రామకృష్ణ మిషన్‌ అధ్యక్షుడి కన్నుమూత

రామకృష్ణ మిషన్‌ అధ్యక్షుడు స్వామి స్మరణానంద (95) మంగళవారం రాత్రి కోల్‌కతాలో కన్నుమూశారు. వయో సంబంధిత రుగ్మతలతో ఆయన తుదిశ్వాస విడిచారు.

Published : 27 Mar 2024 03:36 IST

కోల్‌కతా, దిల్లీ: రామకృష్ణ మిషన్‌ అధ్యక్షుడు స్వామి స్మరణానంద (95) మంగళవారం రాత్రి కోల్‌కతాలో కన్నుమూశారు. వయో సంబంధిత రుగ్మతలతో ఆయన తుదిశ్వాస విడిచారు. రామకృష్ణ మిషన్‌కు 2017లో స్మరణానంద 17వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న స్మరణానందను రామకృష్ణ మిషన్‌ సేవా ప్రతిష్ఠాన్‌లో (ఆసుపత్రి) జనవరి 29వ తేదీన చేర్పించారు. ఆ తర్వాత శ్వాసకోశ ఇబ్బంది తలెత్తడంతో ఈ నెల 3వ తేదీ నుంచి వెంటిలేటర్‌పై ఉంచారు. చికిత్స పొందుతూ మరణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని