Air India: ఎయిరిండియా అధికారిపై ప్రయాణికుడి దాడి..!
ఇటీవల కాలంలో కొంతమంది ప్రయాణికుల ప్రవర్తన విమాన సిబ్బందికి తోటి ప్రయాణికులకు తలనొప్పిగా మారింది. తాజాగా ఓ ప్రయాణికుడు మాత్రం ఏకంగా ఎయిర్ఇండియా అధికారి చెంపను పగలగొట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: విమానాల్లో పలువురి ప్రయాణికుల (passenger) విపరీత చేష్టలు ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. తాజాగా ఓ ప్రయాణికుడు ఏకంగా ఎయిర్ఇండియా అధికారి చెంపను పగలగొట్టాడు. ఈ ఘటన సిడ్నీ (Sydney) నుంచి దిల్లీ ( Delhi) వెళ్లుతున్న ఎయిరిండియా (Air India) AI301 విమానంలో చోటు చేసుకుంది. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..
బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్న ఎయిరిండియా సీనియర్ అధికారి సీటు సరిగా లేకపోవడంతో తన సీటును ఎకానమీలోకి మార్చుకున్నారు. అతడి పక్కనున్న మరో ప్రయాణికుడు బిగ్గరగా మాట్లాడుతూ (loud voice) తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించాడు. దీంతో అధికారి అతడిని మెల్లగా మాట్లాడాలని సూచించారు. అది నచ్చని ప్రయాణికుడు ఆగ్రహానికి గురై అధికారి చెంపను పగలగొట్టాడు. అంతేకాకుండా ఆయన తలను వెనక్కి తిప్పే ప్రయత్నం చేశాడు. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడాడు.
దీంతో ఐదుగురు సిబ్బంది ఆ ప్రయాణికుడి వద్దకు వచ్చి.. అలా చేయొద్దని హెచ్చరించారు. అయినప్పటికీ.. అతడు వినిపించుకోలేదు. విమానం దిల్లీ చేరుకున్న అనంతరం ప్రయాణికుడిని భద్రతా ఏజెన్సీకి అప్పగించినట్లు ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు. ‘‘విమానంలో ప్రయాణికులు ఎలా ఉండాలో సూచించినప్పటికీ అతడు అనుచితంగా ప్రవర్తించి సిబ్బందిలో ఒకరిని గాయపరిచాడు. తోటి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగించాడు. అతడ్ని భద్రతా ఏజెన్సీకి అప్పగించిన తరువాత లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాడు. ఇకపై ఇలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’’ అని ఎయిర్ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు సమాచారం అందించారు.
ఇటీవల కాలంలో కొంతమంది ప్రయాణికుల ప్రవర్తన విమాన సిబ్బందికి, తోటి ప్రయాణికులకు తలనొప్పిగా మారింది. ఒక ప్రయాణికుడు విమానంలో బాంబు ఉందంటూ అందర్నీ బెదిరించిన ఘటన చూశాం. ఓ విమానంలో ప్రయాణికులు ఘర్షణకు పాల్పడి కిటికీ అద్దలు పగలగొట్టే ప్రయత్నం చేశారు. మరో ప్రయాణికుడు విమానం ఎగిరే సమయానికి తలుపు తెరిచే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట