నా సిబ్బందే.. నన్ను మోసం చేశారు
పాక్ రాజకీయాల్లో ఆదివారం మరో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. దీనికి ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ కేంద్ర బిందువయ్యారు.
అధికార రహస్యాల చట్టం సవరణ బిల్లుపై సంతకం చేయలేదు
పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ సంచలన ప్రకటన
ఇస్లామాబాద్: పాక్ రాజకీయాల్లో ఆదివారం మరో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. దీనికి ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ కేంద్ర బిందువయ్యారు. చట్టంగా రూపొందిన అధికార రహస్యాల, పాక్ సైన్య చట్టాల సవరణ బిల్లులపై తాను సంతకాలు చేయలేదంటూ బాంబు పేల్చారు. ‘‘అల్లాయే సాక్ష్యం. ఈ సవరణ బిల్లులపై సంతకాలు చేయలేదు. వీటితో విభేదించాను. సంతకం చేయని ఆ బిల్లులను నిర్దిష్ట సమయంలో తిరిగి పంపమని చెప్పాను. కానీ నా సిబ్బందే నన్ను మోసం చేశారు. నా అధికారాన్ని ఖాతరు చేయలేదు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం అటక్ జైల్లో ఉన్న తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ ఛైర్మన్ ఇమ్రాన్ఖాన్కు అల్వీ సన్నిహితుడని పేరు ఉంది. ఈ అధికార రహస్యాల చట్టం ప్రకారమే శనివారం ఇమ్రాన్ మరో సన్నిహితుడు షా మహమ్మద్ ఖురేషీని పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. అల్వీ ప్రకటనను న్యాయ మంత్రిత్వశాఖ ఖండించింది. రాజ్యాంగంలోని అధికరణం 5 కింద నిర్దిష్ట సమయంలో బిల్లులను అధ్యక్షుడు పంపించలేదని.. అందుకే అవి చట్టాల కింద మారాయని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెట్లపైనే కాలిపోయిన మృతదేహాలు.. కువైట్ అగ్నిప్రమాదంలో భయానక దృశ్యాలు
కువైట్ అగ్నిప్రమాద ఘటన (Kuwait fire tragedy)లో పలు విషాదకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదంలో చిక్కుకుపోయిన పలువురు కార్మికులు బయటకు వచ్చే క్రమంలో మెట్లపైనే ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియా వెల్లడించింది. -
బరువు పెరిగితే బుర్ర తగ్గుతుంది!
ఊబకాయం కారణంగా చిన్నారుల్లో మేధో సామర్థ్యం (ఐక్యూ) తగ్గే అవకాశం ఉందని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. -
మంగోలియాను పీడిస్తున్న జడ్
ప్రకృతి వైపరీత్యమైన జడ్ కారణంగా మంగోలియా సతమతమవుతోంది. తీవ్ర అనావృష్టి తరవాత అతి శీతల చలికాలం వస్తే దాన్ని మంగోలియాలో జడ్ అంటారు. -
క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా
ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా మరో ఐదు ప్రాంతాలపై రష్యా బలగాలు క్షిపణులు, డ్రోన్లతో మంగళవారం రాత్రి విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో 9 మంది మృత్యువాతపడ్డారు. -
కువైట్లో భారీ అగ్నిప్రమాదం.. 49 మంది దుర్మరణం
ఎడారి దేశం కువైట్లో భారతీయ కార్మికులు నివాసముండే అపార్ట్మెంట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -
ఉద్యోగినులతో ‘మస్క్’ లైంగిక సంబంధం
టెస్లా అధినేత ఎలాన్ మస్క్పై మరోసారి సంచలన కథనం ప్రచురితమైంది. తన సంస్థ స్పేస్ఎక్స్లో పని చేసే పలువురు మహిళా ఉద్యోగినులతో ఆయన లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు తాజా నివేదిక పేర్కొంది. -
నోబెల్ గ్రహీత యూనస్పై బంగ్లాలో అభియోగం దాఖలు
నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ (83), మరో 13 మంది కలిసి ఒక టెలికం కంపెనీ ఉద్యోగుల డివిడెండ్ల నుంచి 20 లక్షల డాలర్లకు పైగా స్వాహా చేశారని ఢాకాలోని ప్రత్యేక న్యాయస్థానంలో బుధవారం అభియోగం దాఖలైంది. -
ఉత్తర ఇజ్రాయెల్పై 215 రాకెట్లు
ఇజ్రాయెల్పై హెజ్బొల్లా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. మంగళవారం రాత్రి హెజ్బొల్లా సీనియర్ కమాండర్ తలెబ్ అబ్దుల్లా(55)ను దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసి హతమార్చింది. -
ఇటలీలో మహాత్ముడి విగ్రహంధ్వంసం చేసిన ‘ఖలిస్థానీలు’
ఖలిస్థాన్ ఉద్యమ సానుభూతిపరులు ఇటలీలో బుధవారం మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గురువారం నుంచి ఇక్కడ జరగనున్న జీ7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగా ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. -
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో భారతీయుడి మృత్యువాత
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో భారతీయుడు మృత్యువాతపడిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
కాల్పుల విరమణపై కుదరని ఏకాభిప్రాయం
కాల్పుల విరమణ విషయంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. -
కాంగోలో పడవ మునిగి 86 మంది మృతి
కాంగో రాజధాని నగరమైన కిన్షాసా సమీపంలోని క్వా నదిలో 271 మంది ప్రయాణికులతో వెళుతున్న పడవ మునిగి, 86 మంది మృతిచెందారు. -
కెనడాతో అదే సమస్య - జీ7 సదస్సు వేళ భారత్ ఆందోళన
తీవ్రవాదం, హింసను సమర్థించే భారత్ వ్యతిరేక శక్తులకు ఆశ్రయం కల్పించడమే కెనడాతో ఉన్న ప్రధాన సమస్య అని భారత విదేశాంగ పేర్కొంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దిండుతో ఊపిరాడకుండా చేసి.. బంగ్లా ఎంపీ హత్య కేసులో కీలక వివరాలు
-
పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా
-
లాభాల్లో ముగిసిన సూచీలు.. సరికొత్త రికార్డులు తాకి వెనక్కి
-
హైదరాబాద్లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
-
న్యూయార్క్ స్టేడియం వద్ద బుల్డోజర్లు.. కూల్చివేతకు రంగం సిద్ధం!
-
వాసుదేవరెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా