మిగిలింది మూడు వేలే
ఎంసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యేసరికి సీఎస్ఈ, ఐటీ సంబంధిత 18 రకాల కోర్సుల్లో 94.40 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
‘కంప్యూటర్’ బ్రాంచీల్లో 94 శాతం సీట్ల భర్తీ
రెండో విడత కౌన్సెలింగ్ పూర్తి..
సెల్ఫ్ రిపోర్టింగ్కు రేపటి వరకు గడువు
ఆగస్టు 9 నుంచి 11 వరకు చివరి విడత కౌన్సెలింగ్
ఈనాడు, హైదరాబాద్: ఎంసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యేసరికి సీఎస్ఈ, ఐటీ సంబంధిత 18 రకాల కోర్సుల్లో 94.40 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కన్వీనర్ కోటా సీట్లు 56,059 ఉండగా.. అందులో 52,922 నిండాయి. 3,137 మాత్రమే మిగిలాయి. ఈ 18 కోర్సులకుగాను ఏడింటిలో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కాకపోతే వాటిలో సీట్ల సంఖ్య 325లోపు ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(సీఎస్ఈ)లో 23,513 సీట్లు అందుబాటులో ఉండగా.. 580 మాత్రమే మిగిలిపోయాయి. అత్యధికంగా సీఎస్ఈ(ఏఐ అండ్ ఎంఎల్)లో 1,064 సీట్లు భర్తీ కాలేదు. ఎంసెట్ ప్రవేశాల కమిటీ సోమవారం రెండో విడత కౌన్సెలింగ్ సీట్లను కేటాయించింది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ సంబంధిత ఎనిమిది కోర్సుల్లో 17,320 సీట్లకు గాను 13,515 భర్తీ అయ్యాయి. మెకానికల్ సంబంధిత 11 కోర్సుల్లో 8,125కు కేవలం 3,533 నిండాయి. ఇతర కోర్సులు 11 ఉండగా అందులో 1198కి 719 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తానికి 82,702 కన్వీనర్ సీట్లలో రెండో విడత సీట్ల కేటాయింపు నాటికి 70,689 మందికి సీట్లు భర్తీ కాగా.. 12,013 మిగిలిపోయాయి. మొత్తం సీట్లు పొందినవారిలో సీఎస్ఈ, ఐటీ సంబంధిత బ్రాంచీల వారే 74.86 శాతం మంది ఉండటం విశేషం. కొత్తగా సీట్లు పొందిన వారితోపాటు రెండో విడతలో మెరుగైన సీట్లు పొందినవారు సైతం ఆగస్టు 2వ తేదీలోపు ఫీజు చెల్లించి... ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. లేకుంటే సీట్లు కోల్పోతారు.
‘సిరిసిల్ల’ టెక్స్టైల్ ఇంజినీరింగ్లో ఒక్కరూ చేరలే!
జేఎన్టీయూ సిరిసిల్ల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ టెక్స్టైల్ ఇంజినీరింగ్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఆ కోర్సులో 60 సీట్లున్నాయి. ఎంసెట్ తొలి విడత కౌన్సెలింగ్లో ఒక్కరు మాత్రమే సీటు పొందగా.. రెండో విడతలో ఒక్కరూ చేరలేదు. అంటే తొలి విడతలో సీటు పొందిన విద్యార్థి కూడా మరో కోర్సులో చేరినట్లు స్పష్టమవుతోంది. అదే కళాశాలలో తొలి విడతలో మెకానికల్ ఇంజినీరింగ్లో 14 మంది సీట్లు పొందగా.. రెండో విడత నాటికి నలుగురే మిగిలారు. సివిల్లో 16 మంది సీట్లు పొందారు.
- జేఎన్టీయూ వనపర్తి కళాశాలలో మెకానికల్లో ముగ్గురు, సివిల్లో ఆరుగురు సీట్లు పొందారు.
- కొత్తగూడెం ఇంజినీరింగ్ కళాశాలలోని మైనింగ్ ఇంజినీరింగ్ (సెల్ఫ్ ఫైనాన్స్) కోర్సులో నలుగురు సీట్లు పొందారు. ఈఈఈ బ్రాంచీలో ఒక్క విద్యార్థి, ఈసీఈలో 8 మంది మాత్రమే సీట్లు పొందారు.
- ఓయూ టెక్నాలజీ కళాశాలలోని టెక్స్టైల్ టెక్నాలజీ (సెల్ఫ్ ఫైనాన్స్)లో ఆరుగురు మాత్రమే సీట్లు సాధించారు.
కొత్తగా 7,417 మందికి సీట్లు
మొదటి విడతలో సీట్లు పొందినవారితో కలిపి రెండో విడతకు మొత్తం 53,764 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. కొత్తగా 7,417 మంది సీట్లు పొందారు.
- తొలి విడతలో సీట్లు పొందిన 25,148 మంది.. అదే కళాశాలలో మరో బ్రాంచీకి లేదా మరో కళాశాలలోకి మారారు.
- ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో కేవలం 21 సీట్లు ఉండగా.. వాటిలో ఒక్కరూ చేరలేదు.
- వెబ్ ఆప్షన్లు ఇచ్చిన 4,701 మందికి సీట్లు దక్కలేదు. తమ ర్యాంకుకు అనుగుణంగా తగినన్ని ఆప్షన్లు ఇవ్వకపోవడమే అందుకు కారణం.
- ఈడబ్ల్యూఎస్ కోటా కింద అదనంగా 5,610 మంది సీట్లు పొందారు.
- నాలుగు వర్సిటీలు, 28 ప్రైవేట్ కళాశాలల్లో అన్ని సీట్లు నిండాయి.
- చివరి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 9 నుంచి 11వ తేదీ వరకు జరుగుతుంది. ఆ తర్వాత మాత్రమే సీట్లు పొందినవారు స్వయంగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి. ధ్రువపత్రాల్లో ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్(టీసీ) మాత్రమే కళాశాలలో ఒరిజినల్ అప్పగించాలి. మిగిలినవన్నీ జిరాక్స్ కాపీలు ఇవ్వాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
ఊబకాయులకు, జంక్ ఫుడ్ ప్రియులకు మూత్రపిండాల వ్యాధి రావడమే కాదు.. మూత్రపిండాలు పూర్తిగా పాడయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని బయోకెమిస్ట్రీ విభాగం సహ ఆచార్యులు పసుపులేటి అనిల్కుమార్, జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ భానుప్రకాశ్రెడ్డిల పరిశోధనలో వెల్లడైంది. -
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
సంతానలేమికి కోడలే కారణమని నిందించే అత్తలు.. ఇప్పటికైనా అలా అనడం మానేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే లోపం మీ అబ్బాయిలోనూ ఉండొచ్చు.. అందుకు మీరు కూడా ఒక కారణం కావొచ్చని సీసీఎంబీ పరిశోధకులు పేర్కొంటున్నారు. -
రూ.30 వేలు ఇస్తేనే మృతదేహం అప్పగిస్తాం!
అతిసారంతో మరణించిన బాలుడి మృతదేహాన్ని అప్పగించేందుకు ప్రైవేటు ఆసుపత్రి అదనంగా రూ.30 వేలు డిమాండ్ చేసింది. -
హడలెత్తించిన హఠాత్తు వాన
అకాల వర్షాలు మరోసారి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా విరుచుకుపడిన వాన రైతులు, సామాన్యులను ఆగం చేసింది. -
భూముల ధరలు సవరించాలి
హైదరాబాద్ సహా రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం పెరగలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
రూ.35 వేల కోట్ల సేకరణ ఎలా?
రాష్ట్రంలో రైతుల రుణమాఫీకి నిధుల సేకరణకు ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తోంది. రుణమాఫీకి రూ.33 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్ల వరకు అవసరమని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలిసింది. -
వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యం
వైద్యవిద్యలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడంతో పాటు ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలకు వైద్యసేవలు చేరువగా తీసుకురావడమే తమ లక్ష్యమని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ఛైర్మన్ డాక్టర్ బి.ఎన్.గంగాధర్ తెలిపారు. -
జడ్జి పోస్టుల్లో కనిపించని సమాంతర రిజర్వేషన్లు
తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీసులో జిల్లా జడ్జి (ఎంట్రీలెవల్) పోస్టుల్లో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. -
విద్యుత్ సరఫరాపై అసత్య ప్రచారం తగదు
రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తూ విద్యుత్ అధికారులు, సిబ్బందిని మానసిక క్షోభకు గురిచేస్తోందని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
రూ.10 కోట్లు సమకూరినా.. దక్కని చిన్నారి ప్రాణం
ప్రాణాంతక వ్యాధి బారిన పడిన ఆ చిన్నారి చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.10 కోట్లు సమకూరినా.. చివరికి ప్రాణాలు దక్కించుకోలేకపోయిన హృదయ విదారక సంఘటన ఇది. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
జీవన్రెడ్డి మాల్ని స్వాధీనం చేసుకున్న ఆర్టీసీ అధికారులు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నిర్మించిన జీవన్రెడ్డి మాల్ను గురువారం ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
ఎస్పీలు సరే.. కిందిస్థాయి అధికారులపై చర్యలేవీ?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పెద్ద ఎత్తున జరిగిన హింసకాండ, విధ్వంసానికి బాధ్యులుగా తేలుస్తూ ఎన్నికల సంఘం.. ఇద్దరు ఎస్పీలను సస్పెన్షన్, ఒక కలెక్టర్, ఒక ఎస్పీని బదిలీ చేసింది. -
నాసిరకం విత్తనాలతో జాగ్రత్త!
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు మళ్లీ నాసిరకం విత్తనాల బెడద మొదలైంది. తక్కువ ధర, అధిక దిగుబడి, త్వరగా పంట చేతికొస్తుందని నమ్మిస్తూ రైతులను మోసగించి పలువురు వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. -
నల్లమల అడవికి ఎకో టూరిజం దెబ్బ!
అది నల్లమల కొండల్లోని దట్టమైన అడవి. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాలు సంచరించే ప్రాంతం. వాటికి ఎంతో సురక్షితమైన ప్రాంతమది. -
పంటల బీమాపై పకడ్బందీ కార్యాచరణ
వచ్చే వానాకాలం నుంచి అమలయ్యే పంటల బీమా పథకానికి పకడ్బందీ కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. -
ఈసీ అనుమతితో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు
కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో రాష్ట్రంలో వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని, బదిలీ అయిన వారిని రిలీవ్ చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి నేతలకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారు. -
విద్యుత్తు ఒప్పందాలపై ఫిర్యాదు చేయండి
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కోసం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ బహిరంగ ప్రకటన జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!