ఆర్టీసీ ఉద్యోగుల వయోపరిమితి 61 !
ఆర్టీసీ ఉద్యోగుల వయో పరిమితి 61 సంవత్సరాలకు పెరిగే అవకాశం ఉంది. సంస్థలో ప్రస్తుతం రిటైర్మెంట్ వయసు 60గా ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం బిల్లును శాసనసభ, మండలి ఆమోదించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వంలో విలీనంతో పెరిగే అవకాశం
వచ్చే నెలలో ప్రత్యేక శాఖ ఏర్పాటు..
కమిషనర్ నియామకం
ఈనాడు, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల వయో పరిమితి 61 సంవత్సరాలకు పెరిగే అవకాశం ఉంది. సంస్థలో ప్రస్తుతం రిటైర్మెంట్ వయసు 60గా ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం బిల్లును శాసనసభ, మండలి ఆమోదించిన విషయం తెలిసిందే. గవర్నర్ ఆమోదంతో చట్టరూపం దాల్చనుంది.
అనంతరం వారంతా ప్రభుత్వ ఉద్యోగులవుతారు. ఈక్రమంలో వారి పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెరగనుంది. దీంతో సంస్థకు ఆర్థికంగా కొంత ప్రయోజనం కలగనుంది. రిటైర్ అయ్యే ఉద్యోగులకు చేయాల్సిన చెల్లింపులకు సంబంధించి మరో ఏడాది సమయం వెసులుబాటు లభిస్తుంది. ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారనుండగా, కార్పొరేషన్ యథాతథంగా కొనసాగుతుంది.
వీసీ సజ్జనార్కే కమిషనర్ పదవి?
ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనంతో ఏర్పాటుచేసే శాఖకు ప్రజారవాణా లేదా మరో పేరు పెట్టనున్నారు. సెప్టెంబరులో కొత్త శాఖను ఏర్పాటుచేసి, కమిషనర్ను నియమించనుంది. సంస్థకు ప్రస్తుతం వైస్ ఛైర్మన్, ఎండీగా వీసీ సజ్జనార్ ఉన్నారు. అటు కొత్త శాఖకు, ఇటు కార్పొరేషన్కు మధ్య సమన్వయం కోసం రెండు బాధ్యతలనూ ఒకరికే అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ప్రస్తుత వైస్ ఛైర్మన్, ఎండీ సజ్జనార్కే కమిషనర్ బాధ్యతలూ ఇచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీలో మొత్తం 43,055 మంది ఉద్యోగులు ఉన్నారు.
వేతనాలపై ఆర్టీసీలో చర్చ
ప్రభుత్వంలో విలీనంతో వేతనాలపై ఆర్టీసీ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. డ్రైవర్లు, కండక్టర్లు వంటి ఉద్యోగులకు వేతనాలు పెరుగుతాయని, అధికారులు, ఉన్నతాధికారులకు పెరగవని చెబుతున్నారు. ఆర్టీసీలో ప్రస్తుతం అధికారులు, ఉన్నతాధికారుల వేతనాలు భారీగా ఉండటమే ఇందుకు కారణం. కార్మికులు సమ్మెలు చేసిన సందర్భాల్లో అలవెన్సులు, ఇతరత్రా రూపంలో అధికారులకు భారీగా వేతనాలు పెరిగాయి. ‘ప్రభుత్వంలో విలీనం తర్వాత సాంకేతికంగా మా వేతనాలు తగ్గుతాయి. జీతాలు తగ్గించకుండా.. ప్రస్తుతం వస్తున్న దానిని కొనసాగించి భవిష్యత్తులో పెరిగే మొత్తాన్ని సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి. తద్వారా కొన్నేళ్లవరకు ప్రస్తుత వేతనమే ఉంటుందని భావిస్తున్నాం’ అని ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) తెలిపారు. అదనపు పని గంటలతో ఒత్తిడి, వయసు కారణాలతో కొందరు డ్రైవర్లు పదవీ విరమణ తీసుకుంటున్నారు. ప్రభుత్వంలో విలీనం తర్వాత 61 ఏళ్ల వరకు పనిచేయడం డ్రైవర్లు, మెకానిక్లకు ఇబ్బందేనని ఆ అధికారి పేర్కొన్నారు.
చెల్లింపు బాధ్యత కార్పొరేషన్దే
ఆర్టీసీకి ఏటా రూ.1,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయిస్తోంది. మరో రూ,1,500 కోట్లు కలిపి ఏటా రూ.3,000 కోట్లు ఇస్తే సంస్థ నిలబడుతుందన్న ప్రతిపాదనకు సీఎం అంగీకరించారు. ఉద్యోగులకు వేతనాల రూపంలో ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది. మరోవైపు బ్యాంకులకు రూ.2,446 కోట్లు, ఉద్యోగులకు రూ.3,620 కోట్ల బకాయిలు ఆర్టీసీ తీర్చాల్సి ఉంది. ఆర్టీసీ తనకు వచ్చే ఆదాయాన్ని ఖర్చులు పోను.. బ్యాంకు రుణాలు, ఉద్యోగులకు సీసీఎస్, పీఎఫ్ వంటి బకాయిలు తీర్చుకోవడానికి ఉపయోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండేళ్ల వరకూ పూర్తి ఆదాయాన్ని సంస్థ వాడుకునే వెసులుబాటును కల్పించింది.
ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో భేటీ
ఈనాడు, అమరావతి: టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై అధ్యయనం చేసేందుకు సంస్థ అధికారులు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులతో మంగళవారం విజయవాడలో భేటీ అయ్యారు. 2020 జనవరి 1నే ఏపీఎస్ఆర్టీసీ విలీనం జరిగింది. ఆ ప్రక్రియ ఎలా చేపట్టారనేది తెలుసుకునేందుకు అధికారుల బృందం వచ్చింది. ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు వారికి వివరించారు. ఇందులో టీఎస్ ఆర్టీసీ ఈడీలు కృష్ణకాంత్ (పరిపాలన), మునిశేఖర్ (ఆపరేషన్స్), చీఫ్ ఫైనాన్షియల్ మేనేజర్ విజయ పుష్పకుమారి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
ఊబకాయులకు, జంక్ ఫుడ్ ప్రియులకు మూత్రపిండాల వ్యాధి రావడమే కాదు.. మూత్రపిండాలు పూర్తిగా పాడయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని బయోకెమిస్ట్రీ విభాగం సహ ఆచార్యులు పసుపులేటి అనిల్కుమార్, జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ భానుప్రకాశ్రెడ్డిల పరిశోధనలో వెల్లడైంది. -
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
సంతానలేమికి కోడలే కారణమని నిందించే అత్తలు.. ఇప్పటికైనా అలా అనడం మానేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే లోపం మీ అబ్బాయిలోనూ ఉండొచ్చు.. అందుకు మీరు కూడా ఒక కారణం కావొచ్చని సీసీఎంబీ పరిశోధకులు పేర్కొంటున్నారు. -
రూ.30 వేలు ఇస్తేనే మృతదేహం అప్పగిస్తాం!
అతిసారంతో మరణించిన బాలుడి మృతదేహాన్ని అప్పగించేందుకు ప్రైవేటు ఆసుపత్రి అదనంగా రూ.30 వేలు డిమాండ్ చేసింది. -
హడలెత్తించిన హఠాత్తు వాన
అకాల వర్షాలు మరోసారి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా విరుచుకుపడిన వాన రైతులు, సామాన్యులను ఆగం చేసింది. -
భూముల ధరలు సవరించాలి
హైదరాబాద్ సహా రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం పెరగలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
రూ.35 వేల కోట్ల సేకరణ ఎలా?
రాష్ట్రంలో రైతుల రుణమాఫీకి నిధుల సేకరణకు ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తోంది. రుణమాఫీకి రూ.33 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్ల వరకు అవసరమని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలిసింది. -
వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యం
వైద్యవిద్యలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడంతో పాటు ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలకు వైద్యసేవలు చేరువగా తీసుకురావడమే తమ లక్ష్యమని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ఛైర్మన్ డాక్టర్ బి.ఎన్.గంగాధర్ తెలిపారు. -
జడ్జి పోస్టుల్లో కనిపించని సమాంతర రిజర్వేషన్లు
తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీసులో జిల్లా జడ్జి (ఎంట్రీలెవల్) పోస్టుల్లో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. -
విద్యుత్ సరఫరాపై అసత్య ప్రచారం తగదు
రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తూ విద్యుత్ అధికారులు, సిబ్బందిని మానసిక క్షోభకు గురిచేస్తోందని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
రూ.10 కోట్లు సమకూరినా.. దక్కని చిన్నారి ప్రాణం
ప్రాణాంతక వ్యాధి బారిన పడిన ఆ చిన్నారి చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.10 కోట్లు సమకూరినా.. చివరికి ప్రాణాలు దక్కించుకోలేకపోయిన హృదయ విదారక సంఘటన ఇది. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
జీవన్రెడ్డి మాల్ని స్వాధీనం చేసుకున్న ఆర్టీసీ అధికారులు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నిర్మించిన జీవన్రెడ్డి మాల్ను గురువారం ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
ఎస్పీలు సరే.. కిందిస్థాయి అధికారులపై చర్యలేవీ?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పెద్ద ఎత్తున జరిగిన హింసకాండ, విధ్వంసానికి బాధ్యులుగా తేలుస్తూ ఎన్నికల సంఘం.. ఇద్దరు ఎస్పీలను సస్పెన్షన్, ఒక కలెక్టర్, ఒక ఎస్పీని బదిలీ చేసింది. -
నాసిరకం విత్తనాలతో జాగ్రత్త!
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు మళ్లీ నాసిరకం విత్తనాల బెడద మొదలైంది. తక్కువ ధర, అధిక దిగుబడి, త్వరగా పంట చేతికొస్తుందని నమ్మిస్తూ రైతులను మోసగించి పలువురు వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. -
నల్లమల అడవికి ఎకో టూరిజం దెబ్బ!
అది నల్లమల కొండల్లోని దట్టమైన అడవి. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాలు సంచరించే ప్రాంతం. వాటికి ఎంతో సురక్షితమైన ప్రాంతమది. -
పంటల బీమాపై పకడ్బందీ కార్యాచరణ
వచ్చే వానాకాలం నుంచి అమలయ్యే పంటల బీమా పథకానికి పకడ్బందీ కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. -
ఈసీ అనుమతితో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు
కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో రాష్ట్రంలో వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని, బదిలీ అయిన వారిని రిలీవ్ చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి నేతలకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారు. -
విద్యుత్తు ఒప్పందాలపై ఫిర్యాదు చేయండి
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కోసం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ బహిరంగ ప్రకటన జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365