Trump vs Vivek: అవినీతిపరుడు, ఆర్థిక నేరగాడు.. వివేక్పై ట్రంప్ విమర్శలు
భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి.. అవినీతి పరుడు, ఆర్థిక నేరగాడని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.
వాషింగ్టన్: అమెరికా (USA) అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరపున పోటీపడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy)పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. తన మద్దతుదారులు ఆయనకు ఓటు వేయొద్దని కోరారు. వివేక్ అవినీతి పరుడని, ఆర్థిక నేరగాడని ఆరోపించారు. మోసపూరిత ప్రచారాలతో తన అనుచరుల మద్దతు కూడగట్టేందుకు ప్రయ్నతిస్తున్నాడని విమర్శించారు.
‘‘మీరు అయోవాలో రిపబ్లికన్ పార్టీ అనుచరులైతే.. డొనాల్డ్ ట్రంప్కు మద్దతు తెలుపండి. వివేక్కు దూరంగా ఉండండి. ఆయనో మోసగాడు’’ అని ట్రంప్ ప్రచార సలహాదారుడు క్రిస్ లాసివిటా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ఉన్న వివేక్.. మొదటి నుంచి ట్రంప్కు మద్దతు తెలుపుతున్నారు. కొలరాడో కోర్టు తీర్పు తర్వాత ట్రంప్ పోటీచేయకుంటే.. తాను ఎన్నికల బరి నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. మిగిలిన రిపబ్లికన్ అభ్యర్థులు సైతం పోటీకి దూరంగా ఉండాలని సూచించారు. ఆ సమయంలో వివేక్ నిర్ణయాన్ని ట్రంప్ మెచ్చుకున్నారు.
కాక్పిట్ అద్దంలో పగుళ్లు.. మరో బోయింగ్ విమానం అత్యవసర ల్యాండింగ్
డొనాల్డ్ ట్రంప్ విమర్శలపై వివేక్ స్పందించారు. ‘‘నన్ను విమర్శిస్తూ ట్రంప్ చేసిన పోస్టు చూశాను. ఆయన ప్రచార సలహాదారుల సూచనతో ఇలాంటి పరిస్థితి తలెత్తడం దురదృష్టకరం. ఇకపై స్నేహపూర్వకమైన ఆరోపణలు ఏ మాత్రం పనిచేయవని భావిస్తున్నా. ట్రంప్పై ప్రతివిమర్శలు చేయాలనుకోవడంలేదు. ఆయన 21వ శతాబ్దపు గొప్ప అధ్యక్షుడు. అయోవా ప్రచారంలో ట్రంప్ మద్దతుదారులను కలిశాను. వారంతా ఆయన అభ్యర్థిత్వంపై ఆందోళనగా ఉన్నారు’’అని వివేక్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ ప్రచారంలో అయోవాలో ట్రంప్ ముందంజలో ఉన్నారు. ఆయనకు 53.6 శాతం మంది మద్దతు తెలుపగా, వివేక్కు 7.6 శాతం మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారు. సోమవారం పలు మీడియా సంస్థలు అయోవా పోల్ సర్వేలను వెల్లడించనున్న నేపథ్యంలో ట్రంప్ విమర్శలు చర్చనీయాంశంగా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశీ వలసదారులంటే భారత్కు భయం
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. -
రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను ఖాళీ చేయించిన పోలీసులు గురువారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్ (యూసీఎల్ఏ)లోకి ప్రవేశించారు. -
లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్మిల్ వ్యాయామం.. అమెరికాలో ఆరేళ్ల బాలుడి మృతి
కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై బలవంతంగా పరిగెత్తించి అతడి మరణానికి కారణమయ్యాడు. -
యూఏఈలో మళ్లీ భారీవర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. -
ఒడెస్సాపై మళ్లీ క్షిపణి దాడి.. 14 మందికి గాయాలు
దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెస్సా ఓడ రేవు పట్టణంపై మళ్లీ రష్యా క్షిపణులు ప్రయోగించింది. వారంలో ఈ నగరంపై ఇది మూడో దాడి. -
కిమ్ ఆనందానికి ఏటా 25 మంది కన్యలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. -
22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా.. సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది. అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. -
చైనా రోడ్డు ప్రమాదంలో 48కి చేరిన మృతులు
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో రహదారి కోతకు గురై 24 వాహనాలు లోయలో పడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య గురువారం 48కి చేరుకుంది. -
విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఇందుకే..
విస్తరిస్తున్న విశ్వం అంచుల్లోని ‘కాస్మిక్ గ్లిచ్’ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. -
శక్స్గావ్ లోయలో చైనా నిర్మాణాలు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే)ని శక్స్గావ్ లోయలో చైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. -
బోయింగ్ విమానాల ప్రజావేగు మృతి.. 2 నెలల వ్యవధిలో రెండో ఘటన
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు ఉన్నాయని బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) జాషువా డీన్(45) మరణించారు. -
కాంగోలో కొత్తరకం ఎంపాక్స్
దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగు పడింది. -
యుద్ధాన్ని పూర్తిగా ఆపితేనే సంతకం
గాజా కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఇతర మధ్యవర్తుల తాజా ప్రతిపాదనను హమాస్ తీవ్రంగా పరిశీలిస్తోంది. -
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను సంతోష పెట్టడానికి ఏటా 25 మంది యువతులతో కూడిన బృందం పని చేస్తుందని తాజా కథనం వెల్లడించింది.