Telangana High Court: హైకోర్టుకు 10 మంది న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా పదిమంది న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం
కొలీజియం సిఫార్సు చేసిన 12 పేర్లలో 10 మందికి రాష్ట్రపతి ఆమోదముద్ర
నలుగురు మహిళలకు స్థానం
రేపు ప్రమాణ స్వీకారం
ఈనాడు, దిల్లీ తెలంగాణ హైకోర్టుకు కొత్తగా పదిమంది న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం న్యాయవాదుల కేటగిరీ నుంచి ఏడుగురు, న్యాయాధికారుల కేటగిరీ నుంచి అయిదుగురు కలిపి మొత్తం 12 మంది పేర్లు సిఫార్సు చేయగా, వారిలో 10 మంది నియామకాలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. వీరిలో న్యాయవాదుల విభాగం నుంచి కాసోజు సురేందర్, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్కుమార్, జువ్వాడి శ్రీదేవి, ఎన్.శ్రావణ్ కుమార్ వెంకట్ ఉన్నారు. న్యాయాధికారుల విభాగం నుంచి గున్ను అనుపమా చక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏనుగు సంతోష్రెడ్డి, దేవరాజ్ నాగార్జున్లను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 217(1)కింద దఖలుపడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి వీరి నియామకాలకు ఆమోదముద్ర వేసినట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న క్రమంలో వారి సీనియారిటీ వర్తిస్తుందని, బాధ్యతలు చేపట్టిన నాటినుంచి వారి నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ పదిమంది న్యాయమూర్తులు గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్ర శర్మ వీరితో ప్రమాణస్వీకారం చేయిస్తారు. మొత్తం 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన హైకోర్టులో ప్రస్తుతం 19 మంది సేవలందిస్తున్నారు. వీరి నియామకంతో మొత్తం సంఖ్య 29కి చేరుతుంది. హైకోర్టులో ఒకేసారి పదిమంది న్యాయమూర్తులను నియమించడం ఇదే మొదటిసారి.
న్యాయవాదుల కోటానుంచి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన చాడ విజయభాస్కర్ రెడ్డి, మీర్జా సైఫుల్లా బేగ్ల పేర్లు తాజా నియామక ఉత్తర్వుల్లో కనిపించలేదు. ఇప్పుడు నియమితులైన వారిలో మహిళలు నలుగురు ఉన్నారు. దీంతో ఈ హైకోర్టులో మొత్తం మహిళా న్యాయమూర్తుల సంఖ్య 10కి చేరనుంది. మొత్తం న్యాయమూర్తుల్లో మహిళల శాతం 34.48%కి పెరుగుతుంది.
న్యాయవాదుల నుంచి...
కాసోజు సురేందర్: మహబూబ్నగర్కు చెందిన కె.ప్రమీలాదేవి, కె.లక్ష్మీనారాయణ దంపతులకు 1968లో జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను, బీఎస్సీ, న్యాయశాస్త్రం డిగ్రీలను ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పూర్తి చేశారు. 1992 డిసెంబరు 15న బార్ కౌన్సిల్లో నమోదయ్యారు. నాలుగు పర్యాయాలు సీబీఐ న్యాయవాదిగా, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్, ఎన్ఐఏల ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, కేంద్రం తరఫున అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా సేవలందించారు. కింది కోర్టులతోపాటు హైకోర్టులో పలు క్రిమినల్, ఆర్థిక నేరాల, ఏసీబీ, సీబీఐ కేసులతోపాటు సివిల్, క్రిమినల్, రాజ్యాంగానికి సంబంధించిన వాటిల్లో వాదనలు వినిపించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోకుల్చాట్ బాంబు పేలుళ్లు, లుంబినీ పార్కు పేలుళ్లు, దిల్సుఖ్నగర్లో బాంబు పెట్టిన కేసులు, టెర్రరిస్ట్ హార్బరింగ్ కేసుల్లో ప్రత్యేక కోర్టుల్లో వాదనలు వినిపించారు. రూ.7 వేల కోట్ల కుంభకోణానికి చెందిన సత్యం కేసులో వాదనలు వినిపించగా ప్రత్యేక కోర్టులో నేరం రుజువై నిందితులకు జైలు శిక్ష పడింది. ఏపీ సీఎం వై.ఎస్.జగన్పై సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ప్రత్యేక న్యాయవాదిగా పనిచేశారు.
సూరేపల్లి నంద: సికింద్రాబాద్కు చెందిన నంద బి.దానప్ప, మీరాలకు 1969 ఏప్రిల్ 4న జన్మించారు. భర్త ఎస్.మాధవరావు. బి.ఎ., ఎల్ఎల్బీ చేసిన ఆమె 1993 ఆగస్టు 4న బార్ కౌన్సిల్లో నమోదయ్యారు. 28 ఏళ్లపాటు పలు రాజ్యాంగ, సివిల్, క్రిమినల్, కార్మిక, రెవెన్యూ, సర్వీసులకు సంబంధించిన కేసుల్లో వాదనలు వినిపించారు. న్యాయసేవాధికార సంస్థ లీగల్ ఎయిడ్ ప్యానెల్ న్యాయవాదులకు తెలుగు రాష్ట్రాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. 2000 సంవత్సరం నుంచి బార్ కౌన్సిల్ స్టాండింగ్ కౌన్సిల్గా కొనసాగుతున్నారు. ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా వ్యవహరించారు. కేంద్రం తరఫున న్యాయవాదిగా పనిచేశారు. నిమ్స్, కార్పొరేషన్ బ్యాంక్ల పక్షానా వాదనలు వినిపించారు. హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శిగా కొనసాగారు. లా జర్నళ్లకు రిపోర్టర్గా పనిచేశారు. 2010లో న్యాయసేవల విభాగం నుంచి ఆచార్య చాణక్య సద్భావన పురస్కారం పొందారు.
ముమ్మినేని సుధీర్ కుమార్: ఖమ్మం జిల్లాలో వ్యవసాయ కుటుంబానికి చెందిన నాగేశ్వరరావు,భారత లక్ష్మి దంపతులకు 1969 మే 20న జన్మించారు. చర్ల ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యాభ్యాసం పూర్తిచేసి ఏలూరు సర్ సీఆర్రెడ్డి కాలేజీలో డిగ్రీ చేశారు. నాందేడ్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ మరట్వాడ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టాపొంది 1994లో బార్ కౌన్సిల్లో నమోదయ్యారు. అన్ని విభాగాల్లోని కేసుల్లో హైకోర్టులో వాదనలు వినిపించారు.
జువ్వాడి శ్రీదేవి: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జువ్వాడి సూర్యారావు, భారతిలకు 1972 ఆగస్టు 10న జన్మించారు. 1997లో బార్ కౌన్సిల్లో నమోదయ్యారు. నిర్మల్ కోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా, 2018 నుంచి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్నారు. భర్త కె.శ్రీహరిరావు కూడా న్యాయవాదే.
శ్రావణ్కుమార్ వెంకట్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు. పీవీ పెద్ద కుమార్తె శారద, సిద్దిపేట జిల్లా గుగ్గిళ్ల గ్రామానికి చెందిన నచ్చరాజు వెంకటకిషన్రావు దంపతులకు 1967 ఆగస్టు 18న జన్మించారు. ఉస్మానియా నుంచి బీకాం, ఎల్ఎల్బీ, మేశ్రా రాంచి బిట్స్ నుంచి ఎంబీయే చేశారు. 2005 నవంబరు 17న బార్ కౌన్సిల్లో నమోదయ్యారు. హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. సిటీ సివిల్ కోర్టు, ఎన్సీఎల్టీలతోపాటు హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. సివిల్ కేసులతోపాటు టాక్స్, కంపెనీలా, ఆర్బిట్రేషన్ వంటి వాణిజ్య విభాగాల్లోని కేసుల్లో నైపుణ్యం సాధించారు.
న్యాయాధికారుల నుంచి...
జి.అనుపమా చక్రవర్తి: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామంలో డాక్టర్ ఎన్.కృష్ణచంద్రరావు, మహాలక్ష్మిలకు 1970 మార్చి 21న జన్మించారు. విశాఖపట్నంలోని ఎన్బీఎం లా కాలేజీలో న్యాయశాస్త్రంలో పట్టా పొందిన అనంతరం ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1994లో బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యాక సివిల్, క్రిమినల్ కోర్టులు, కోఆపరేటివ్ ట్రైబ్యునల్తోపాటు ఇతర ట్రైబ్యునళ్లు, హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2006లో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా పనిచేశారు. 2008 నవంబరు 2న జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో పనిచేశారు. కరీంనగర్ జిల్లా జడ్జిగా, తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీగా, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా, కోఆపరేటివ్ ట్రైబ్యునల్ ఛైర్పర్సన్గా పనిచేశారు. ప్రస్తుతం వ్యాట్ ట్రైబ్యునల్ ఛైర్పర్సన్గా కొనసాగుతున్నారు.
మాటూరి గిరిజా ప్రియదర్శిని: విశాఖపట్నంలోని మాటూరి అప్పారావు, నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు. అక్కడ ఎన్బీఎం లా కాలేజీలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీలో మూడు పీజీ కోర్సులు చేశారు. లేబర్ అండ్ ఇండస్ట్రీ లాలో మాస్టర్ ఆఫ్ లా పూర్తి చేశారు. వ్యాపారం రంగంలో ఉన్న విజయ్కుమార్తో వివాహం అయింది. వివాహం అయ్యాక విద్యాభ్యాసం కొనసాగిస్తూ కుటుంబంతోపాటు కెరీర్కు బాటలు వేసుకున్నారు. 1995లో బార్కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యాక విశాఖ జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేశారు. జిల్లా జడ్జి పరీక్ష రాసి మొదటి ప్రయత్నంలోనే 2008 నవంబరు 3న ఎంపికయ్యారు. అదనపు జిల్లా జడ్జిగా గుంటూరు, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో, ఖమ్మం కుటుంబ న్యాయస్థానం జడ్జిగా, ప్రకాశం జిల్లా, ఆదిలాబాద్ జిల్లా జడ్జిగా పనిచేసి ప్రస్తుతం కరీంనగర్ జిల్లా జడ్జిగా కొనసాగుతున్నారు. సంగీతం, శాస్త్రీయ నృత్యంలోనూ ప్రవేశం ఉంది.
సాంబశివరావు నాయుడు: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన సత్యనారాయణ, సూర్యవతి దంపతులకు 1962 ఆగస్టు 1న జన్మించారు. స్థానికంగా విద్యాభ్యాసం పూర్తి చేసి, అమలాపురం ఎస్కెబీఆర్ కాలేజీలో బీకాం, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1986లో న్యాయవాదిగా రామచంద్రాపురంలోనే ప్రాక్టీస్ ప్రారంభించారు. 1991లో జిల్లా మున్సిఫ్గా ఎంపికై జూనియర్, సీనియర్ సివిల్, అదనపు జిల్లా జడ్జిగా హుజూరాబాద్, కరీంగనర్, వరంగల్, కొత్తగూడెం, తిరుపతిల్లో పనిచేశారు. జిల్లా జడ్జిగా మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుల్లో పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ ఏసీబీ ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2019 నుంచి పనిచేస్తున్నారు.
ఏనుగు సంతోష్రెడ్డి: జగిత్యాల జిల్లా జోగిన్పల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు నారాయణరెడ్డి, లింగమ్మలకు జన్మించారు. జగిత్యాల ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో గ్రాడ్యుయేషన్, అనంతపురం ఎస్కే యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ లా పూర్తి చేశారు. 1985లో బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయి కరీంనగర్ జిల్లా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 1991లో జిల్లా మున్సిఫ్గా ఎంపికై సీనియర్ సివిల్ జడ్జిగా, జిల్లా జడ్జిగా పదోన్నతులు పొందారు. అదనపు జిల్లా జడ్జిగా సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో పనిచేశారు. 2013లో ఉమ్మడి రాష్ట్రంలోను, అనంతరం తెలంగాణ న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేశారు. 2018లో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీగా, 2019 నుంచి తిరిగి న్యాయశాఖ కార్యదర్శిగా నియమితులై కొనసాగుతున్నారు.
దేవరాజ్ నాగార్జున్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వనపర్తిలో 1962 ఆగస్టు 15న దేవరాజ్ రామకృష్ణారావు, విమలాదేవిలకు జన్మించారు. వనపర్తిలోని ఆర్ఎల్డీలో బీఎస్సీ, గుల్బర్గా ఎస్ఎస్ఎల్ లా కాలేజీలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. గుల్బర్గాలో ఎంఎల్ పూర్తి చేసి కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎంఎ చేశారు. నల్సార్ యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. 1986లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యాక వనపర్తి కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 1991 మే 1న జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. సీనియర్ సివిల్ జడ్జి, అదనపు జిల్లా జడ్జి, జిల్లా జడ్జిగా పలు జిల్లాల్లో పనిచేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ అడ్మినిస్ట్రేషన్, రిజిస్ట్రార్ జ్యుడిషియల్గా పనిచేశారు. ప్రస్తుతం రిజిస్ట్రార్ జనరల్గా కొనసాగుతున్నారు. హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటైన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ట్రస్ట్ డీడ్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?