) ఉద్యోగులు ప్రస్తుత ఐదు, ఆరు, ఏడు జోన్లలో.. రెండో జోన్లోని నిజామాబాద్, మూడో జోన్లోని కామారెడ్డి, మెదక్, పూర్వ మెదక్ జిల్లాలలోని సిద్దిపేటలను పరిగణనలోకి తీసుకుంటారు.
బహుళ జోన్లలో: ఉమ్మడి రాష్ట్రంలోని అయిదో జోన్ ఉద్యోగులు ప్రస్తుత మొదటి బహుళ జోన్ పరిధిలోకి, ఉమ్మడి రాష్ట్రంలోని నాలుగో జోన్ పరిధిలోని ఉద్యోగులు రెండో బహుళ జోన్ పరిధిలోకి వస్తారు.
* బదలాయింపుల సందర్భంగా ఎవరు ఏ కేటగిరీలోకి వస్తారనేది ఉద్యోగులకు తెలిసేలా ప్రదర్శించాలి.
* జిల్లా, జోన్, బహుళ జోన్లలోని వారు నిర్దేశిత నమూనా పత్రం(ఫాం)తో గడువులోగా సొంత జిల్లా, జోన్, బహుళ జోన్లలో బదలాయింపుల కోసం తమ జిల్లా/జోనల్/రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అందులో ప్రాధాన్యాలను పేర్కొనాలి.
* జిల్లా, జోనల్/బహుళ జోనల్ బదలాయింపుల కోసం ఏర్పాటైన కమిటీలు తమకు వచ్చిన దరఖాస్తుల ఆధారంగా కేటాయింపుల కోసం జాబితాను రూపొందించాలి. పోస్టుల కంటే ఎక్కువ సంఖ్యలో వినతులు వస్తే.. సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలి.
* ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను ప్రస్తుతం ఉన్న సంఖ్యలోని పోస్టుల మేరకు కేటాయింపులకు పరిగణనలోకి తీసుకుంటారు.
* బదలాయింపు వల్ల నష్టపోయానని ఎవరైనా ఉద్యోగి భావిస్తే సంబంధిత శాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి. దానిని ప్రభుత్వం పరిశీలిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?