‘గోలీ’మోర్
ఒమిక్రాన్ దెబ్బకు ఔషధ విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి. రాష్ట్రంలో మూడో దశకు ముందు రూ.70 కోట్ల మేరకు కొవిడ్ మందు అమ్మకాలు కాగా ఈ మూడువారాల్లో ఏకంగా 8-15 రెట్లు పెరిగాయి. సుమారు రూ.600 కోట్ల కొవిడ్ మందులను ప్రజలు వినియోగించారు. కరోనా బాధితుల్లో అత్యధికులు ఇంటి వద్దనే చికిత్స పొందుతుండటంతో..
3 వారాల్లోనే రూ.600 కోట్ల ఔషధాల విక్రయం
అంతకుముందు రూ.70 కోట్ల అమ్మకాలు
8-15 రెట్లు పెరిగిన వినియోగం
ఈనాడు, హైదరాబాద్: ఒమిక్రాన్ దెబ్బకు ఔషధ విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి. రాష్ట్రంలో మూడో దశకు ముందు రూ.70 కోట్ల మేరకు కొవిడ్ మందు అమ్మకాలు కాగా ఈ మూడువారాల్లో ఏకంగా 8-15 రెట్లు పెరిగాయి. సుమారు రూ.600 కోట్ల కొవిడ్ మందులను ప్రజలు వినియోగించారు. కరోనా బాధితుల్లో అత్యధికులు ఇంటి వద్దనే చికిత్స పొందుతుండటంతో.. బహిరంగ విపణిలో ఔషధ విక్రయాలు బాగా పెరిగినట్లుగా వైద్యవర్గాలు విశ్లేషించాయి. మందులు లభ్యం కావనే భావనతో ఎక్కువగా కొనుగోలు చేసి భద్రపర్చుకుంటున్నారని వ్యాపారులు తెలిపారు.
95 శాతం ఇంటి వద్దనే..
వైద్యఆరోగ్యశాఖ సమాచారం ప్రకారం.. ఈ నెల 25 నాటికి రాష్ట్రంలో 34 వేల మంది కొవిడ్తో చికిత్స పొందుతున్నారు. వారిలో 95 శాతం ఒమిక్రాన్ బాధితులే. వారిలో దాదాపు 95 శాతం మంది ఇంటివద్దే చికిత్స తీసుకుంటున్నారు. కుటుంబంలో ఒకరిలో లక్షణాలు కనిపించగానే.. ఒకట్రెండు రోజుల్లోనే మిగిలిన సభ్యుల్లోనూ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో అందరూ కొవిడ్ ఔషధాలను వాడుతున్నారు. దీంతో ఔషధ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. చాలాచోట్ల పేరున్న ఔషధ ఉత్పత్తి సంస్థల దగ్గు మందు అందుబాటులో ఉండడంలేదు. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావ తీవ్రత అధిక సందర్భాల్లో గొంతు వరకే పరిమితమవుతుండటం.. ఆసుపత్రుల్లో చేరికలు తక్కువగా ఉండటం.. తదితర కారణాలతో వైద్యులు కూడా పరిమిత సంఖ్యలోనే ఔషధాలను సూచిస్తున్నారు. యాంటీబయాటిక్స్ ఔషధాల వాడకం ఈ దశలో అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నా.. ఐసీఎంఆర్ సూచిస్తున్నా.. వీటిని మాత్రం ఎక్కువమంది వాడుతూనే ఉన్నారు. అందువల్ల వాటి విక్రయాలు పెరిగాయి.
స్వీయ పరీక్షలకు డిమాండ్
ఇంటి వద్దనే కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించడంతో.. విపణిలో దాదాపు అన్ని ఔషధ దుకాణాల్లోనూ స్వీయ నిర్ధారణ కొవిడ్ కిట్లు లభిస్తున్నాయి. ఎక్కువమంది వీటిని కొని సొంతంగా పరీక్షించుకుంటున్నారు. ఒక్కో కిట్ ఖరీదు సుమారు రూ.250. ఈ కిట్లను ఒక పెద్దషాపులో రోజుకు 500 వరకూ విక్రయిస్తున్నారు. అదే చిన్న షాపులో సుమారు 100 వరకూ విక్రయిస్తున్నారు. ఈ నెలలోనే సుమారు రూ.150 కోట్ల స్వీయ నిర్ధారణ కిట్లు అమ్మినట్లు ఔషధ వ్యాపార వర్గాలు తెలిపాయి.
* హైదరాబాద్ నిమ్స్ సమీపంలో ఉన్న రెండు పెద్ద ఔషధ దుకాణాల్లో సాధారణ రోజుల్లో రోజుకు రూ.50-60 వేల వరకూ విక్రయాలు జరుగుతుంటాయి. అయితే గత 3 వారాలుగా కొవిడ్ కేసులు అనూహ్యంగా పెరగడంతో.. వీటిలో రోజుకు ప్రస్తుతం రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకూ అమ్మకాలు సాగుతున్నాయి.
* వరంగల్లోని ఒక కాలనీలో ఉన్న మందుల దుకాణంలో సాధారణ రోజుల్లో రోజుకు సుమారు రూ.40 వేల వరకూ అమ్మకాలుంటాయి. అయితే ఇప్పుడు రోజుకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకూ అమ్మకాలు కొనసాగుతున్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరగడంతో మందుల వినియోగం ఎలా ఉందో చెప్పడానికి ఇవి ఉదాహరణలు మాత్రమే.
ఎక్కువగా కొనుగోలు చేస్తున్న ఔషధాలు
యాంటీ బయాటిక్స్: డాక్సిసైక్లిన్, అజిథ్రోమైసిన్, సెఫిక్సిమ్
యాంటీ హిస్టామిన్: మోంటెలికాస్ట్, ఆంబ్రోక్సిల్, లెవోసెట్రిజిన్, ఎసెటైల్సిస్టెయిన్
ఇతర మందులు: పారాసెటమాల్ లాంటి జ్వరం మాత్రలు, విటమిన్-డి, దగ్గు మందులు, పాంటాప్రొజోల్, రానిటడైన్ వంటి అసిడిటీ మాత్రలు.
మందుల ధరలు పెరగలేదు
రెండోదశలో గన్ థర్మామీటర్లు ఎక్కువగా కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు వాటిని ఎక్కువమంది కొనడం లేదు. ఫావిపిరవిర్ అమ్మకాలు కూడా తగ్గాయి. విటమిన్ మాత్రల్లో ఎక్కువగా విటమిన్-డి ఎక్కువగా కొంటున్నారు. మందుల కొనుగోలు శాతం పెరిగింది. అయితే మందుల ధరలు మాత్రం పెరగలేదు. డిమాండ్కు సరిపడా ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. అవసరాలకు మించి ముందస్తుగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.
-అరుగొండ శ్రీధర్, అధ్యక్షులు, జీహెచ్ఎంసీ ఔషధ దుకాణదారుల సంఘం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?