ఉదాసీనత అసలే వద్దు
ఒక ప్రైవేటు ఉద్యోగి(40)కి రెండురోజులు జ్వరం వచ్చింది. 101-102 డిగ్రీలకు తగ్గడం లేదు. యాంటిజెన్తో పాటు ఆర్టీ పీసీఆర్ పరీక్ష కూడా చేయించుకున్నాడు. రెండింటిలోనూ ‘నెగెటివ్’ అనే ఫలితం వచ్చింది. హమ్మయ్య.. కొవిడ్ లేదని ఊపిరి పీల్చుకున్నాడు. సాధారణ జ్వరం మాత్రలు వాడుతూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నాడు.
ఆర్టీపీసీఆర్ సామర్థ్యం 70-80 శాతమే
లక్షణాలు ఉన్నా నెగెటివ్ వస్తే వైరస్ లేదని భావించొద్దు
వారంలోనే పరిస్థితి తీవ్రం కావచ్చు
ఆ పరీక్షను పూర్తిస్థాయిలో నమ్మడానికి వీల్లేదంటున్న నిపుణులు
ఒక ప్రైవేటు ఉద్యోగి(40)కి రెండురోజులు జ్వరం వచ్చింది. 101-102 డిగ్రీలకు తగ్గడం లేదు. యాంటిజెన్తో పాటు ఆర్టీ పీసీఆర్ పరీక్ష కూడా చేయించుకున్నాడు. రెండింటిలోనూ ‘నెగెటివ్’ అనే ఫలితం వచ్చింది. హమ్మయ్య.. కొవిడ్ లేదని ఊపిరి పీల్చుకున్నాడు. సాధారణ జ్వరం మాత్రలు వాడుతూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నాడు. వారం గడిచేసరికి జ్వరం తగ్గకపోగా.. ఊపిరి తీసుకోవడం కష్టమైంది. వెంటనే ఆసుపత్రిలో చేరాడు. అక్కడ పరీక్షిస్తే రక్తంలో ఆక్సిజన్ 87-90 శాతం మధ్య చూపిస్తోంది. అక్కడ కూడా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయగా నెగెటివ్గానే తేలింది. అనుమానం వచ్చి సీటీ స్కాన్ చేయగా.. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ బయటపడింది.
ఆర్టీ పీసీఆర్.. కొవిడ్ నిర్ధారణకు నమ్మకమైన, ఉత్తమమైన పరీక్ష ఇది. అందులో అనుమానం అక్కర్లేదు. ఈ పరీక్ష చేస్తే కరోనా వైరస్ సోకిందా? లేదా? అనేది స్పష్టమవుతోంది. అయితే కేవలం ఆర్టీ పీసీఆర్ చేసినంత మాత్రాన అన్నిసార్లూ కొవిడ్ పూర్తిగా తెలిసిపోతుందనుకోవడానికి వీల్లేదంటున్నారు నిపుణులు. ఇందులో నెగెటివ్ వస్తే.. ఇక వైరస్ సోకలేదని కచ్చితంగా చెప్పలేమంటున్నారు. ఎందుకంటే ఆర్టీ పీసీఆర్ పరీక్ష సామర్థ్యం 70-80 శాతం మాత్రమే. మిగిలిన 20-30 శాతంలో వైరస్ను గుర్తించలేకపోవచ్చు. జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నా.. ఆర్టీ పీసీఆర్లో నెగెటివ్ వచ్చిందనే కారణంతో ఎక్కువమంది ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. తమకు వైరస్ సోకలేదని భావిస్తూ.. లక్షణాలున్నా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యం మరింత క్షీణించిన తర్వాత అప్పుడు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ఇటువంటి వారిలో 5 నుంచి 7 రోజుల్లోనే వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. అందుకే లక్షణాలు కనిపిస్తున్నప్పుడు.. ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ను పూర్తిస్థాయిలో విశ్వసించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. సీటీ స్కాన్కు వెళ్లడం మంచిదని చెబుతున్నారు.
ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ వచ్చినా.. ఎప్పుడు ప్రమాదకరం?
* జ్వరం: మూడు రోజులకు పైగా జ్వరం తీవ్రంగా వస్తుంటే అనుమానించాలి. అంటే పారాసెటమాల్ వేసుకుంటున్నా కూడా శరీరం స్పందించకుండా.. 101 డిగ్రీలు ఆపైన జ్వరం కనిపిస్తుంటే వెంటనే ఆసుపత్రిలో చేరాల్సిందే.
* ఆక్సిజన్: పల్స్ ఆక్సీమీటర్లో రక్తంలో ఆక్సిజన్ శాతం 94 శాతం కంటే తక్కువగా చూపిస్తుంటే కొవిడ్ కావచ్చేమోనని సందేహించాలి. రెండు మూడు గంటల్లో వేర్వేరుగా పరిశీలించినా కూడా.. 94 శాతం కంటే తక్కువగా చూపిస్తుంటే అది ప్రమాదానికి సంకేతమే. అది కొవిడా? కాదా? అనేది తర్వాత సంగతి. ముందు అత్యవసరంగా వైద్యసేవల కోసం ఆసుపత్రికి వెళ్లాల్సిందే.
*రక్త పరీక్షలు: జ్వరం తగ్గడం లేదు. రక్తంలో ఆక్సిజన్ శాతం మాత్రం 94 కంటే పైనే చూపిస్తుంది. ఇలాంటి సమయాల్లో ఎల్డీహెచ్, ఫెరిటిన్, సీఆర్పీ తదితర కొన్ని రక్తపరీక్షలు చేయించాలి. ఇవి రక్తంలో ఇన్ఫ్లేమటరీని సూచిస్తాయి. ఈ మూడింటిలో ఫలితాలు సాధారణం కంటే రెట్టింపు గనుక నమోదైతే.. వెంటనే అత్యవసరంగా వైద్యసేవలు పొందాలి.
*ఇటువంటి సమయాల్లో ఎవరో ఇచ్చిన సలహా మేరకు ఇంట్లోనే ఉండిపోవద్దు. సొంతంగా చికిత్స కూడా పొందొద్దు. ఈ పరిస్థితుల్లో వైద్యుని పాత్ర చాలా ముఖ్యమనేది గుర్తుంచుకోవాలి.
సీటీ స్కాన్ ఎప్పుడు అవసరం?
తక్కువ కాలంలో.. ఎక్కువ జ్వరం ఉండి, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురిచేసే రోగం కొవిడ్. జ్వరం ఉండి కూడా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ వచ్చి, కొవిడ్ కావచ్చనే సందేహం ఉన్నప్పుడు నిర్ధారణ కోసం సీటీ స్కాన్ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకిందా? లేదా? అనేది తెలిసిపోతుంది. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో ఆక్సిజన్ శాతం బాగా పడిపోతున్నప్పుడు.. శ్వాసకోశాలు ఎంత ఎక్కువ ఇన్ఫెక్షన్కు గురయ్యాయనే అంచనాకు ఉపయోగపడుతుంది. ఆర్టీ పీసీఆర్ పాజిటివ్ ఉన్నప్పుడు వైద్యుని సలహా లేకుండా సీటీ స్కాన్ చేయొద్దు. ఎందుకంటే అవసరం లేకున్నా సీటీ స్కాన్ చేయించుకుంటే.. ఆర్థిక భారంతో పాటు 100-800 ఎక్స్రేలకు సమానమైన రేడియేషన్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందుకే ఇది అవసరమో కాదో వైద్యుడే నిర్ణయించాలి. కొవిడ్కు సీటీ స్కాన్పై ఆధారపడి ఏ వైద్యుడు కూడా చికిత్స అందించరని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఫలితాలపై ఆందోళన అనవసరం
ఆర్టీ పీసీఆర్, సీటీ స్కాన్ చేయించిన తర్వాత వచ్చే ఫలితంపైనా ఎక్కువమంది రోగులు ఆందోళన చెందుతుంటారు. వీటి గురించి అసలు భయాందోళనలు చెందొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఆ ఫలితాలు ఏం చెబుతున్నాయో చూద్దాం...
* ఆర్టీ పీసీఆర్లో సీటీ వాల్యూ: ‘సైకిల్ థ్రెషోల్డ్’ (సీటీ). ఇది మన శరీరంలోని వైరల్ లోడ్ గురించి చెబుతుంది. లోడ్ ఎక్కువుంటే సీటీ వ్యాల్యూ తక్కువగా ఉంటుంది. లోడ్ తక్కువగా ఉంటే సీటీ వ్యాల్యూ ఎక్కువగా ఉంటుంది. అయితే వైద్యులు సీటీ వ్యాల్యూను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించరని చెబుతున్నారు నిపుణులు. చికిత్సకు కావాల్సింది.. పాజిటివ్, నెగెటివ్ అంతే!
* సీటీ స్కాన్లో కొరాడ్స్లో గణాంకాలు: ఊపిరితిత్తుల్లో వచ్చిన ఇన్ఫెక్షన్కు స్కోరింగ్ ఇవ్వడం లాంటిది ఈ ‘కొరాడ్’. శ్వాసకోశాల్లో ఇన్ఫెక్షన్ మచ్చ (షేడ్) బట్టి అది కొవిడ్ కావచ్చా? కాదా? అనేది అంచనా వేసి చెబుతారు.
* సీటీ సివియారిటీ స్కోర్ ఇన్ సీటీ స్కాన్ (సీటీ ఎస్ఎస్): ఇది అన్నింటి కంటే ముఖ్యమైంది. ఇది వైరస్ తీవ్రతను సూచిస్తుంది. చికిత్స మొదలు పెట్టిన తర్వాత 5-7 రోజుల వరకూ తీవ్రత ఉంటుంది. చికిత్స అనంతరం కొంత పెరుగుతుంది. అది సీటీ స్కాన్లో కనిపిస్తుంది. అయితే సీటీ స్కాన్లో తగ్గే వరకూ ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు.
లక్షణాలు కనిపిస్తుంటే ఆలస్యం చేయొద్దు
-డాక్టర్ వి.జగదీశ్కుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్, ఏఐజీ
ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ వచ్చినా కొవిడ్ బారినపడిన వారి ఆరోగ్యం త్వరగా క్షీణిస్తోంది. ఎందుకంటే నెగెటివ్ అనే కారణంతో వారు చికిత్సలో జాప్యం చేస్తుంటారు. ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ వచ్చి, లక్షణాలు కనిపిస్తుంటే దాన్ని పూర్తి నెగెటివ్గా భావించకూడదు. వెంటనే వైద్యసేవలకు సంప్రదించాల్సిందే. అలాగే సీటీ స్కాన్ గణాంకాలపైనా అనవసర ఆందోళన అక్కర్లేదు. ఆర్టీ పీసీఆర్ పాజిటివ్ ఉంటే సీటీ స్కాన్తో పని లేదు.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం