Congo Virus: ఫ్రాన్స్లో కాంగో వైరస్ కలవరం.. బ్రిటన్ అప్రమత్తం
ప్రాణాంతక కాంగో వైరస్ ఫ్రాన్స్కు విస్తరించింది. స్పెయిన్ సరిహద్దులో తొలి కేసు గుర్తించినట్లు ఫ్రాన్స్ వైద్య వర్గాలు వెల్లడించాయి.
ఇంటర్నెట్డెస్క్: ఇరాక్ను వణికించిన ప్రాణాంతక కాంగో ఫీవర్ వైరస్ (Crimean-Congo haemorrhagic fever) ఫ్రాన్స్కు వ్యాపించింది. స్పెయిన్ (Spain) సరిహద్దులో తొలి కేసు నమోదైనట్లు అక్కడి వైద్య వర్గాలు వెల్లడించాయి. నైరో వైరస్ అని పిలిచే క్రిమియన్-కాంగో హెమోరోజిక్ ఫీవర్ అనే వైరస్ ఎబోలా జాతికి చెందింది. ఈ వైరస్ సాధారణంగా జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. పశ్చిమ యూరప్, స్పెయిన్లోనూ గుర్తించారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ప్రధానంగా జంతువుల్లో కనిపించే రక్తం పీల్చే పేలు (Tick Bite) ద్వారా విస్తరిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన తొమ్మిది ప్రాధాన్యతా వ్యాధుల్లో సీసీహెచ్ఎఫ్ కూడా ఉండటం గమనార్హం.
రక్తం పీల్చే పేలే వాహకాలు
నైరోవైరస్ అనేది పేలు (Tick Bite) ద్వారా జంతువుల్లో వ్యాపిస్తుంది. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల్లో వైరస్ వాహకంగా ఈ పేలు పని చేస్తాయి. అలా వైరస్ బారినపడిన పశువుల రక్తాన్ని తాకినప్పుడు లేదా వైరస్ ఉన్న పేలు కుట్టినప్పుడు లేదా పశువధ కేంద్రాల్లోని స్త్రావాల ద్వారా మానవులకు సోకుతుంది. వైరస్ సోకిన వ్యక్తుల రక్తం, మలం, చెమట కణాల ద్వారా ఇతర వ్యక్తులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తులకు శ్వాస ఆడకపోవడం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, తీవ్ర జ్వరం తదితర లక్షణాలు కనిపిస్తాయి. కళ్లు, ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం జరిగి చివరకు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ వ్యాధి మరణాల రేటు 10 నుంచి 40 శాతం ఉందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. ఈ వైరస్ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్లు లేవు. వేగంగా వ్యాపించే ఈ వైరస్ వల్ల మానవ శరీరంలో అంతర్గతంగా, బాహ్య అవయవాల నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా ప్రాణాంతకమైన ఈ వ్యాధి సోకిన ప్రతి ఐదులో రెండో వంతు కేసుల్లో మరణాలు సంభవిస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.
బ్రిటన్ అప్రమత్తం
ఫ్రాన్స్లో కాంగో వైరస్ కేసు నమోదైన నేపథ్యంలో పొరుగు దేశం బ్రిటన్ అప్రమత్తమైంది. ఫ్రాన్స్లో వైరస్ సోకే అవకాశం ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని బ్రిటన్ పర్యాటకులను కోరింది. పేలు ద్వారా ఈ వైరస్ సంక్రమించే అవకాశం ఉన్నందున అవి కుట్టకుండా జాగ్రత్త పడాలని సూచించింది. ఫ్రాన్స్కు పొరుగున ఉన్న స్పెయిన్లో 2013 నుంచి ఆగస్టు 2022 మధ్య కాలంలో 12 కేసులు నమోదుకాగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఇరాక్లో ఈ వ్యాధి బారిన పడి గత ఏడాది 19 మంది మృత్యువాత పడ్డారు. ఈ వైరస్ను అరికట్టేందుకు ఇరాక్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలు పీపీఈ కిట్లు ధరించి పశువులపై క్రిమిసంహారకాలు పిచికారీ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!