ఉక్రెయిన్పై విరుచుకుపడ్డ రష్యా డ్రోన్లు
రష్యా క్షిపణలు, డ్రోన్లు బుధవారం తెల్లవారుజామున ఉక్రెయిన్పై విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా పౌరనివాస ప్రాంతాలకు తీవ్ర నష్టం కలిగించాయి.
8 మంది మృతి.. 25 మందికిపైగా ఆసుపత్రి పాలు
కీవ్: రష్యా క్షిపణలు, డ్రోన్లు బుధవారం తెల్లవారుజామున ఉక్రెయిన్పై విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా పౌరనివాస ప్రాంతాలకు తీవ్ర నష్టం కలిగించాయి. రాజధాని కీవ్ సమీపంలోని విద్యార్థుల డార్మిటరీపై జరిగిన డ్రోన్ల దాడిలో కొంతమంది విద్యార్థులు సహా ఏడుగురు పౌరులు మరణించారు. ర్జిచివ్ నగరంలోని ఓ హైస్కూల్ భవనాన్ని, రెండు డార్మిటరీలను డ్రోన్ దాడి పాక్షికంగా ధ్వంసం చేసిందని స్థానిక అధికారులు తెలిపారు. ఆ సమయానికి డార్మిటరీల్లో ఎంతమంది ఉన్నారనేదానిపై స్పష్టత లేదు. రష్యా ప్రయోగించిన మొత్తం 21 డ్రోన్లలో 16 డ్రోన్లను ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ నేలకూల్చిందని ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ వెల్లడించారు. వాటిలో ఎనిమిదింటిని రాజధాని సమీపంలో ధ్వంసం చేశారు. మరోపక్క ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ రష్యా దాడికి సంబంధించిన ఓ వీడియోను టెలిగ్రామ్లో పోస్టు చేశారు. అందులో ఆగ్నేయ నగరం జపోరిజియాలో ఓ తొమ్మిది అంతస్తుల భవనాన్ని క్షిపణి ఢీకొట్టిన సీసీటీవీ దృశ్యం కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి ధ్వంసమైన భవనం, అందులోంచి మంటలు చెలరేగుతున్న చిత్రాలను ఉక్రెయిన్ మీడియా ప్రసారం చేసింది. ఈ సంఘటనలో అయిదవ అంతస్తులోని శిథిలాల నుంచి 40 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక పోలీసు అధికారి అండ్రి నెబిటొవ్ తెలిపారు. 25 మంది ఆసుపత్రి పాలైనట్లు చెప్పారు. అయితే రష్యా క్షిపణిని అడ్డగించేందుకు ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ ప్రయోగించిన క్షిపణే ఆ భవనాన్ని ఢీకొట్టిందని జపోరిజియాలో రష్యా నియమించిన ప్రాంతీయ పరిపాలన అధికారి వ్లాదిమిర్ రోగోవ్ వెల్లడించారు. దీనికి రుజువులను ఆయన చూపించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?