France: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వేళ.. ఫ్రాన్స్ స్కూల్లో ‘ఉగ్ర’ దాడి..?
ఫ్రాన్స్ (France)లో పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు జరుగుతున్న వేళ.. అక్కడి ఓ స్కూల్లో దాడి జరిగింది. దీన్ని ఉగ్ర ఘటనగా పోలీసులు అనుమానిస్తున్నారు.
పారిస్: హమాస్ (Hamas) ఉగ్ర సంస్థను లక్ష్యంగా చేసుకుని గాజాలో ఇజ్రాయెల్ (Israel) బాంబులతో విరుచుకుపడుతోంది. అయితే ఈ దాడులను వ్యతిరేకిస్తూ పాలస్తీనాకు మద్దతుగా పలు దేశాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో ఇతర దేశాల్లో యూదులపై దాడులు జరగొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ (France)లోని ఓ స్కూల్లో దుండగుడు కత్తితో దాడి (Knife Attack) చేయడం కలకలం రేపింది. ఉగ్ర ఘటన అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఉత్తర ఫ్రాన్స్లోని ఆరాస్ నగరంలోని ఓ స్కూల్లో శుక్రవారం ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. పాఠశాలలోకి చొరబడి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ఓ టీచర్ ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దుండగుడిని అరెస్టు చేశారు.
హమాస్కు ‘ఆపరేషన్ థండర్బోల్ట్’ భయం..!
నిందితుడు ఆ స్కూల్లో చదివిన పాత విద్యార్థి అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి దాడిలో ఫ్రెంచ్ లాంగ్వేజ్ బోధించే టీచర్ మృతిచెందగా.. మరో ఇద్దరు ఉపాధ్యాయులు గాయపడ్డారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడి సోదరుడిని కూడా అరెస్టు చేశారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఉగ్ర కుట్రలో భాగంగానే దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగానే ఈ దాడి జరిగిందా? అనేదానిపై స్పష్టత లేదు.
ఇటీవల పాలస్తీనాకు మద్దతుగా ఫ్రాన్స్లో ఆందోళనలు జరిగాయి. దీంతో అప్రమత్తమైన మేక్రాన్ సర్కారు.. ఈ ర్యాలీలపై నిషేధం విధించింది. అయినప్పటికీ కొందరు నిరసనకారులు గురువారం ఆందోళనలు చేపట్టడంతో పోలీసులు వారిపై బాష్పవాయువు ప్రయోగించి చెదరగొట్టారు. కాగా.. గతవారం ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన మారణహోమంలో 13 మంది ఫ్రెంచ్ దేశస్థులు ప్రాణాలు కోల్పోయారు. దాడి జరిగిన నాటి నుంచి మరో 17 మంది ఫ్రాన్స్ పౌరుల ఆచూకీ గల్లంతైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట