పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాస్తవానికి అక్కడ వచ్చే నెల 14న పోలింగ్ జరగాల్సి ఉండగా.. దాని బదులు 20న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. ఏటా ఫిబ్రవరి 16న నిర్వహించే గురు
ఫిబ్రవరి 14కు బదులు 20న నిర్వహణ
ప్రకటించిన ఎన్నికల సంఘం
గురు రవిదాస్ జయంతి నేపథ్యంలో నిర్ణయం
ఈనాడు, దిల్ల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాస్తవానికి అక్కడ వచ్చే నెల 14న పోలింగ్ జరగాల్సి ఉండగా.. దాని బదులు 20న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. ఏటా ఫిబ్రవరి 16న నిర్వహించే గురు రవిదాస్ జయంతి వేడుకలను పురస్కరించుకొని.. పంజాబ్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్తర్ ప్రదేశ్లోని వారణాసికి దాదాపు వారం రోజుల ముందునుంచే తరలివెళ్తుంటారు. కాబట్టి ఫిబ్రవరి 14న పోలింగ్ నిర్వహిస్తే చాలామంది ఓటుహక్కు వినియోగించుకోలేకపోతారని.. ఎన్నికలను వాయిదా వేయాలని పంజాబ్ సీఎం చరణ్జీత్సింగ్ చన్నీతో పాటు భాజపా, ఇతర రాజకీయ పార్టీలూ ఈసీకి విన్నవించాయి. సానుకూలంగా స్పందించిన ఈసీ.. వాయిదా నిర్ణయాన్ని సోమవారం వెలువరించింది. ఫిబ్రవరి 20న ఉత్తర్ ప్రదేశ్లో మూడో విడత పోలింగ్ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల షెడ్యూలును మార్చిన ఉదంతాలు గతంలోనూ ఉన్నాయని ఈసీ వర్గాలు వెల్లడించాయి. 2013లో మిజోరం అసెంబ్లీ ఎన్నికలు, 2014 ఏప్రిల్లో అదే రాష్ట్రంలో ఓ ఉప ఎన్నికతో పాటు 2012 మార్చిలో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల తొలి విడత తేదీలను మార్చిన సంగతిని గుర్తుచేశాయి.
కొత్త షెడ్యూల్ ఇదీ..
జనవరి 25 - ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఫిబ్రవరి 1 - నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
ఫిబ్రవరి 2 - నామపత్రాల పరిశీలన
ఫిబ్రవరి 4 - నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
ఫిబ్రవరి 20 - పోలింగ్ తేదీ
మార్చి 10 - ఫలితాల వెల్లడి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్