Trump vs Vivek: అవినీతిపరుడు, ఆర్థిక నేరగాడు.. వివేక్‌పై ట్రంప్‌ విమర్శలు

భారతీయ అమెరికన్‌ వివేక్‌ రామస్వామి.. అవినీతి పరుడు, ఆర్థిక నేరగాడని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు.

Published : 14 Jan 2024 15:38 IST

వాషింగ్టన్‌: అమెరికా (USA) అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్‌ పార్టీ తరపున పోటీపడుతున్న భారతీయ అమెరికన్‌ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy)పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. తన మద్దతుదారులు ఆయనకు ఓటు వేయొద్దని కోరారు. వివేక్‌ అవినీతి పరుడని, ఆర్థిక నేరగాడని ఆరోపించారు. మోసపూరిత ప్రచారాలతో తన అనుచరుల మద్దతు కూడగట్టేందుకు ప్రయ్నతిస్తున్నాడని విమర్శించారు. 

‘‘మీరు అయోవాలో రిపబ్లికన్‌ పార్టీ అనుచరులైతే.. డొనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు తెలుపండి. వివేక్‌కు దూరంగా ఉండండి. ఆయనో మోసగాడు’’ అని ట్రంప్‌ ప్రచార సలహాదారుడు క్రిస్‌ లాసివిటా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ఉన్న వివేక్‌.. మొదటి నుంచి ట్రంప్‌కు మద్దతు తెలుపుతున్నారు. కొలరాడో కోర్టు తీర్పు తర్వాత ట్రంప్‌ పోటీచేయకుంటే.. తాను ఎన్నికల బరి నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. మిగిలిన రిపబ్లికన్ అభ్యర్థులు సైతం పోటీకి దూరంగా ఉండాలని సూచించారు. ఆ సమయంలో వివేక్‌ నిర్ణయాన్ని ట్రంప్‌ మెచ్చుకున్నారు. 

కాక్‌పిట్ అద్దంలో పగుళ్లు.. మరో బోయింగ్‌ విమానం అత్యవసర ల్యాండింగ్‌

డొనాల్డ్ ట్రంప్‌ విమర్శలపై వివేక్‌ స్పందించారు. ‘‘నన్ను విమర్శిస్తూ ట్రంప్‌ చేసిన పోస్టు చూశాను. ఆయన ప్రచార సలహాదారుల సూచనతో ఇలాంటి పరిస్థితి తలెత్తడం దురదృష్టకరం. ఇకపై స్నేహపూర్వకమైన ఆరోపణలు ఏ మాత్రం పనిచేయవని భావిస్తున్నా. ట్రంప్‌పై ప్రతివిమర్శలు చేయాలనుకోవడంలేదు. ఆయన 21వ శతాబ్దపు గొప్ప అధ్యక్షుడు. అయోవా ప్రచారంలో ట్రంప్‌ మద్దతుదారులను కలిశాను. వారంతా ఆయన అభ్యర్థిత్వంపై ఆందోళనగా ఉన్నారు’’అని వివేక్‌ ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ ప్రచారంలో అయోవాలో ట్రంప్‌ ముందంజలో ఉన్నారు. ఆయనకు 53.6 శాతం మంది మద్దతు తెలుపగా, వివేక్‌కు 7.6 శాతం మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారు. సోమవారం పలు మీడియా సంస్థలు అయోవా పోల్‌ సర్వేలను వెల్లడించనున్న నేపథ్యంలో ట్రంప్‌ విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని