KTR: పక్క రాష్ట్రంలో నీళ్లు లేవు.. కరెంటు లేదు
పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని.. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి పుట్టించాయి. తన స్నేహితుడు ఒకరు సంక్రాంతికి ఆ రాష్ట్రానికి వెళ్లి వచ్చి అక్కడి పరిస్థితిని చెప్పారంటూ పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ను గురించి ఆయన ప్రస్తావించారు. అ...
రోడ్లన్నీ ధ్వంసమై అధ్వానంగా మారాయి: మంత్రి కేటీఆర్
తప్పుబట్టిన ఏపీ మంత్రులు
హైదరాబాద్లోనూ కరెంటు కోతలున్నాయన్న బొత్స, సజ్జల
ఈనాడు- హైదరాబాద్, అమరావతి
పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని.. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి పుట్టించాయి. తన స్నేహితుడు ఒకరు సంక్రాంతికి ఆ రాష్ట్రానికి వెళ్లి వచ్చి అక్కడి పరిస్థితిని చెప్పారంటూ పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ను గురించి ఆయన ప్రస్తావించారు. అక్కడ రహదారులు, నీళ్లు, విద్యుత్ పరిస్థితి అధ్వానంగా ఉందని మిత్రుడు చెప్పారన్నారు. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెంటనే స్పందించారు.
హైదరాబాద్లోనూ కరెంటు కోతలున్నాయని, తాను జనరేటర్ వేసుకుని ఉన్నానని వ్యాఖ్యానించారు. కరెంటు కోతలు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయని, అది జాతీయ సమస్య అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అమర్నాథ్ తదితరులూ కేటీఆర్ వ్యాఖ్యలపై సీరియస్గా స్పందించారు. బొత్స మాటలపై తెలంగాణలో మరికొందరు నేతలు స్పందిస్తూ.. ఏపీలో ఉన్నదే కేటీఆర్ చెప్పారని అన్నారు.
హైదరాబాద్లో శుక్రవారం క్రెడాయ్ 11వ ప్రాపర్టీ షోను ప్రారంభించిన అనంతరం తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ‘నా స్నేహితుడు ఒకాయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ ఆయనకు తోటలు, ఇళ్లు ఉన్నాయి. వెళ్లొచ్చాక నాకు ఫోన్ చేశారు. అక్కడ నాలుగు రోజులు ఉంటే కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. రహదారులు ధ్వంసమై ఉన్నాయి. అన్యాయంగా, అధ్వానంగా ఉంది.. తిరిగి వచ్చాకే ఊపిరి పీల్చుకున్నట్లు ఉంది. దయచేసి మనవాళ్లందర్నీ అక్కడికి ఒకసారి పంపండి.. అప్పుడే మన విలువ ఏంటో.. మన ప్రభుత్వం చేస్తున్నదేంటో తెలిసి వస్తుందన్నారు. నేను చెబుతున్నది అతిశయోక్తి అనిపిస్తే, సొంత డబ్బా కొట్టుకోవడానికి ఎక్కువ చెబుతున్నా అనుకుంటే.. కారు తీసుకుని పక్క రాష్ట్రానికి వెళ్లి రండి. కొన్ని మాటలు కొందరికి నచ్చకపోవచ్చు కానీ ఇవి వాస్తవాలు’ అని కేటీఆర్ అన్నారు. బెంగళూరు నుంచి కూడా తనకు ఫోన్లు వస్తుంటాయని.. విమానాశ్రయం నుంచి గమ్యస్థానం చేరడానికి ఎన్ని గంటలు పడుతుందో చెప్పలేమని, హైదరాబాద్లో అరగంటలోనే వెళ్లిపోగలుగుతున్నామని చెబుతుంటారని వివరించారు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మౌలిక వసతుల కల్పనలో దేశంలోనే హైదరాబాద్ అత్యుత్తమ నగరమని స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని నగరాల్లో భవనాలు కట్టాలంటే ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి చదరపు అడుగుకు ఇంత అని లంచమివ్వాలన్నారు. మన రాష్ట్రంలో లంచం ఇచ్చి అనుమతి తీసుకునే పరిస్థితి లేదని.. ఎంతో పారదర్శకంగా, ప్రగతిశీలంగా ముందుకెళుతున్నామని కేటీఆర్ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి, అమర్నాథ్, రోజా తదితరులు వెంటనే స్పందించారు.
హైదరాబాద్లోనూ జనరేటర్ వాడాను: బొత్స
‘హైదరాబాద్లోనూ కరెంటు లేదు. అక్కడ జనరేటర్ వాడాల్సి వచ్చింది. ఇది నా స్వీయానుభవం’ అని పేర్కొన్నారు. ‘కేటీఆర్కు ఆయన స్నేహితుడు ఫోన్లో ఏదో చెప్పి ఉండొచ్చు. కానీ నేను స్వయంగా హైదరాబాద్లో ఉండి వస్తున్నా. అక్కడ కరెంటే లేదు. జనరేటర్ వినియోగించాం. ఆ పరిస్థితి నేను అనుభవించాను కాబట్టి చెబుతున్నా. మరి దీనికి కేటీఆర్ ఏం సమాధానం చెబుతారు? కేటీఆర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నా’ అని అన్నారు.
ఏపీలో ఉన్నదే కేటీఆర్ చెప్పారు: ప్రశాంత్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ గురించి ఉన్న నిజాన్నే మంత్రి కేటీఆర్ చెప్పారని తెలంగాణ మంత్రి ప్రశాంత్రెడ్డి విలేకర్లతో అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులపై ఒక స్నేహితుడన్న వ్యాఖ్యలను కేటీఆర్ ప్రస్తావించారు. దీనిపై అక్కడి మంత్రి బొత్స సత్యనారాయణ హైదరాబాద్లో కరెంటు పోతే జనరేటర్ వేసుకోవాల్సి వచ్చిందని చెప్పడం పచ్చి అబద్ధం. విజయవాడ నుంచి స్థిరాస్తి వ్యాపారులంతా తెలంగాణకు వస్తున్నది అక్కడి మంత్రులకు కనిపించడం లేదా?’ అని అన్నారు.
బొత్స కరెంటు బిల్లు కట్టలేదేమో
- తెలంగాణ ఎంపీ రంజిత్రెడ్డి
తెలంగాణ బాగా అభివృద్ధి చెందుతోందని, ఈ రాష్ట్రంతో పోల్చి అక్కడి (ఏపీ) వారు ఏమైనా అంటారేమోనని భయపడి ఏపీ మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణ ఎంపీ రంజిత్రెడ్డి విమర్శించారు. ఆ రాష్ట్రంలోని పరిస్థితులపై మంత్రి కేటీఆర్ మాట్లాడితే ఎందుకంత ఉలిక్కిపడుతున్నారన్నారు. ‘కేటీఆర్ వ్యాఖ్యల్లో తప్పు లేదు. బొత్స సత్యనారాయణ కరెంటు బిల్లు కట్టలేదేమో! అందుకే కట్ చేసి ఉంటారు. జగన్ సహా వైకాపా నాయకులు, వారి కుటుంబాలు మొత్తం ఇక్కడే ఉంటున్నాయి. వారినడిగితే వాస్తవాలు చెబుతారు. కేసీఆర్ పాలన బాగుంది.. అందరమూ ఆయన అభిమానులమని వైకాపా ఎంపీలు నాతో చెప్పారు’ అని ఎంపీ అన్నారు.
కాంక్రీట్ నిర్మాణాలుంటేనే అభివృద్ధా?: సజ్జల
కాంక్రీట్ నిర్మాణాలుంటేనే అభివృద్ధిగా పరిగణిస్తే.. హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సామాజిక అభివృద్ధిని కొలమానంగా తీసుకుంటే దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చినా ఆంధ్రప్రదేశ్ చాలా చాలా ముందుందన్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై సజ్జల స్పందించారు.
ఓట్ల కోసమే అలా మాట్లాడారు: పెద్దిరెడ్డి
‘త్వరలో తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయి. ఓట్లు పడతాయన్న ఉద్దేశంతోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీపై వేలెత్తి చూపిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో రహదారులు బాగాలేవు.. నీరు, కరెంటు సమస్యలు ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే అలా మాట్లాడి ఉంటారేమో’.. అని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ కరెంటు కష్టాలు ఉన్నాయి. తెలంగాణలో బొగ్గు ఎక్కువగా ఉన్నందునే విద్యుత్తు కొరత లేదు. ఏపీలోనూ ఎక్కడా కోతలు లేవు. ప్రజలకు 24 గంటలూ ఇస్తున్నాం. కేవలం పరిశ్రమలకు కొంత సమయం ఆపేస్తున్నాం. 10 వేల కిలోమీటర్లు పంచాయతీరాజ్ రహదారులు వేశాం. రహదారులు తెలంగాణలోనూ వేయలేదన్న విషయాన్ని గుర్తించాలి’ అని మంత్రి వివరించారు.
కేటీఆర్ మాట్లాడింది ఏపీపై కాదు: రోజా
ఆంధ్రప్రదేశ్ గురించి కేటీఆర్ ఎక్కడా మాట్లాడలేదని ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా అన్నారు. పొరుగు రాష్ట్రాలు అని ప్రస్తావించారే కానీ.. ఏపీ ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదని చెప్పారు. ఏపీ గురించే కేటీఆర్ మాట్లాడి ఉంటే ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కుటుంబసమేతంగా కలిసిన అనంతరం రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మంత్రిగా కేటీఆర్ను సాదరంగా ఏపీకి ఆహ్వానిస్తున్నా. జగన్ తీసుకొచ్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను, విప్లవాత్మక మార్పులను ఆయనకు దగ్గరుండి చూపిస్తాను. అవన్నీ చూశాక తెలంగాణలోనూ ఇటువంటి విప్లవాత్మక సంక్షేమ పథకాలను అమలు చేయాలనుకుంటారు’ అని రోజా చెప్పారు.
ఏపీ అభివృద్ధిని చూసి మాట్లాడాలి
- ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా
కేటీఆర్ ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని కళ్లారా చూడాలని రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) అన్నారు. కేటీఆర్ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న సంక్షేమంతోపాటు అభివృద్ధి పనులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయన్నారు. ఎవరో స్నేహితుడు చెప్పాడని మా రాష్ట్రం గురించి, తప్పుగా మాట్లాడి తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టవద్దని సూచించారు. హైదరాబాద్ మీరు కానీ, కేసీఆర్ కానీ అభివృద్ధి చేయలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అభివృద్ధి జరిగిందన్నారు. వర్షాలొస్తే ఎప్పుడు మునిగిపోతుందోనని హైదరాబాద్ ప్రజలు ఆందోళన చెందుతున్నారని, ముందు ఆ సమస్యపై దృష్టిసారించాలని కేటీఆర్కు హితవు పలికారు.
ఆర్థిక ఇబ్బందులున్నా.. రహదారుల అభివృద్ధి
- ఏపీ రవాణా శాఖ మంత్రి విశ్వరూప్
తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెంది, మిగులు బడ్జెట్తో ఉందని.. ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్, కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని రవాణాశాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. సంక్రాంతికి ముందు వరకు ఏపీలో రహదారులు బాగోలేదన్నారు. అప్పటి నుంచి రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు జరుగుతున్నాయని చెప్పారు.
వాపును చూసి బలుపు అనుకుంటున్నారేమో
- ఏపీ ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్
ఒక నగరాన్ని చూసుకొని వాపును చూసి బలుపనుకుంటే ఏం సమాధానం చెప్పలేమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్రమంటే ఒక నగరం కాదనే విషయాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ గమనించాలన్నారు. ఒక నగరాన్ని చూసి రాష్ట్రమంతా బ్రహ్మాండంగా ఉందనే అపోహలో ఆయన ఉంటే ఆయనను, ఆ రాష్ట్ర ప్రజలను దేవుడే కాపాడాలన్నారు. రాష్ట్రం బాగుండటం అంటే అందులోని నగరమో.. ఆ ప్రభుత్వంలోని పెద్దలు బాగుండటమో కాదన్నారు. ఆ రాష్ట్రంలోని పేదలు బాగున్నారా లేదో చూడాలని వ్యాఖ్యానించారు. దిల్లీలోని ఏపీ భవన్లో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. వేదికపై ఉన్న పెద్ద మనుషులను నవ్వించడానికో, పక్కవాళ్లను కించపర్చుతూ తాము గొప్పవాళ్లమని అనిపించుకోవడానికో అలా మాట్లాడడం సమంజసం కాదన్నారు. ఏ రాష్ట్రమైనా, మాట్లాడిన ఏ నాయకుడైనా, వ్యక్తులైనా జగన్తో పోటీపడగలరా అని అమర్నాథ్ ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు: లోకేశ్
ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన జగన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేశారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఏపీలో విద్యుత్తు కోతలు ఎక్కువగా ఉన్నాయని, నీటి సౌకర్యం లేదని, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని ఏపీకి వెళ్లొచ్చిన తన స్నేహితుడు చెప్పాడని కేటీఆర్ పేర్కొన్న వీడియోను ఆయన ట్వీట్కు జత చేశారు.
చేతకాని ప్రభుత్వం కేటీఆర్ వ్యాఖ్యలకు ఏం జవాబిస్తుంది?
- ట్విటర్లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
చేతకాని జగన్ ప్రభుత్వం తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతుంది? ఏపీ వాస్తవ పరిస్థితులనే కేటీఆర్ చెప్పారు. ఏపీలో భూముల ధరలు గణనీయంగా పడిపోతే.. తెలంగాణలో పెరిగాయి. జగన్ పాలనలో ఏపీలో శాంతిభద్రతలు క్షీణించడం, అభివృద్ధి లేకపోవడం, పరిశ్రమలు మూతపడటంతో అందరూ తెలంగాణ సురక్షితమని భావిస్తున్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలకు సిగ్గుపడాలి
- నక్కా ఆనంద్బాబు, మాజీ మంత్రి
జగన్, కేటీఆర్లు అన్నదమ్ముల్లాంటివారు. అన్న పాలన గురించి తమ్ముడు చేసిన వ్యాఖ్యలకు వైకాపా నేతలు సిగ్గుపడాలి.
కేసీఆర్, కేటీఆర్ వ్యాఖ్యలకు జగన్ సమాధానం చెప్పాలి
- తెదేపా ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి
ఆంధ్రప్రదేశ్లో పాలనను కించపరుస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్, ఆ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్రావులు చేస్తున్న వ్యాఖ్యలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలి. ఏపీలో అభివృద్ధి నిల్.. కరెంట్ కోతలు, అవినీతి ఫుల్ అని కేటీఆర్ అన్న మాటలు ముమ్మాటికీ వాస్తవం.
నా వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు
అవి అన్యాపదేశంగా చేసినవి
అర్ధరాత్రి ట్విటర్లో కేటీఆర్
హైదరాబాద్, ఈనాడు: తాను ఈ రోజు ఇక్కడ క్రెడాయ్ సమావేశంలో అన్యాపదేశంగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లోని నా స్నేహితులకు తెలియకుండానే కొంత బాధ కలిగించి ఉండొచ్చని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని, ఎవరినో బాధ పెట్టాలనో, కించపరచాలనో అలా మాట్లాడలేదని వివరించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో ట్వీట్ చేశారు. ‘‘నేను ఏపీ సీఎం జగన్ను సోదర సమానుడిగా భావిస్తున్నా. ఆయన నాయకత్వంలో ఆ రాష్ట్రం అభివృద్ధిచెందాలని మనసారా కోరుకుంటున్నా’’ అని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?