Akshata Murty: రిషి సునాక్ భార్య అక్షతామూర్తికి అరుదైన గుర్తింపు
బ్రిటన్లో అత్యుత్తమ దుస్తులు ధరించిన వ్యక్తుల జాబితాలో అక్షతామూర్తి ప్రథమ స్థానం సాధించారు. ఈ మేరకు టాట్లర్ మేగజైన్ వెల్లడించింది.
లండన్: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతామూర్తికి అరుదైన గుర్తింపు దక్కింది. 2023 సంవత్సరానికిగానూ బ్రిటన్లో అత్యుత్తమ దుస్తులు ధరించిన వ్యక్తుల జాబితాలో ఆమె ప్రథమ స్థానం సాధించారు. ఈ మేరకు టాట్లర్ మేగజైన్ వెల్లడించింది. వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన అక్షతామూర్తి.. ఫ్యాషన్ డిజైనర్ కూడా. అందుకే ఆమె సరికొత్తగా, హుందాతనంతో కూడిన దుస్తులు ఎంపిక చేసుకుంటారు. తాజాగా టాట్లర్ మేగజైన్ విడుదల చేసిన జాబితాలో ‘లవ్ యాక్చువల్లీ’ స్టార్ బిల్ నై, ప్రిన్సెస్ బీట్రైస్ భర్త ఎడ్వర్డ్ మపెల్లి మోజీ తదితర మోడల్స్ని వెనక్కినెట్టి అక్షతామూర్తి ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు.
‘‘బ్రిటన్లో అత్యుత్తమ దుస్తులు ధరించిన వారి జాబితాలో అక్షతామూర్తి తొలిస్థానంలో నిలిచారు. చాలా మంది మోడల్స్ని, ప్రముఖులను వెనక్కి నెట్టి ఆమె ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు’’ అని టాట్లర్ మ్యాగజైన్ వెల్లడించింది. పాతకాలం నాటి పిల్బాక్స్ టోపీలు, వివిధ వరుసల్లో ముత్యాలు లేనప్పటికీ.. అక్షతామూర్తి వస్త్రధారణ ఆధునిక సమాజానికి ఓ ఉదాహరణ అని టాట్లర్ మేగజైన్ సంపాదకుడు క్యాండ్లర్ తెలిపారు. ఈ జాబితాలో కెనడాకి చెందిన యనాపీల్, డొమినిక్ సెబేగ్ మాంటేఫియోర్, ఒపేరా గాయని డేనియల్లా డి నీసే తదితరులు కూడా ఉన్నారు.
ఉత్తర కొరియా రాకెట్లతో రష్యాపై ఎదురుదాడులు..!
అక్షతామూర్తి అప్పుడప్పుడూ విలాసవంతమైన దుస్తుల్లోనూ కనిపిస్తుంటారు. పాఠశాలలో నిర్వహించే ఓ రన్ కోసం దాదాపు రూ.60,218 (570 పౌండ్లు) విలువైన చెప్పుల్ని వేసుకోవడంతో ఇటీవల ఆమె వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.47,012 విలువ చేసే బూట్లు, రూ.1,05,670 విలువ చేసే స్కర్ట్తో దిగిన ఫొటోలు కొన్నాళ్ల క్రితం వైరల్ అయ్యాయి. మరోవైపు గతేడాది జులైలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రుషి సునాక్ 3,500 పౌండ్లు (దాదాపు రూ.3,69,848) విలువైన సూట్, 490 పౌండ్లు (దాదాపు రూ.51,778) విలువైన పాడ్రాలు ధరించడంపై అప్పట్లో విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భార్యభర్తలు ఇద్దరూ వస్త్రధారణ విషయంలో విమర్శలు ఎదురుకాకుండా జాగ్రత్తపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు
భారత్కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో లండన్ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. -
కత్తితో విచక్షణారహిత దాడి..ఉలిక్కిపడిన లండన్
కత్తితో దూసుకొచ్చిన ఓ దుండగుడు ప్రజలపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. లండన్ (London)లో ఈ ఘటన జరిగింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
కరోనా వైరస్ (సార్స్కోవ్-2) జన్యు సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన వైరాలజిస్ట్కు చైనా అధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. -
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.