నలుగురు కన్నబిడ్డల మృతి కేసు.. 20 ఏళ్ల తర్వాత నిర్దోషిగా తేలిన తల్లి
Australia: కన్నబిడ్డలు మృతి చెందిన కేసులో దోషిగా తేలి, 20 ఏళ్లు శిక్ష అనుభవించిన ఓ తల్లి.. తాజాగా నిర్దోషిగా బయటపడింది.
ఇంటర్నెట్డెస్క్: నలుగురు కన్నబిడ్డలు మృతిచెందిన కేసులో ఓ తల్లి 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించింది. వారిని ఆమే చంపేసిందంటూ వచ్చిన ఆరోపణలను భరించింది. వరస్ట్ సీరియల్ కిల్లర్ అనే నిందను మోసింది. ఇన్నేళ్ల అవమానాల తర్వాత గురువారం ఆమెపై మోపిన అభియోగాలను కొట్టివేశారు.
కాథ్లీన్ ఫాల్బిగ్.. నలుగురు పిల్లలు 1989 నుంచి 1999 మధ్య కాలంలో అనూహ్యంగా మృతి చెందారు. మొదటి ముగ్గురు పిల్లలు ఏడాదిలోపు చనిపోవడంతో.. సడెన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్(SIDS)అని భావించారు. ఎలాంటి ప్రత్యేక కారణం లేకుండా ఏడాదిలోపు చిన్నారులు మరణిస్తే ఈ పదాన్ని వాడతారు. అయితే ఆమె నాలుగో చిన్నారి పుట్టిన 18 నెలల తర్వాత మరణించింది. నాలుగో బిడ్డ మరణానికి ఎలాంటి కారణం లేదని అప్పుడు వైద్యులు చెప్పడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఫోరెన్సిక్ ఆధారాలు స్పష్టంగా లేనప్పటికీ.. ఆ పసిబిడ్డలకు శ్వాస ఆడకుండా చేసి చంపేసిందని ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. వార్తా పత్రికలు ఆమెను ఆస్ట్రేలియాలో వరస్ట్ ఫిమేల్ సీరియల్ కిల్లర్(Australia's worst female serial killer) అని అభివర్ణించాయి. తన పిల్లలది సహజ మరణమని ఆమె మొత్తుకున్నా ఎవరూ వినలేదు. ఆ తర్వాత 2003లో కోర్టు కాథ్లీన్ను దోషిగా తేల్చడంతో 20 ఏళ్లు జైలు గోడలే ఆమె జీవితమయ్యాయి.
అంతటితో ఆమె ఆగలేదు. తాను ఏ తప్పూ చేయలేదని నిరూపించుకునేందుకు పోరాటం సాగించింది. ఆ పిల్లలంతా సహజ కారణాలతో మృతి చెందారని తేలడంతో ఈ జూన్ నెలలో క్షమాభిక్ష పొందారు. శాస్త్రీయంగా సాధించిన పురోగతి ఆమె నిర్దోషిగా తేలడానికి ఉపకరించింది. ఆధునిక సాంకేతికత.. అరుదైన జన్యు పరివర్తనలు, పుట్టుకతో వచ్చే లోపాల వల్ల కలిగే ఆకస్మిక మరణాలను గురించి అర్థం చేసుకునేందుకు దోహదం చేసింది. ‘నా పిల్లల మృతికి గల ప్రశ్నలపై నాకు సమాధానాలు ఇచ్చిన సరికొత్త సాంకేతికతకు నేను రుణపడి ఉంటాను’ అని ఆమె ఉద్వేగభరితురాలయ్యారు. ‘1999లో కూడా నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఉన్నా.. వాటిని ఎవరూ పట్టించుకోలేదు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తాను ఇంతకాలం అక్రమంగా జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చినందుకు పరిహారం కోసం కోర్టులను ఆశ్రయిస్తానని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కత్తితో విచక్షణారహిత దాడి..ఉలిక్కిపడిన లండన్
కత్తితో దూసుకొచ్చిన ఓ దుండగుడు ప్రజలపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. లండన్ (London)లో ఈ ఘటన జరిగింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
కరోనా వైరస్ (సార్స్కోవ్-2) జన్యు సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన వైరాలజిస్ట్కు చైనా అధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. -
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.