సికింద్రాబాద్ క్లబ్ అగ్నికి ఆహుతి
హైదరాబాద్లోని ప్రముఖ వారసత్వ భవనం అగ్నికి ఆహుతైంది. దాదాపు ఒకటిన్నర శతాబ్దాల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ క్లబ్లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో ప్రధాన భవనం పూర్తిగా దగ్ధమైంది.
143 ఏళ్ల చారిత్రక భవనంలో మంటలు
షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణం
రూ.25 కోట్ల ఆస్తినష్టం
ఈనాడు డిజిటల్, హైదరాబాద్, న్యూస్టుడే, కంటోన్మెంట్: హైదరాబాద్లోని ప్రముఖ వారసత్వ భవనం అగ్నికి ఆహుతైంది. దాదాపు ఒకటిన్నర శతాబ్దాల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ క్లబ్లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో ప్రధాన భవనం పూర్తిగా దగ్ధమైంది. పురాతన, అరుదైన వస్తువులెన్నో అగ్నికీలల్లో బూడిదయ్యాయి. అందమైన నగిషీలతో ఆకట్టుకునే భవనం మాడిమసై.. చరిత్రలో ఓ పుటగా మిగిలిపోయింది. భవనంలో 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని పరికరాలు, ఫర్నిచర్ దగ్ధమైపోగా.. సుమారు రూ.25 కోట్ల నష్టం వాటిల్లిందని నిర్వాహకులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి భారీ వర్షం పడటంతో విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు వచ్చాయని, కొద్దిసేపటికే భవనం లోపలి నుంచి మంటలు వ్యాపించాయని సిబ్బంది తెలిపారు. క్లబ్ ముందు భాగం కలపతో చేసింది కావటంతో ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. ప్రమాద సమాచారం చేరవేతలో అరగంట జాప్యం కారణంగా భారీస్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
ఘనమైన చరిత్ర
దేశంలోనే అతి ప్రాచీనమైన క్లబ్బుల్లో ఒకటిగా సికింద్రాబాద్ క్లబ్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనిని 1878లో 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ క్లబ్కు వారసత్వ హోదా ఇచ్చింది. సికింద్రాబాద్ గ్యారిసన్ క్లబ్, సికింద్రాబాద్ జింఖానా క్లబ్, యునైటెడ్ క్లబ్ తదితర పేర్లతో పిలిచేవారు. 1947 వరకు బ్రిటిష్ అధికారులు, నవాబులు, ఉన్నతస్థాయిలో ఉన్నవారికే ఇందులో సభ్యత్వం ఉండేది. ఇప్పుడు ఆర్మీ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు, పోలీసు అధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలు సహా అన్ని రంగాలకు చెందినవారు శాశ్వత, క్రియాశీలక సభ్యులుగా ఉన్నారు. సభ్యత్వ రుసుం దాదాపు రూ.12 లక్షల వరకు ఉంటుంది. శాశ్వత సభ్యత్వం దక్కాలంటే కనీసం పదేళ్లు ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం 5,000 మందికిపైగా సభ్యత్వం ఉండగా 300 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఐదు నక్షత్రాల హోటల్లో ఉండే అత్యాధునిక వసతులన్నీ ఇందులో ఉంటాయి. దీనికి అనుబంధంగా సెయిలింగ్ ఉంది. లోపల ఒక పెట్రోల్ పంపు కూడా ఉంటుంది. దేశీయంగానే కాకుండా అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియాలో ఉన్న సుమారు వంద అగ్రశ్రేణి క్లబ్లతో దీనికి అనుబంధం ఉంది.
అగ్నిమాపక పరికరాలూ లేవు
ఈనాడు, హైదరాబాద్: సికింద్రాబాద్ క్లబ్లో అగ్నిప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్లబ్లో ఎలాంటి అగ్నిమాపక పరికరాలు లేనట్లు గుర్తించారు. అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) సైతం లేనట్లు వెల్లడైంది. ఎన్వోసీ తీసుకున్నామని, అగ్నిప్రమాదంలో అది దగ్ధమైందని నిర్వాహకులు అధికారులకు చెప్పినట్లు తెలిసింది. కానీ అగ్నిమాపక శాఖ అధికారులు తమ రికార్డుల్లో అలాంటి పత్రం గుర్తించలేకపోయారు. 15 మీటర్లకంటే ఎత్తు ఉన్న ప్రముఖ సంస్థలు, భారీ భవంతులకు సంబంధించి ఏటా ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరుగుతుంటుంది. క్లబ్ ఎత్తు 14 మీటర్లే ఉండటంతో ఆడిట్ జరగడం లేదు. నిబంధనల ప్రకారం 6 మీటర్ల ఎత్తు ఉన్నవాటికి.. ఎక్కువమంది జనం వచ్చిపోయే ఇలాంటి క్లబ్ అగ్నిమాపక అనుమతి తప్పనిసరి. అగ్నిమాపక సేవల శాఖ డీజీ సంజయ్కుమార్ జైన్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అగ్నిమాపక శాఖ బృందాలు ఆదివారం నిజాం క్లబ్, ఫిల్మ్నగర్ క్లబ్.. తదితర 11 ప్రముఖ క్లబ్లలో అగ్నిమాపక పరికరాల స్థితిగతులపై తనిఖీలు చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
ఓ ఎయిర్లైన్స్ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఆ సంస్థకు చెందిన విమానాలు వెళ్లిపోయాయి. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
మహోగ్ర‘మే’
రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం.. సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగింది. -
కొరత లేకుండా ఎరువుల సరఫరా
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా కొరత ఏర్పడకుండా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. -
పులికి దారి ఇచ్చి.. గిరిజనం ఊరు విడిచి
దశాబ్దాలుగా అడవితల్లితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని భారమైన హృదయాలతో బయటకు వచ్చారు ఆదివాసీలు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. -
ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానమైన స్కేల్ ఇవ్వాలి
విస్తృతమైన బాధ్యతలు, విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానంగా సవరించిన వేతన స్కేల్ అందజేయాలని తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ల సంఘం పీఆర్సీ కమిటీని కోరింది. -
ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలని వేతన సవరణ కమిటీని(పీఆర్సీ) తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోరింది. -
పర్యావరణహిత ప్రజారవాణా మేలు
కాలుష్య ఉద్గారాలు లేని ప్రజారవాణా పర్యావరణానికి మేలు కలిగిస్తుందని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు. జీరో ఎమిషన్ వెహికిల్ (జెడ్ఈవీ) పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆయన గురువారం హైదరాబాద్కు వచ్చారు. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. -
జూన్ 3 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. వచ్చే నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరుగుతాయి. -
భవన నిర్మాణ అనుమతుల వెనక ఆంతర్యం ఏమిటి?
రాష్ట్రంలో మూడున్నర నెలల తర్వాత భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటని భాజపా శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
కవిత బెయిల్పై తీర్పు 6కి వాయిదా
దిల్లీ మద్యం వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్పై గురువారం వెలువరించాల్సిన తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
తెలంగాణకు ఐదు టీఎంసీలు ఇవ్వండి
రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను తెలంగాణ కోరింది. -
ఉద్యోగులకు వేతనాలివ్వలేని స్థితిలో కృష్ణా బోర్డు
సరిపడా నిధులు లేక బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల కార్యదర్శికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తాజాగా లేఖ రాసింది. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
పిల్లలూ.. ఆకాశవాణిలో కథలు వింటారా?
అన్ని వర్గాలు, వయసుల వారిని అలరిస్తున్న ఆకాశవాణి ఈ వేసవిలో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇంట్లో రేడియో లేదు.. ఎలా వినాలన్న సందేహం అక్కర్లేదు. -
విధుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి
ఎన్నికల విధులు నిర్వహిస్త్తున్న అధికారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది క్షమార్హం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ స్పష్టం చేశారు. -
అడవుల్లోని ఖనిజ సంపదంతా దేశ ప్రజలదే
అటవీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులు దేశ ప్రజలకు చెందినవని.. వాటి పరిరక్షణకు హక్కుల కార్యకర్తలు పోరాడుతుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పేర్కొన్నారు. -
అమూల్యమైంది ఓటు.. మరచిపోతే చేటు
ఓటుహక్కు ప్రాధాన్యంపై వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కూలి కొమ్ము అబ్రహం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. -
పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్ అరణ్య’
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అస్సాంలోనూ మొదలైంది. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్ పాయెంగ్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘వృక్ష వేద్ అరణ్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
-
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
-
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
-
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
-
జగనాసురుడి రాజ్యం.. ఐసీయూలో ఆరోగ్యశ్రీ
-
వైకాపా సర్పంచి వాహనంలో ‘ఎన్నికల’ మద్యం పట్టివేత