General tranfers:సాధారణ బదిలీలు లేనట్లే..!
రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం కింద జిల్లా, జోన్లు, బహుళజోన్లలో ఉద్యోగుల బదలాయింపుల దృష్ట్యా ఈ ఏడాది సాధారణ బదిలీలు (జనరల్ ట్రాన్స్ఫర్స్) చేపట్టరాదని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇటీవల అన్ని శాఖల
జోనల్ బదలాయింపుల దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం
పరిశీలనలో ‘పరస్పర బదిలీలు’
ఇప్పటికే గుర్తించిన ఖాళీల ఆధారంగానే నోటిఫికేషన్లకు సన్నాహాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం కింద జిల్లా, జోన్లు, బహుళజోన్లలో ఉద్యోగుల బదలాయింపుల దృష్ట్యా ఈ ఏడాది సాధారణ బదిలీలు (జనరల్ ట్రాన్స్ఫర్స్) చేపట్టరాదని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇటీవల అన్ని శాఖల కార్యదర్శులు, కమిషనర్లు, డైరెక్టర్లు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో ప్రభుత్వం ఈ సంకేతాలను ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో చివరిసారిగా 2018లో ఉద్యోగులకు బదిలీలు జరిగాయి. సాధారణ బదిలీలు చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని ఏటా కోరుతున్నాయి. ఈ ఏడాది జరుగుతాయని ఆశించారు. అయితే కొత్త జోనల్ విధానం అమల్లోకి రావడంతో ప్రభుత్వం వాటికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపులు, బదలాయింపులను చేపట్టింది. నెలరోజుల వ్యవధిలో దాదాపు 70 వేల మందికి బదిలీలు చేశారు. ఈ ప్రక్రియలో ఇంకా భార్యాభర్తలైన ఉద్యోగులకు సంబంధించిన వినతులతో పాటు ఇతరత్రా అంశాలను పరిష్కరించాల్సి ఉంది. దీంతోపాటు ఇప్పటికే బదిలీ అయిన వారికి సంబంధించిన సీనియారిటీని ఖరారు చేయాలి. జిల్లా స్థాయుల్లో సమస్య లేకున్నా జోనల్, బహుళజోనల్ పోస్టుల్లోకి బదిలీ అయిన వారికి, భార్యాభర్తలకు సంబంధించి సీనియారిటీపై స్పష్టత రావాలి. వారిని ఒకే చోట నియమిస్తే.. అప్పటికే అక్కడున్నవారి తర్వాత సీనియారిటీని ఇచ్చే వీలుంది. దీనిపై ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఈ సందడిలోనే తమకు పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీనికి అనుమతిస్తే మొత్తంగా ఈ ప్రక్రియ పూర్తికావడానికి మరికొన్ని రోజులు అవసరం. మరోవైపు ఉద్యోగుల బదలాయింపులు పూర్తి అయ్యాక... వాటి ప్రాతిపదికన ఖాళీలను గుర్తించి, నోటిఫికేషన్లు ఇచ్చి, నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని గురించి అన్ని శాఖల నుంచి సమాచారం సేకరిస్తోంది. ఈ వివరాలు రాగానే... ఖాళీల ప్రాతిపదికనే కొత్త ఉద్యోగ నియామకాలు జరిగే వీలుంది. అలా గాకుండా సాధారణ బదిలీలు చేపడితే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. సాధారణంగా విద్యాసంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్, మే మాసాల్లో సాధారణ బదిలీలు జరుగుతుంటాయి. అన్ని శాఖల్లో, అన్ని స్థాయుల్లో ఇవి జరుగుతుంటాయి. ఉద్యోగుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, ఐచ్ఛికాలు, కౌన్సెలింగు, కొత్త పోస్టుల్లో చేరడం తదితరాలకు నెల నుంచి రెండు నెలల గడువు అవసరం. రాష్ట్రంలో ఇప్పటికే చేపట్టిన జోనల్ విధానంలో బదిలీ అయి కొత్త పోస్టింగుల్లో చేరుతున్నారు. వెంటనే మళ్లీ సాధారణ బదిలీలు చేపడితే.. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు దరఖాస్తు చేసుకుంటే గందరగోళంగా మారుతుందని, పాలనపైనా ప్రభావం చూపుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిణామాలన్నింటి దృష్ట్యా వాటిని ఈ ఏడాది చేపట్టరాదని అనుకుంటున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?